FIFA World Cup 2022: సౌదీ అరేబియాలో ఫిఫా వరల్డ్ కప్ స్ట్రీమింగ్ బ్లాక్

Fifa World Cup

Fifa World Cup

FIFA World Cup 2022: ఫిఫా ప్రపంచ కప్ 2022 మ్యాచ్‌లను ప్రసారం చేయకుండా సౌదీ అరేబియా ఖతార్ యాజమాన్యంలోని స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్‌ను బ్లాక్ చేసింది. దీంతో చాలా మంది క్రీడాభిమానులు సౌదీ అరేబియా ఆటగాళ్ల విజయాన్ని చూడలేకపోయారు. స్ట్రీమింగ్ ప్లాట్‌ఫాం అయిన టోడ్‌ టీవీ ఖతారీ బ్రాడ్‌కాస్టర్ బీఐఎన్ మీడియా గ్రూప్ యాజమాన్యంలో ఉంది. ఇది సౌదీ అరేబియా, ఖతార్ దేశాల మధ్య వివాదం సందర్భంగా చాలా సంవత్సరాలు నిషేధించబడింది, అయితే అక్టోబర్ 2021లో పునరుద్ధరించబడింది. అంతరాయం గురించి ఖతార్ చేసిన అభ్యర్థనకు సౌదీ ప్రభుత్వం స్పందించకపోవడం గమనార్హం. “సౌదీ అరేబియాలో అంతరాయాన్ని ఎదుర్కొంటున్నాము. ఇది ప్రస్తుతం ఖతార్‌లో జరుగుతున్న ఫిఫా వరల్డ్‌ కప్‌ 2022 అధికారిక స్ట్రీమింగ్ భాగస్వామి టోడ్‌ టీవీపై ప్రభావం చూపుతోంది.” అని ఖతార్ ఆధారిత సంస్థ అయిన BeIN స్పోర్ట్స్ ప్రకటించింది.

అంతరాయం గురించి వ్యాఖ్యానించడానికి తాము చేసిన అభ్యర్థనకు సౌదీ ప్రభుత్వం స్పందించలేదని beIN స్పోర్ట్స్ తెలిపింది. టోడ్‌ టీవీ అనేది మధ్యప్రాచ్యం, ఉత్తర ఆఫ్రికాలోని 24 దేశాలలో అధికారిక ప్రపంచ కప్ స్ట్రీమింగ్ సేవలను అందిస్తోంది. సౌదీ అరేబియాలోని పలువురు సబ్‌స్క్రైబర్‌లు నవంబర్ 20న ప్రపంచ కప్ ప్రారంభమైనప్పటి నుంచి తాము ప్రపంచకప్‌ మ్యాచ్‌లు చూడలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఓపెనింగ్ వేడుక ప్రసారానికి గంట ముందు సర్వీస్ పూర్తిగా కటౌట్ అయిందని ఒకరు చెప్పారు. మరొకరు ఈ సేవ ఇప్పటికీ క్లుప్తంగా పనిచేస్తుందని, అయితే దోష సందేశం కనిపించడానికి 10 నిమిషాల కంటే ఎక్కువ సమయం ఉండదని చెప్పారు.

Ind vs Nz: న్యూజిలాండ్‌తో రెండో వన్డే.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న కివీస్

సౌదీ అరేబియా మంగళవారం సాయంత్రం అర్జెంటీనాను ఓడించి ఫిఫా ప్రపంచకప్ చరిత్రలో గొప్ప విజయం సాధించి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. మొదటి అర్ధభాగంలో సౌదీలు 0-1తో వెనుకబడినప్పటికీ, రెండో అర్ధభాగంలో స్ఫూర్తిదాయకమైన మలుపు తిరిగి రోజు ముగిసే సమయానికి 2-1తో నిలిచింది. వారు తదుపరి పోటీకి అర్హత సాధించాలంటే, సౌదీ అరేబియా శక్తివంతమైన పోలాండ్ జట్టుతో మైదానంలో గెలవాల్సి ఉంది.