Mother Dead Body: పింఛన్ డబ్బుల కోసం ఆరేళ్ల పాటు తల్లి శవంతోనే గడిపిన కొడుకు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mother Dead Body: ఇటలీలో డబ్బు కోసం తల్లీకొడుకుల మధ్య ఇబ్బందికర ఘటన వెలుగులోకి వచ్చింది. ఇక్కడ ఒక కొడుకు తన తల్లి చనిపోయిన తర్వాత పింఛను పొందడం ఆగిపోకూడదని ఆమె అంత్యక్రియలు చేయలేదు. ఈ వ్యక్తి తన తల్లి మృతదేహంతో ఆరేళ్లుగా ఇంట్లోనే ఉన్నాడు. ఆమె మరణం గురించి ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడ్డాడు. తర్వాత హాయిగా తల్లి పింఛను డబ్బులు తీసుకుంటూ ఎంజాయ్ చేశాడు.
Read Also:KTR: నేడు దండు మల్కాపురానికి కేటీఆర్.. టాయ్స్ పార్కు శంకుస్థాపన
Also Read
- UK: బ్రిటన్ ప్రధానిగా ఆండీ బర్న్హామ్.. సోమవారం బాధ్యతలు స్వీకరణ
- Ponnam Prabhakar: అలాంటి వాహనాలను సీజ్ చేయండి.. మంత్రి పొన్నం ప్రభాకర్ సీరియస్ వార్నింగ్..
- Sonam Wangchuk: సోనం వాంగ్చుక్ దీక్షలో నవ్వులు.. పువ్వులు.. ఏం జరిగిందంటే..!
- Gambhir-Kohli: గంభీర్-కోహ్లీ మధ్య ‘కోల్డ్ వార్’.. తొలి సారి నోరు విప్పిన టీమిండియా కోచ్!
ఇటలీలోని తన నివాసంలో తన 86 ఏళ్ల తల్లి మృతదేహంతో నివసించినందుకు 60 ఏళ్ల వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. తన తల్లి పింఛన్ డబ్బులు రాబట్టేందుకే ఇలా చేశానని సదరు వ్యక్తి ఒప్పుకున్నాడు. కోవిడ్-19 మహమ్మారి సమయంలో ఇటలీకి చెందిన 86 ఏళ్ల హెల్గా మారియా హెంగ్బర్త్ తన ఆరోగ్య బీమా కార్డును సంవత్సరాలుగా తీసుకోలేదు. దీని తర్వాత పెన్షన్ విభాగానికి సంబంధించిన అధికారులు హెల్గా మారియా హెంగ్బర్త్ను సంప్రదించడానికి ప్రయత్నించారు. కానీ ఆమెను కలువలేకపోయారు. దీంతో పోలీసులు, అగ్నిమాపక యంత్రాలు మే 25 న ఉత్తర ఇటలీలోని వెరోనాలోని అతని అపార్ట్మెంట్ కు చేరుకున్నాయి. అనుమానం వచ్చిన పోలీసులు అతని ఇంటిలోకి వెళ్లారు. ఇక్కడ విచారణలో, అధికారులు హెల్గా సగం కుళ్ళిన మృతదేహాన్ని ఒక బ్యాగ్లో ప్యాక్ చేసి, మంచం మీద ఉంచడం గమనించారు. ఆ సమయంలో హెల్గా కుమారుడు లేకపోవడంతో ఈ సెర్చ్ ఆపరేషన్ జరిగింది. ఆ తర్వాత నిందితుడైన కొడుకు పోలీసుల ఎదుట లొంగిపోవడంతో కేసు వెలుగులోకి వచ్చింది.
Read Also:Toll Gate: గేటు తీయడం లేటయిందని.. టోల్ ఉద్యోగిని చంపేశారు
పోలీసుల కథనం ప్రకారం, 60 ఏళ్ల నిందితుడు కొడుకు తన తల్లి జర్మనీలోని తన ఇంటికి తిరిగి వెళ్లిందని తన పొరుగువారితో చెప్పాడని తెలిసింది. అదే సమయంలో నిందితుడు ప్రతి సంవత్సరం దాదాపు 30,000 యూరోలు (దాదాపు రూ. 26.54 లక్షలు) విత్డ్రా చేసేవారు. తన తల్లి మృతదేహాన్ని ఉపయోగించి మొత్తం రూ.1.59 కోట్లు వసూలు చేసినట్లు పోలీసులు తెలిపారు.
తాజావార్తలు
-
UK: బ్రిటన్ ప్రధానిగా ఆండీ బర్న్హామ్.. సోమవారం బాధ్యతలు స్వీకరణ
-
Ponnam Prabhakar: అలాంటి వాహనాలను సీజ్ చేయండి.. మంత్రి పొన్నం ప్రభాకర్ సీరియస్ వార్నింగ్..
-
Sonam Wangchuk: సోనం వాంగ్చుక్ దీక్షలో నవ్వులు.. పువ్వులు.. ఏం జరిగిందంటే..!
-
Gambhir-Kohli: గంభీర్-కోహ్లీ మధ్య ‘కోల్డ్ వార్’.. తొలి సారి నోరు విప్పిన టీమిండియా కోచ్!
-
Pakistan: పాక్లో 5వ రాష్ట్రంగా గిల్గిట్-బాల్టిస్తాన్.. భారత్ను కవ్వించే చర్య..
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?