Wayanad Landslides : బీమా కంపెనీలు ఈ పనిని త్వరగా పూర్తి చేయాలని..ఆర్థిక మంత్రిత్వ శాఖ అల్టిమేటం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Wayanad Landslides : కేరళలోని వాయనాడ్లో కొండచరియలు విరిగిపడటంతో భారీ విధ్వంసం సంభవించింది. ఇప్పటి వరకు 323 మంది ప్రాణాలు కోల్పోగా, సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇదిలా ఉండగా బాధితులను ఆదుకునేందుకు ఆర్థిక శాఖ ముందుకు వచ్చింది. బాధితులకు వీలైనంత త్వరగా సహాయం అందించాలని కోరుతూ ఎల్ఐసీ సహా అన్ని ప్రభుత్వ రంగ బీమా కంపెనీలకు మంత్రిత్వ శాఖ శనివారం అల్టిమేటం ఇచ్చింది. కేరళలోని వాయనాడ్, ఇతర జిల్లాల్లో కొండచరియలు విరిగిపడిన బాధితులు, వారి కుటుంబాల క్లెయిమ్లను త్వరితగతిన ప్రాసెస్ చేసి, వారికి డబ్బు డెలివరీ చేయాలని ఆర్థిక మంత్రిత్వ శాఖ శనివారం LIC , ఇతర బీమా కంపెనీలను కోరింది.
Read Also:Bears Hulchul: కళ్యాణదుర్గంలో ఎలుగుబంట్లు హల్చల్.. భయం గుప్పిట్లో ప్రజలు
Also Read
- Elephant Death: విద్యుత్ షాక్తో ఏనుగు మృతి.. పవన్ కల్యాణ్ సీరియస్.. కీలక ఆదేశాలు
- Sofa Cleaning Tips: సోఫాపై మొండి మరకలా? ఈ ఇంటి చిట్కాతో సులభంగా క్లీన్ చేయండి
- OTR: కవిత మాటలు నిజామాబాద్ పాలిటిక్స్లో మంటలు రేపుతున్నాయా..?
- Off The Record: వైసీపీ నేతలకు రిపోర్ట్ కార్డ్స్ పెట్టారా..? ఫెయిల్ అయిన నేతలకు నో టికెట్..?
ఆర్థిక మంత్రిత్వ శాఖ సోషల్ మీడియాలో ఈ మేరకు ఓ పోస్ట్ చేసింది. కంపెనీ వెబ్సైట్, SMS మొదలైన వాటి ద్వారా మీ పాలసీదారులకు వీలైనంత త్వరగా చేరువ కావాలని కోరింది. ఈ జిల్లాల నుంచి గరిష్ఠ క్లెయిమ్లు అందుతున్నాయి. దురదృష్టవశాత్తు కొండచరియలు విరిగిపడిన ఘటన, కేరళలో కురుస్తున్న భారీ వర్షాల దృష్ట్యా ఆర్థిక మంత్రిత్వ శాఖ కఠిన ఆదేశాలు జారీ చేసింది. ఎల్ఐసి, నేషనల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్, న్యూ ఇండియా అస్యూరెన్స్, ఓరియంటల్ ఇన్సూరెన్స్, యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్తో సహా ప్రభుత్వ రంగ సాధారణ బీమా కంపెనీలను విపత్తు బాధితులకు అన్ని విధాలా సహాయం అందించాలని ప్రభుత్వం ఆదేశించింది. ప్రజల బీమా క్లెయిమ్లను త్వరగా పరిష్కరించి చెల్లింపులు చేయాలని ప్రభుత్వం బీమా కంపెనీలను కోరింది.
Read Also:Cinema News : సోషల్ మీడియాలో ట్రోలింగ్ లో ట్రెండింగ్ ఉన్న స్టార్ హీరో..?
పీఎం జీవన్ జ్యోతి ఇన్సూరెన్స్ క్లెయిమ్
మంత్రిత్వ శాఖ ఆదేశాలలో, ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన కింద పాలసీ హోల్డర్లకు క్లెయిమ్ మొత్తాన్ని త్వరితగతిన పంపిణీ చేయాలని LICని కోరింది. క్లెయిమ్లను త్వరితగతిన పరిష్కరించేందుకు.. వారి డబ్బు ప్రజలకు చేరేలా చూసేందుకు అన్ని బీమా కంపెనీలతో సమన్వయం చేసుకోవాలని జనరల్ ఇన్సూరెన్స్ కౌన్సిల్ను కోరింది.
తాజావార్తలు
-
Elephant Death: విద్యుత్ షాక్తో ఏనుగు మృతి.. పవన్ కల్యాణ్ సీరియస్.. కీలక ఆదేశాలు
-
Sofa Cleaning Tips: సోఫాపై మొండి మరకలా? ఈ ఇంటి చిట్కాతో సులభంగా క్లీన్ చేయండి
-
OTR: కవిత మాటలు నిజామాబాద్ పాలిటిక్స్లో మంటలు రేపుతున్నాయా..?
-
Off The Record: వైసీపీ నేతలకు రిపోర్ట్ కార్డ్స్ పెట్టారా..? ఫెయిల్ అయిన నేతలకు నో టికెట్..?
-
US-Iran: రెండేళ్లలో ‘హార్ముజ్’ విలువలేనిదిగా మారొచ్చు.. ఇరాన్పై కఠిన ఆంక్షలకు అమెరికా ప్లాన్
ట్రెండింగ్
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!
-
AMOLED డిస్ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!