Nirmal: బాసరలో విషాదం.. పుణ్య క్షేత్రంలో స్నానానికి వెళ్ళి ఐదుగురు మృత్యువాత
- బాసరలో విషాదం
- పుణ్య క్షేత్రంలో స్నానానికి వెళ్ళి ఐదుగురు మృత్యువాత
నిర్మల్ జిల్లాలోని బాసర పుణ్యక్షేత్ర దర్శనానికి వెళ్లి నది స్నానం ఆచరించడానికి వెళ్ళి ఐదుగురు యువకులు నదిలో మునిగి మరణించారు. ఇందులో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అన్నదమ్ములు, మిగతా ఇద్దరు వీరి సమీప బంధువులు ఉండటం వల్ల కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. హైదరాబాద్ చింతల్, దిల్సుక్ నగర్ కి చెందిన 18 మంది బాసర పుణ్యక్షేత్ర దర్శనానికి వెళ్లారు అందులో భాగంగా నది స్నానం ఆచరించడానికి బోట్ లో నది మధ్యలో గల దీవి లాంటి ప్రాంతానికి వెళ్ళారు. అక్కడ దిగి స్నానం చేస్తున్న క్రమంలో ఒక్కసారిగా కాలు జారి అక్కడున్న లోతులో మునిగి మరణించారు.
Also Read:Akhanda -2 : అఖండ-2 కొత్త షెడ్యూల్.. అక్కడే షూట్..
Also Read
మృతులు రాకేశ్ (20), మధన్ (18), భరత్(16), వినోద్ (19), హ్రితిక్ (22). ముఖ్యంగా భక్తులు అనుమతి ఉన్న స్నాన ఘాట్ లల్లో మాత్రమే స్నానం చేయాలి అంతే తప్ప నది లో ఎక్కడ పడితే అక్కడ స్నానాలు చేయకూడదు. కావున భక్తులందరూ జరుగుతున్న ప్రమాదాల్ని దృష్టి లో ఉంచుకొని జాగ్రత్త వహించాలని ఎస్పీ సూచించారు.
Also Read:Union Minister Piyush Goyal: పొగాకు రైతుల పిల్లలకు జపనీస్, జర్మన్, చైనా భాషలను నేర్పుతాం..
బాసర నది ప్రమాదం తెలిసిన వెంటనే జిల్లా ఎస్పీ డా. జానకి షర్మిల ఐపిఎస్ దీనిపై సమీక్షించారు. ఏఎస్పీ అవినాష్ కుమార్, సిఐ మల్లేష్ (ముధోల్), ఎస్సై శ్రీనివాసులతో కలిపి ఈ కేసు వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ నదిలో అనుమతి ఉన్న స్నాన ఘాట్ లో మాత్రమే భక్తులు స్నానాలు చేసే లాగా చర్యలు తీసుకోవాలని, అనుమతి లేని ప్రదేశాల్లో, ప్రమాదకరం గా ఉన్న ప్రదేశాల్లో భక్తులు స్నానానికి వెళ్లకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా ఎస్పీ డా.జి జానకి షర్మిల ఐపిఎస్ ఆదేశించారు.
తాజావార్తలు
-
Rakasa : ‘రాకాస’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్..
-
AshuReddy : నటి అషు రెడ్డిపై నమోదైన చీటింగ్ కేసు వివరాలు..పెద్ద స్కెచ్చే
-
IPL Historic Day: బ్యాట్స్మెన్ల మెరుపులు, భారీ స్కోర్లు, రికార్డు ఛేజింగ్లు.. ఐపీఎల్ చరిత్రలో చారిత్రాత్మక రోజు!
-
Gayapadda Simham: తరుణ్ భాస్కర్ ‘గాయపడ్డ సింహం’లో శ్రీ విష్ణు మేజిక్..
-
New OTT Rules 2026 : ఓటీటీలో కొత్త రూల్స్.. నిర్మాతలకు ‘షాక్’.. వసూళ్లు లేకపోతే రైట్స్ కట్!
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!