Gurukula School:షేక్ పేట్ గురుకుల పాఠశాలలో అగ్ని ప్రమాదం.. ఇద్దరు విద్యార్థులకు తీవ్ర గాయాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gurukula School: దేశంలో వినాయకచవితి ఉత్సవాలు ఘనంగ జరుగుతున్నాయి. వాడవాడలా వినాయ విగ్రహాలు వెలశాయి. ఈనెల 18 నుంచి వినాయక చవితి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా గల్లీ గల్లీలో వినాయకుడిని పెట్టి పూజలు నిర్వహిస్తున్నారు. కొందరు పాఠశాల విద్యార్థులు వినాయక విగ్రహం పెట్టారు. అయితే వినాయక విగ్రహం వద్ద వున్న దీపం పాఠశాల విద్యార్థుల బెర్ సీట్ లకు అంటుకోవడంతో ఇద్దరు విద్యార్థులకు తీవ్ర గాయలయ్యయి. ఈ ఘటన ఫిలిం నగర్ పోలీస్టేషన్ పరిధిలోని షేక్ పేట్ గురుకుల పాఠశాలలో చోటుచేసుకుంది.
షేక్ పేట్ గురుకుల పాఠశాలలో అగ్ని ప్రమాదం జరిగింది. వినాయక చవితి కావడంతో విద్యార్థులు చెందా వేసుకుని హాస్టల్ గదిలో వినాయకుడిని ఏర్పాటు చేసుకున్నారు. రాత్రి పూజలో బాగంగా దీపం వెలిగించారు. దీపం ఆరిపోకుండా చూడడం కోసం చుట్టూ దుప్పట్లతో తెర ఏర్పాటు చేసుకున్నారు. అయితే.. గాలికి దుప్పటికి మంటలు అంటుకుని అగ్నిప్రమాదం జరిగింది. అయితే రాత్రి కావడంతో విద్యార్థులు గాఢ నిద్రలోకి జారిపోయారు. దుప్పట్లకు మంటలు అంటుకోవడం ఎవరూ గమనించలేదు. గదిలో దట్టమైన పొగ అలుముకోవడంతో కొందరు విద్యార్థులు కళ్లు తెరచిచూడగా గది మొత్తం మంటలు చెలరేగాయి. విద్యార్థులు కాపాడండి అంటూ అరవడం మొదలుపెట్టారు. మరికొందరు అక్కడనుంచి చాకచక్యంగా గదినుంచి బటయటకు పరుగులు తీశారు. అయితే మంటల్లో ఇద్దరు విద్యార్థులు చిక్కుకున్నారు. ఎలా బయటకు రావాలో వారికి అర్థంకాలేదు. ఎంత అరచినా ఎవరు కాపాడేందుకు ముందుకు రాలేదు.
Also Read
నీరజ్, మరో విద్యార్థి మంటల్లో చిక్కుకుపోవడంతో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. గురుకుల యాజమాన్యం ఇద్దరు పిల్లలను కాపాడి ఉస్మానియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. దీనిపై పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలికి చేరుకున్న ఫిలిం నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇంత జరుగుతున్న గురుకుల యాజమాన్యం ఏంచేస్తున్నారని? పిల్లల దగ్గర అధికారులు ఎందుకు లేదని? మంటలు అంటుకుని ప్రమాదం జరిగినా అప్పటి వరకు అక్కడ ఎవరూ లేకపోవడం పై పలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే విద్యార్థుల తల్లిదండ్రులు గురుకుల అధికారులపై మండిపడుతున్నారు. సకాలంలో విద్యార్థులు బయటకు పరిగెత్తటంతో తప్పిన ముప్పు తప్పిందని, ఇద్దరు విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంటలు అంటుకున్నప్పుడే స్పందించి ఉంటే ఆ ఇద్దరు విద్యార్థులకు కూడా ప్రమాదం తప్పేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Vishal : హీరో విశాల్ తీరు పై ఆగ్రహం వ్యక్తం చేసిన మద్రాస్ హైకోర్ట్…
తాజావార్తలు
-
Story Board : అసలు UPI ఉద్దేశమేంటి.. దేశం మళ్లీ క్యాష్ ఎకానమీకి ఓటేస్తుందా..?
-
Etela Rajender : తెలంగాణకు బీసీ సీఎం.. ఈటల కీలక వ్యాఖ్యలు
-
OTR : బొత్స అనూషకు భీమిలి వైసీపీ బాధ్యతలు .. గంటాను ఢీ కొట్టగలరా?
-
OTR: ఆక్వా రైతుల ఆగ్రహం.. ఉద్యమానికి రెడీ?
-
El Nino: భారత్కు రానున్న రోజుల్లో పెను ప్రమాదం.. ఎల్నితోపై శాస్త్రవేత్తల హెచ్చరిక..
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!