NTV Telugu Site icon

Tragedy: దీపావళి వేళ అపశృతి.. పూరింటిపై తారాజువ్వ పడి మహిళ సజీవదహనం

Fire Accident

Fire Accident

Tragedy: దీపావళి పండుగ వేళ కోనసీమలో అపశృతి చోటుచేసుకుంది. అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం ఆవిడి కట్లమ్మ అమ్మవారి ఆలయం వద్ద పూరింటిపై తారాజువ్వ పడి అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఓ కుటుంబానికి చెందిన పెద్దపూడి మంగాదేవి సజీవ దహనం అయింది. భర్త దుర్గారావుకు తీవ్ర గాయాలు కాగా పరిస్థితి విషమంగా ఉంది. వీరి కుమారులు ఇద్దరు కూడా మంటల్లో చిక్కుకొని గాయపడ్డారు.

Also Read: Diwali: ఆ రాష్ట్రంలోని 7 గ్రామాల్లో 22 ఏళ్లుగా నిశ్శబ్ధ దీపావళి.. కారణం ఇదే..

గాయపడిన ముగ్గురిని కొత్తపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఇంటిలో పెట్రోల్ నిల్వలు ఉండడం వల్ల మంటలు పెద్దగా వ్యాపించి ఈ దారుణం చోటుచేసుకుంది. విషయం తెలిసిన వెంటనే పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని గాయపడిన వారిని బయటికి తీసుకొచ్చి 108 వాహనం సహాయంతో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మంటల్లో చిక్కుకున్న మంగాదేవి అప్పటికే సజీవ దహనం అయ్యింది. కొత్తపేట పోలీసులు ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.