Site icon NTV Telugu

Mahabubabad: ఘోర రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి.. ఏడుగురికి గాయాలు..

Mahabubabad

Mahabubabad

మహబూబాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి మృతిచెందగా మరో 7 మంది గాయాలపాలయ్యారు. మహబూబాబాద్ -కేసముద్రం ప్రధాన రహదారి పై ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మహబూబాబాద్ మండలం వేం నూరు గ్రామ శివారు నేతాజీ తండా వద్ద అశోక్ లీలాండ్ వాహనాన్ని గ్రానైట్ లారీ డీకొట్టింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన గుగులోత్ రాజు అనే వ్యక్తి మృతి చెందాడు. మృతుడి కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Also Read:Off The Record: వైసీపీలో పినెల్లిని తప్పించడానికి అధిష్టానం చూస్తుందా..?

బాధితులంతా ఒకే కుటుంబానికి చెందిన నెల్లికుదుర్ మండలం మీట్యా తండా గ్రామపంచాయతీ పరిధిలోని పంతులు తండాకు చెందినవారు. ఇల్లందు సమీపంలో మిర్యాలపెంట గ్రామంలో శుభకార్యానికి హాజరై తిరిగి వస్తున్న క్రమంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాద సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయకచర్యలు ప్రారంభించారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. రోడ్డు ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు.

Exit mobile version