Fire Accident: విశాఖలోని కంటైనర్ టెర్మినల్లో స్వల్ప అగ్ని ప్రమాదం జరిగింది. చైనా నుంచి లిథియం బ్యాటరీలతో వచ్చిన కంటైనర్లో మంటలు చెలరేగాయి. దట్టమైన పొగ కమ్మేయడంతో పోర్ట్ ఫైర్ సిబ్బంది రంగంలోకి దిగి మంటలను ఆర్పివేశారు. ఉదయం 11 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. గత నెల 28న చైనా నుంచి వచ్చిన కంటైనర్ కోల్కతాకు వెళ్లాల్సి వుంది. ఇవాళ ట్రాలర్పై లోడ్ చేసిన కొద్ది సేపటికే ప్రమాదం జరిగింది. ఈ ఫైర్ యాక్సిడెంట్కు గల కారణాలపై అంతర్గత విచారణ జరుగుతోంది. కంటైనర్లలో లిథియం బ్యాటరీలు ఉన్నట్లు గుర్తించారు.
Read Also: Tragedy: చాయ్పత్తా అనుకుని పురుగుల మందుతో టీ.. వృద్ధ దంపతులు మృతి