Wayanad Landslides : బీమా కంపెనీలు ఈ పనిని త్వరగా పూర్తి చేయాలని..ఆర్థిక మంత్రిత్వ శాఖ అల్టిమేటం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Wayanad Landslides : కేరళలోని వాయనాడ్లో కొండచరియలు విరిగిపడటంతో భారీ విధ్వంసం సంభవించింది. ఇప్పటి వరకు 323 మంది ప్రాణాలు కోల్పోగా, సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇదిలా ఉండగా బాధితులను ఆదుకునేందుకు ఆర్థిక శాఖ ముందుకు వచ్చింది. బాధితులకు వీలైనంత త్వరగా సహాయం అందించాలని కోరుతూ ఎల్ఐసీ సహా అన్ని ప్రభుత్వ రంగ బీమా కంపెనీలకు మంత్రిత్వ శాఖ శనివారం అల్టిమేటం ఇచ్చింది. కేరళలోని వాయనాడ్, ఇతర జిల్లాల్లో కొండచరియలు విరిగిపడిన బాధితులు, వారి కుటుంబాల క్లెయిమ్లను త్వరితగతిన ప్రాసెస్ చేసి, వారికి డబ్బు డెలివరీ చేయాలని ఆర్థిక మంత్రిత్వ శాఖ శనివారం LIC , ఇతర బీమా కంపెనీలను కోరింది.
Read Also:Bears Hulchul: కళ్యాణదుర్గంలో ఎలుగుబంట్లు హల్చల్.. భయం గుప్పిట్లో ప్రజలు
Also Read
- Simhachalam Temple Land: సింహాచలం భూముల వివాదంపై హైకోర్టు సీరియస్.. ప్రభుత్వానికి నోటీసులు
- Astrology: జూలై 2 గురువారం దినఫలాలు.. ఈ రాశివారికి ఊహించని గుడ్ న్యూస్..
- Vaibhav Sooryavanshi: బుడ్డోడికి మళ్లీ నిరాశే.. ఇంగ్లండ్తో తొలి టీ20లోనూ 'నో ఛాన్స్'.!
- Pawan Kalyan: సోషల్ మీడియా దుర్వినియోగంపై ఉక్కుపాదం మోపుతాం.. ‘ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్’ పేరుతో దూషణలు ఇక కుదరవు.!
ఆర్థిక మంత్రిత్వ శాఖ సోషల్ మీడియాలో ఈ మేరకు ఓ పోస్ట్ చేసింది. కంపెనీ వెబ్సైట్, SMS మొదలైన వాటి ద్వారా మీ పాలసీదారులకు వీలైనంత త్వరగా చేరువ కావాలని కోరింది. ఈ జిల్లాల నుంచి గరిష్ఠ క్లెయిమ్లు అందుతున్నాయి. దురదృష్టవశాత్తు కొండచరియలు విరిగిపడిన ఘటన, కేరళలో కురుస్తున్న భారీ వర్షాల దృష్ట్యా ఆర్థిక మంత్రిత్వ శాఖ కఠిన ఆదేశాలు జారీ చేసింది. ఎల్ఐసి, నేషనల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్, న్యూ ఇండియా అస్యూరెన్స్, ఓరియంటల్ ఇన్సూరెన్స్, యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్తో సహా ప్రభుత్వ రంగ సాధారణ బీమా కంపెనీలను విపత్తు బాధితులకు అన్ని విధాలా సహాయం అందించాలని ప్రభుత్వం ఆదేశించింది. ప్రజల బీమా క్లెయిమ్లను త్వరగా పరిష్కరించి చెల్లింపులు చేయాలని ప్రభుత్వం బీమా కంపెనీలను కోరింది.
Read Also:Cinema News : సోషల్ మీడియాలో ట్రోలింగ్ లో ట్రెండింగ్ ఉన్న స్టార్ హీరో..?
పీఎం జీవన్ జ్యోతి ఇన్సూరెన్స్ క్లెయిమ్
మంత్రిత్వ శాఖ ఆదేశాలలో, ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన కింద పాలసీ హోల్డర్లకు క్లెయిమ్ మొత్తాన్ని త్వరితగతిన పంపిణీ చేయాలని LICని కోరింది. క్లెయిమ్లను త్వరితగతిన పరిష్కరించేందుకు.. వారి డబ్బు ప్రజలకు చేరేలా చూసేందుకు అన్ని బీమా కంపెనీలతో సమన్వయం చేసుకోవాలని జనరల్ ఇన్సూరెన్స్ కౌన్సిల్ను కోరింది.
తాజావార్తలు
-
Small Savings Schemes: స్మాల్ సేవింగ్ స్కీమ్స్ లో ఇన్వెస్ట్ చేసేవారికి గుడ్ న్యూస్.. వడ్డీ రేట్లను ప్రకటించిన కేంద్రం
-
Kajal Aggarwal: కాజల్ కెరీర్లోనే మైండ్ బ్లోయింగ్ ప్రాజెక్ట్.. ఆ స్టార్ డైరెక్టర్తోనేనా?
-
Joseph Vijay: టైమ్ టు టైమ్..ఫైల్ తర్వాత ఫైల్.. దళపతి మార్క్ రూలింగ్!
-
Simhachalam Temple Land: సింహాచలం భూముల వివాదంపై హైకోర్టు సీరియస్.. ప్రభుత్వానికి నోటీసులు
-
DC Release Date: గ్యాంగ్స్టర్ గా లోకేష్ కనగరాజ్.. ‘డీసీ’ రిలీజ్ డేట్ ఫిక్స్!
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?
-
అందుబాటులోకి Aadhaar App కొత్త వెర్షన్..ఫేస్ ఆథెంటికేషన్, మొబైల్ నంబర్ అప్డేట్లతో పాటు మరిన్ని సేవలు.!