Gurukula School:షేక్ పేట్ గురుకుల పాఠశాలలో అగ్ని ప్రమాదం.. ఇద్దరు విద్యార్థులకు తీవ్ర గాయాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gurukula School: దేశంలో వినాయకచవితి ఉత్సవాలు ఘనంగ జరుగుతున్నాయి. వాడవాడలా వినాయ విగ్రహాలు వెలశాయి. ఈనెల 18 నుంచి వినాయక చవితి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా గల్లీ గల్లీలో వినాయకుడిని పెట్టి పూజలు నిర్వహిస్తున్నారు. కొందరు పాఠశాల విద్యార్థులు వినాయక విగ్రహం పెట్టారు. అయితే వినాయక విగ్రహం వద్ద వున్న దీపం పాఠశాల విద్యార్థుల బెర్ సీట్ లకు అంటుకోవడంతో ఇద్దరు విద్యార్థులకు తీవ్ర గాయలయ్యయి. ఈ ఘటన ఫిలిం నగర్ పోలీస్టేషన్ పరిధిలోని షేక్ పేట్ గురుకుల పాఠశాలలో చోటుచేసుకుంది.
షేక్ పేట్ గురుకుల పాఠశాలలో అగ్ని ప్రమాదం జరిగింది. వినాయక చవితి కావడంతో విద్యార్థులు చెందా వేసుకుని హాస్టల్ గదిలో వినాయకుడిని ఏర్పాటు చేసుకున్నారు. రాత్రి పూజలో బాగంగా దీపం వెలిగించారు. దీపం ఆరిపోకుండా చూడడం కోసం చుట్టూ దుప్పట్లతో తెర ఏర్పాటు చేసుకున్నారు. అయితే.. గాలికి దుప్పటికి మంటలు అంటుకుని అగ్నిప్రమాదం జరిగింది. అయితే రాత్రి కావడంతో విద్యార్థులు గాఢ నిద్రలోకి జారిపోయారు. దుప్పట్లకు మంటలు అంటుకోవడం ఎవరూ గమనించలేదు. గదిలో దట్టమైన పొగ అలుముకోవడంతో కొందరు విద్యార్థులు కళ్లు తెరచిచూడగా గది మొత్తం మంటలు చెలరేగాయి. విద్యార్థులు కాపాడండి అంటూ అరవడం మొదలుపెట్టారు. మరికొందరు అక్కడనుంచి చాకచక్యంగా గదినుంచి బటయటకు పరుగులు తీశారు. అయితే మంటల్లో ఇద్దరు విద్యార్థులు చిక్కుకున్నారు. ఎలా బయటకు రావాలో వారికి అర్థంకాలేదు. ఎంత అరచినా ఎవరు కాపాడేందుకు ముందుకు రాలేదు.
Also Read
- Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
- Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
- Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
- North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
నీరజ్, మరో విద్యార్థి మంటల్లో చిక్కుకుపోవడంతో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. గురుకుల యాజమాన్యం ఇద్దరు పిల్లలను కాపాడి ఉస్మానియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. దీనిపై పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలికి చేరుకున్న ఫిలిం నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇంత జరుగుతున్న గురుకుల యాజమాన్యం ఏంచేస్తున్నారని? పిల్లల దగ్గర అధికారులు ఎందుకు లేదని? మంటలు అంటుకుని ప్రమాదం జరిగినా అప్పటి వరకు అక్కడ ఎవరూ లేకపోవడం పై పలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే విద్యార్థుల తల్లిదండ్రులు గురుకుల అధికారులపై మండిపడుతున్నారు. సకాలంలో విద్యార్థులు బయటకు పరిగెత్తటంతో తప్పిన ముప్పు తప్పిందని, ఇద్దరు విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంటలు అంటుకున్నప్పుడే స్పందించి ఉంటే ఆ ఇద్దరు విద్యార్థులకు కూడా ప్రమాదం తప్పేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Vishal : హీరో విశాల్ తీరు పై ఆగ్రహం వ్యక్తం చేసిన మద్రాస్ హైకోర్ట్…
తాజావార్తలు
-
Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
-
Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
-
North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
ట్రెండింగ్
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!