Wayanad Landslides : బీమా కంపెనీలు ఈ పనిని త్వరగా పూర్తి చేయాలని..ఆర్థిక మంత్రిత్వ శాఖ అల్టిమేటం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Wayanad Landslides : కేరళలోని వాయనాడ్లో కొండచరియలు విరిగిపడటంతో భారీ విధ్వంసం సంభవించింది. ఇప్పటి వరకు 323 మంది ప్రాణాలు కోల్పోగా, సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇదిలా ఉండగా బాధితులను ఆదుకునేందుకు ఆర్థిక శాఖ ముందుకు వచ్చింది. బాధితులకు వీలైనంత త్వరగా సహాయం అందించాలని కోరుతూ ఎల్ఐసీ సహా అన్ని ప్రభుత్వ రంగ బీమా కంపెనీలకు మంత్రిత్వ శాఖ శనివారం అల్టిమేటం ఇచ్చింది. కేరళలోని వాయనాడ్, ఇతర జిల్లాల్లో కొండచరియలు విరిగిపడిన బాధితులు, వారి కుటుంబాల క్లెయిమ్లను త్వరితగతిన ప్రాసెస్ చేసి, వారికి డబ్బు డెలివరీ చేయాలని ఆర్థిక మంత్రిత్వ శాఖ శనివారం LIC , ఇతర బీమా కంపెనీలను కోరింది.
Read Also:Bears Hulchul: కళ్యాణదుర్గంలో ఎలుగుబంట్లు హల్చల్.. భయం గుప్పిట్లో ప్రజలు
Also Read
- Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
- RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
- Twisha Sharma: ట్విషా శర్మ మృతి కేసులో భర్త సమర్థ్ సింగ్కు షాక్.. న్యాయ వృత్తి నుంచి సస్పెండ్
- Abhishek Sharma: మళ్లీ రికార్డుల వేట.. కాటేరమ్మ కొడుకు అరుదైన రికార్డు..
ఆర్థిక మంత్రిత్వ శాఖ సోషల్ మీడియాలో ఈ మేరకు ఓ పోస్ట్ చేసింది. కంపెనీ వెబ్సైట్, SMS మొదలైన వాటి ద్వారా మీ పాలసీదారులకు వీలైనంత త్వరగా చేరువ కావాలని కోరింది. ఈ జిల్లాల నుంచి గరిష్ఠ క్లెయిమ్లు అందుతున్నాయి. దురదృష్టవశాత్తు కొండచరియలు విరిగిపడిన ఘటన, కేరళలో కురుస్తున్న భారీ వర్షాల దృష్ట్యా ఆర్థిక మంత్రిత్వ శాఖ కఠిన ఆదేశాలు జారీ చేసింది. ఎల్ఐసి, నేషనల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్, న్యూ ఇండియా అస్యూరెన్స్, ఓరియంటల్ ఇన్సూరెన్స్, యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్తో సహా ప్రభుత్వ రంగ సాధారణ బీమా కంపెనీలను విపత్తు బాధితులకు అన్ని విధాలా సహాయం అందించాలని ప్రభుత్వం ఆదేశించింది. ప్రజల బీమా క్లెయిమ్లను త్వరగా పరిష్కరించి చెల్లింపులు చేయాలని ప్రభుత్వం బీమా కంపెనీలను కోరింది.
Read Also:Cinema News : సోషల్ మీడియాలో ట్రోలింగ్ లో ట్రెండింగ్ ఉన్న స్టార్ హీరో..?
పీఎం జీవన్ జ్యోతి ఇన్సూరెన్స్ క్లెయిమ్
మంత్రిత్వ శాఖ ఆదేశాలలో, ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన కింద పాలసీ హోల్డర్లకు క్లెయిమ్ మొత్తాన్ని త్వరితగతిన పంపిణీ చేయాలని LICని కోరింది. క్లెయిమ్లను త్వరితగతిన పరిష్కరించేందుకు.. వారి డబ్బు ప్రజలకు చేరేలా చూసేందుకు అన్ని బీమా కంపెనీలతో సమన్వయం చేసుకోవాలని జనరల్ ఇన్సూరెన్స్ కౌన్సిల్ను కోరింది.
తాజావార్తలు
-
Off The Record : గుంటూరు జిల్లాలో ఆ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు అందినకాడికి దోచేస్తున్నారా..?
-
Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
-
Off The Record : అన్నిటికీ సీఎం మాత్రమేనా.. మంత్రులు స్పందించరా..?
-
Story Board: దొరికిపోయిన బ్లాక్ టిక్కెట్ల ముఠా..
-
RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!