Gurukula School:షేక్ పేట్ గురుకుల పాఠశాలలో అగ్ని ప్రమాదం.. ఇద్దరు విద్యార్థులకు తీవ్ర గాయాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gurukula School: దేశంలో వినాయకచవితి ఉత్సవాలు ఘనంగ జరుగుతున్నాయి. వాడవాడలా వినాయ విగ్రహాలు వెలశాయి. ఈనెల 18 నుంచి వినాయక చవితి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా గల్లీ గల్లీలో వినాయకుడిని పెట్టి పూజలు నిర్వహిస్తున్నారు. కొందరు పాఠశాల విద్యార్థులు వినాయక విగ్రహం పెట్టారు. అయితే వినాయక విగ్రహం వద్ద వున్న దీపం పాఠశాల విద్యార్థుల బెర్ సీట్ లకు అంటుకోవడంతో ఇద్దరు విద్యార్థులకు తీవ్ర గాయలయ్యయి. ఈ ఘటన ఫిలిం నగర్ పోలీస్టేషన్ పరిధిలోని షేక్ పేట్ గురుకుల పాఠశాలలో చోటుచేసుకుంది.
షేక్ పేట్ గురుకుల పాఠశాలలో అగ్ని ప్రమాదం జరిగింది. వినాయక చవితి కావడంతో విద్యార్థులు చెందా వేసుకుని హాస్టల్ గదిలో వినాయకుడిని ఏర్పాటు చేసుకున్నారు. రాత్రి పూజలో బాగంగా దీపం వెలిగించారు. దీపం ఆరిపోకుండా చూడడం కోసం చుట్టూ దుప్పట్లతో తెర ఏర్పాటు చేసుకున్నారు. అయితే.. గాలికి దుప్పటికి మంటలు అంటుకుని అగ్నిప్రమాదం జరిగింది. అయితే రాత్రి కావడంతో విద్యార్థులు గాఢ నిద్రలోకి జారిపోయారు. దుప్పట్లకు మంటలు అంటుకోవడం ఎవరూ గమనించలేదు. గదిలో దట్టమైన పొగ అలుముకోవడంతో కొందరు విద్యార్థులు కళ్లు తెరచిచూడగా గది మొత్తం మంటలు చెలరేగాయి. విద్యార్థులు కాపాడండి అంటూ అరవడం మొదలుపెట్టారు. మరికొందరు అక్కడనుంచి చాకచక్యంగా గదినుంచి బటయటకు పరుగులు తీశారు. అయితే మంటల్లో ఇద్దరు విద్యార్థులు చిక్కుకున్నారు. ఎలా బయటకు రావాలో వారికి అర్థంకాలేదు. ఎంత అరచినా ఎవరు కాపాడేందుకు ముందుకు రాలేదు.
Also Read
- Vinukonda: అత్యాచారం చేశాడంటూ ఫిర్యాదు.. పోలీస్ స్టేషన్ లో లొంగిపోయిన మాజీ సీఐ చినమల్లయ్య.!
- Abhijeet Dipke: అమెరికా నుంచి ఢిల్లీ చేరుకున్న కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు.. నేటి నుంచి నిరసనలు
- Vladimir Putin: "భారత్ను భయపెట్టాలని చూస్తే మీకే నష్టం".. ఆ దేశాలకు పుతిన్ స్ట్రాంగ్ వార్నింగ్!
- Nashik TCS Case: నాసిక్ టీసీఎస్ కేసులో షాకింగ్ ట్విస్ట్.. వెలుగులోకి సంచలన విషయాలు..
నీరజ్, మరో విద్యార్థి మంటల్లో చిక్కుకుపోవడంతో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. గురుకుల యాజమాన్యం ఇద్దరు పిల్లలను కాపాడి ఉస్మానియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. దీనిపై పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలికి చేరుకున్న ఫిలిం నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇంత జరుగుతున్న గురుకుల యాజమాన్యం ఏంచేస్తున్నారని? పిల్లల దగ్గర అధికారులు ఎందుకు లేదని? మంటలు అంటుకుని ప్రమాదం జరిగినా అప్పటి వరకు అక్కడ ఎవరూ లేకపోవడం పై పలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే విద్యార్థుల తల్లిదండ్రులు గురుకుల అధికారులపై మండిపడుతున్నారు. సకాలంలో విద్యార్థులు బయటకు పరిగెత్తటంతో తప్పిన ముప్పు తప్పిందని, ఇద్దరు విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంటలు అంటుకున్నప్పుడే స్పందించి ఉంటే ఆ ఇద్దరు విద్యార్థులకు కూడా ప్రమాదం తప్పేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Vishal : హీరో విశాల్ తీరు పై ఆగ్రహం వ్యక్తం చేసిన మద్రాస్ హైకోర్ట్…
తాజావార్తలు
-
India Forex Reserves: రూపాయి స్థిరత్వానికి బలం.. పెరిగిన విదేశీ మారక నిల్వలు.. 938 మిలియన్ డాలర్ల వృద్ధి
-
Vinukonda: అత్యాచారం చేశాడంటూ ఫిర్యాదు.. పోలీస్ స్టేషన్ లో లొంగిపోయిన మాజీ సీఐ చినమల్లయ్య.!
-
Peddi: జాన్వీ కపూర్ పాత్రపై డైరెక్టర్ బుచ్చిబాబు సంచలన వ్యాఖ్యలు!
-
Abhijeet Dipke: అమెరికా నుంచి ఢిల్లీ చేరుకున్న కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు.. నేటి నుంచి నిరసనలు
-
Vladimir Putin: “భారత్ను భయపెట్టాలని చూస్తే మీకే నష్టం”.. ఆ దేశాలకు పుతిన్ స్ట్రాంగ్ వార్నింగ్!
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!