Olympics: ఒలింపిక్స్ 2028లో క్రికెట్ ప్రవేశంపై తుది నిర్ణయం.. అధికారిక ప్రకటన వెల్లడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Olympics: 2028లో అమెరికాలోని లాస్ ఏంజెల్స్లో జరగనున్న ఒలింపిక్స్లో క్రికెట్ ప్రవేశించింది. ముంబైలో జరిగిన అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ సమావేశంలో దీనిపై తుది నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశంలో ఒలింపిక్స్ 2028లో క్రికెట్తో పాటు మరో 4 క్రీడలను చేర్చాలని అధికారిక నిర్ణయం తీసుకున్నారు. క్రికెట్తో పాటు, బేస్బాల్-సాఫ్ట్బాల్, ఫ్లాగ్ ఫుట్బాల్, స్క్వాష్, లాక్రోస్ కూడా నిర్వహించనున్నారు. గత శుక్రవారమే ఒలింపిక్స్లో ఈ ఐదు క్రీడాంశాల ప్రవేశానికి సంబంధించి చర్చలు జరిగాయి. వాస్తవానికి.. ఈ ఐదు క్రీడలను ఒలింపిక్స్ 2028లో చేర్చాలనే లాస్ ఏంజిల్స్ స్పోర్ట్స్ ఆర్గనైజర్ల ప్రతిపాదనపై అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ ఎగ్జిక్యూటివ్ బోర్డు గత వారంలోనే చర్చలను ఆమోదించింది. ఈ విషయమై ఆదివారం నుంచి ముంబైలో చివరి రౌండ్ చర్చలు సాగగా.. ఈరోజు (సోమవారం) మధ్యాహ్నం ఒలింపిక్స్లో ఈ క్రీడలను చేర్చేందుకు అధికారిక ప్రకటన వెలువడింది.
IOC Session approves @LA28’s proposal for 5⃣ additional sports:
Also Read
- 144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
- Abdullah Shafique: 49 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెర.. విండీస్ గడ్డపై పాకిస్థాన్ ప్లేయర్ చారిత్రాత్మక రికార్డు..
- Aqua Farmers: ఆక్వా రైతులకు ఊరట.. రూ.1.50కే విద్యుత్ సరఫరా!
- AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
⚾Baseball/🥎softball, 🏏cricket, 🏈flag football, 🥍lacrosse and ⚫squash have been officially included as additional sports on the programme for the Olympic Games Los Angeles 2028. #LA28 pic.twitter.com/y7CLk2UEYx
— The Olympic Games (@Olympics) October 16, 2023
Read Also: Rashid Khan: ఢిల్లీ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపిన ఆఫ్ఘాన్ స్టార్ క్రికెటర్
128 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్లో క్రికెట్ ప్రవేశించబోతుంది. అంతకుముందు 1900 పారిస్ ఒలింపిక్స్లో క్రికెట్ ను నిర్వహించారు. అంటే 128 ఏళ్ల తర్వాత మళ్లీ ఒలింపిక్స్లో అడుగుపెట్టనుంది. ఒలింపిక్స్లో క్రికెట్ను చేర్చాలని చాలా కాలంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద క్రీడా ఈవెంట్లో క్రికెట్కి ప్రవేశం లభించింది. ఇందుకోసం ఐసీసీ తీవ్రంగా శ్రమించింది. 2028 ఒలింపిక్స్లో టీ20 ఫార్మాట్లో క్రికెట్ జరుగనుంది. ఇందులో పురుషులు, మహిళల ఈవెంట్స్ ఉంటాయి. ప్రస్తుతం 6-6 జట్లకు మాత్రమే ఎంట్రీ ఇవ్వాలని ప్రతిపాదించారు. రానున్న రోజుల్లో టీమ్ల సంఖ్యపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
Read Also: Nithari killings: నిఠారీ హత్యల నిందితులకు మరణశిక్ష రద్దు.. నిర్దోషులుగా ప్రకటించిన కోర్టు..
- Tags
- announcement
- cricket
- entry
- ioc
- official
తాజావార్తలు
-
SVC 63: టైటిల్ లేదు.. హైప్ మాత్రం పీక్స్లో.. మొదలైన సల్మాన్, నయనతారల హై వోల్టేజ్ యాక్షన్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
Abdullah Shafique: 49 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెర.. విండీస్ గడ్డపై పాకిస్థాన్ ప్లేయర్ చారిత్రాత్మక రికార్డు..
-
SpaceX Rocket Moon Crash: గంటకు 8,690 కి.మీ వేగంతో.. చంద్రుడిని ఢీకొట్టనున్న SpaceX రాకెట్..!
-
Tragedy News: స్నేహం, పెళ్లి, కోపం.. చివరికి నదిలోకి తోసి ప్రాణాలు తీసిన యువకుడు!
ట్రెండింగ్
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!
-
VVS Laxman Chief Selector: అజిత్ అగార్కర్కు బిగ్ షాక్.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్గా వీవీఎస్ లక్ష్మణ్?