Mother Dead Body: పింఛన్ డబ్బుల కోసం ఆరేళ్ల పాటు తల్లి శవంతోనే గడిపిన కొడుకు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mother Dead Body: ఇటలీలో డబ్బు కోసం తల్లీకొడుకుల మధ్య ఇబ్బందికర ఘటన వెలుగులోకి వచ్చింది. ఇక్కడ ఒక కొడుకు తన తల్లి చనిపోయిన తర్వాత పింఛను పొందడం ఆగిపోకూడదని ఆమె అంత్యక్రియలు చేయలేదు. ఈ వ్యక్తి తన తల్లి మృతదేహంతో ఆరేళ్లుగా ఇంట్లోనే ఉన్నాడు. ఆమె మరణం గురించి ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడ్డాడు. తర్వాత హాయిగా తల్లి పింఛను డబ్బులు తీసుకుంటూ ఎంజాయ్ చేశాడు.
Read Also:KTR: నేడు దండు మల్కాపురానికి కేటీఆర్.. టాయ్స్ పార్కు శంకుస్థాపన
Also Read
- ODI World Cup 2027: ఒకప్పుడు క్రికెట్ ప్రపంచాన్ని ఏలిన టీమ్.. ఇప్పుడు వరల్డ్కప్ బెర్త్ కోసం పాకులాట!
- 64MP కెమెరా, 9.49 మి.మీ. మందం, AI కెమెరా ఫీచర్లతో ఆగస్టు 25న రానున్న Boltt Ace 5G..!
- Junior Doctors Strike: ఏపీలో జూడాల సమ్మె సైరన్
- Solar Eclipse 2026: రేపే సంపూర్ణ సూర్యగ్రహణం.. ఎక్కడ కనిపిస్తుంది..? భారత్లో పరిస్థితి ఏంటి..? పూర్తి వివరాలు
ఇటలీలోని తన నివాసంలో తన 86 ఏళ్ల తల్లి మృతదేహంతో నివసించినందుకు 60 ఏళ్ల వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. తన తల్లి పింఛన్ డబ్బులు రాబట్టేందుకే ఇలా చేశానని సదరు వ్యక్తి ఒప్పుకున్నాడు. కోవిడ్-19 మహమ్మారి సమయంలో ఇటలీకి చెందిన 86 ఏళ్ల హెల్గా మారియా హెంగ్బర్త్ తన ఆరోగ్య బీమా కార్డును సంవత్సరాలుగా తీసుకోలేదు. దీని తర్వాత పెన్షన్ విభాగానికి సంబంధించిన అధికారులు హెల్గా మారియా హెంగ్బర్త్ను సంప్రదించడానికి ప్రయత్నించారు. కానీ ఆమెను కలువలేకపోయారు. దీంతో పోలీసులు, అగ్నిమాపక యంత్రాలు మే 25 న ఉత్తర ఇటలీలోని వెరోనాలోని అతని అపార్ట్మెంట్ కు చేరుకున్నాయి. అనుమానం వచ్చిన పోలీసులు అతని ఇంటిలోకి వెళ్లారు. ఇక్కడ విచారణలో, అధికారులు హెల్గా సగం కుళ్ళిన మృతదేహాన్ని ఒక బ్యాగ్లో ప్యాక్ చేసి, మంచం మీద ఉంచడం గమనించారు. ఆ సమయంలో హెల్గా కుమారుడు లేకపోవడంతో ఈ సెర్చ్ ఆపరేషన్ జరిగింది. ఆ తర్వాత నిందితుడైన కొడుకు పోలీసుల ఎదుట లొంగిపోవడంతో కేసు వెలుగులోకి వచ్చింది.
Read Also:Toll Gate: గేటు తీయడం లేటయిందని.. టోల్ ఉద్యోగిని చంపేశారు
పోలీసుల కథనం ప్రకారం, 60 ఏళ్ల నిందితుడు కొడుకు తన తల్లి జర్మనీలోని తన ఇంటికి తిరిగి వెళ్లిందని తన పొరుగువారితో చెప్పాడని తెలిసింది. అదే సమయంలో నిందితుడు ప్రతి సంవత్సరం దాదాపు 30,000 యూరోలు (దాదాపు రూ. 26.54 లక్షలు) విత్డ్రా చేసేవారు. తన తల్లి మృతదేహాన్ని ఉపయోగించి మొత్తం రూ.1.59 కోట్లు వసూలు చేసినట్లు పోలీసులు తెలిపారు.
తాజావార్తలు
-
Ajinkya Rahane: టీమిండియా టెస్ట్ టీమ్ కోసం మేం ముగ్గురం ఎంతో కష్టపడ్డాం!
-
IRUMUDI : ఇరుముడి కథ, కథనం ఏంటో చెప్పేసిన దర్శకుడు శివ నిర్వాణ
-
ODI World Cup 2027: ఒకప్పుడు క్రికెట్ ప్రపంచాన్ని ఏలిన టీమ్.. ఇప్పుడు వరల్డ్కప్ బెర్త్ కోసం పాకులాట!
-
RD Burman Biopic: రాజేష్ ఖన్నాగా అక్షయ్, మెహమూద్గా ఇమ్రాన్… త్వరలోనే ఆర్డీ బర్మన్ బయోపిక్ షూటింగ్
-
64MP కెమెరా, 9.49 మి.మీ. మందం, AI కెమెరా ఫీచర్లతో ఆగస్టు 25న రానున్న Boltt Ace 5G..!
ట్రెండింగ్
-
7,000mAh బ్యాటరీ, 50MP సోనీ కెమెరా, FHD+ LCD 120Hz డిస్ప్లేతో వచ్చేందుకు సిద్దమైన Moto G Max..!
-
రూ.8,499కే Lava Smart 4 లాంచ్.. మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 5000mAh బ్యాటరీ, 90Hz LCD డిస్ప్లేతో బడ్జెట్ ఫోన్..!
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!