Train Accident: లోకమాన్య తిలక్ ఎక్స్ ప్రెస్ కోచ్ లో భారీ మంటలు.. భయంతో పరుగుతీసిన ప్రయాణికులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Train Accident: బేసిన్ బ్రిడ్జి సమీపంలోని లోకమాన్య తిలక్ ఎక్స్ప్రెస్ కోచ్లో గురువారం మంటలు చెలరేగడంతో అందులోని ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. రైలులో నుంచి ప్రయాణికులు పరుగెత్తుకుంటూ వస్తున్న దృశ్యాలు వీడియోలో కనిపిస్తున్నాయి. పరిస్థితి తీవ్రతను వీడియో రికార్డింగ్లో చూడవచ్చు, ఇక్కడ ప్రయాణీకులు త్వరగా ఎక్స్ప్రెస్ రైలును ఖాళీ చేయడం, సమీపంలోని లోకల్ రైలులో ఆశ్రయం పొందడం చూడవచ్చు. అగ్నిప్రమాదం నుండి తప్పించుకోవడానికి వారు త్వరత్వరగా సురక్షితంగా ఉండేందుకు భయంతో పరిగెత్తడం స్పష్టంగా వీడియోలో కనిపిస్తోంది.
Also Read
- Pakistan: శతాబ్ధం నాటి హిందూ ఆలయం కూల్చివేత.. పాక్పై భారత్ ఆగ్రహం..
- Off The Record: నెల్లూరులో జనసేన గూటికి చేరేందుకు నేతల ఆసక్తి వెనుక అసలు వ్యూహం..?
- Turkey-SCO: ‘ఎస్సీవో’లో మేము చేరతాం.. టర్కీ ప్రతిపాదన.. భారత్ అభ్యంతరం!
- Deputy CM Pawan Kalyan: ఎవ్వరినీ వదలని పవన్ కల్యాణ్.. ప్రధాని నుంచి జనసైనికుల వరకు..!
వివరాల్లోకి వెళితే..లోకమాన్య తిలక్ ఎక్స్ప్రెస్ రైలు ఈరోజు సాయంత్రం 6 గంటలకు చెన్నై నుండి ముంబైకి బయలుదేరింది. సాయంత్రం 6.48 గంటలకు చెన్నై బేసిన్ బ్రిడ్జి సమీపంలోకి రాగానే రైలు ఇంజన్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో షాక్కు గురైన లోకో పైలట్ వెంటనే రైలును ఆపేశాడు. రైల్వే పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. వారు వెంటనే లోపలికి వచ్చి ఇంజిన్లోని మంటలు ప్రయాణికుల కంపార్ట్మెంట్లకు వ్యాపించకుండా ఆపారు. మరో గంటపాటు పోరాడి ఇంజిన్ మంటలను ఆర్పివేశారు.
Read Also:Karthi: కార్తీ బుగ్గకు తన బుగ్గను ఆనించి మరీ ఫోటో దిగిన ఈ సుందరాంగిని గుర్తుపట్టారా..?
ఆ తర్వాత రీప్లేస్మెంట్ ఇంజన్ను అమర్చి రైలు అక్కడి నుంచి బయలుదేరేందుకు సిద్ధం చేశారు. ఇంజన్ హైవోల్టేజీ విద్యుత్ లైన్పై రుద్దడంతో మంటలు చెలరేగినట్లు సమాచారం. అయితే, ఖచ్చితమైన కారణం తెలియదు. విచారణ సాగుతోంది. అంతకుముందు రైలు ఇంజన్ మంటల్లో కాలిపోవడం చూసి ప్రయాణికులు కేకలు వేస్తూ కిందకు పరుగులు తీశారు. ఈ ఘటన అక్కడ తీవ్ర సంచలనం సృష్టించింది. ఈ రైలు మంటల కారణంగా అరక్కోణం మీదుగా నడిచే రైళ్లు స్వల్పంగా ఆలస్యమయ్యాయి.
Read Also:Balayya : నోరు జారిన బాలయ్య.. శ్రీలీలా సీక్రెట్ రివిల్..
తాజావార్తలు
-
Saidabad Steel Bridge :సైదాబాద్ స్టీల్ బ్రిడ్జి రెడీ.. రేపే సీఎం చేతుల మీదుగా ఓపెనింగ్
-
Pakistan: శతాబ్ధం నాటి హిందూ ఆలయం కూల్చివేత.. పాక్పై భారత్ ఆగ్రహం..
-
Off The Record: నెల్లూరులో జనసేన గూటికి చేరేందుకు నేతల ఆసక్తి వెనుక అసలు వ్యూహం..?
-
Turkey-SCO: ‘ఎస్సీవో’లో మేము చేరతాం.. టర్కీ ప్రతిపాదన.. భారత్ అభ్యంతరం!
-
Deputy CM Pawan Kalyan: ఎవ్వరినీ వదలని పవన్ కల్యాణ్.. ప్రధాని నుంచి జనసైనికుల వరకు..!
ట్రెండింగ్
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్ఫోన్ లాంచ్.!