Farmers Protest 2024: సానుకూలంగానే చర్చలు.. రైతు సంఘాలతో ఆదివారం మరోసారి సమావేశం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Centre and Farmer Unions will meet on Sunday: పంటలకు కనీస మద్దతు ధర (ఎంఎస్పీ)కి హామీ ఇచ్చే చట్టం సహా పలు సమస్యలపై నిరసనలు తెలుపుతున్న రైతు సంఘాలతో జరిపిన చర్చలు సానుకూలంగా జరిగాయని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి అర్జున్ ముండా తెలిపారు. అయితే రైతుల డిమాండ్లపై ఏకాభిప్రాయం కుదరడానికి మరోసారి సమావేశం అవుతామని చెప్పారు. రైతు సంఘాలతో కేంద్రం జరిపిన మూడో విడత చర్చలు గురువారం అర్ధరాత్రి ముగిశాయి. అంతకుముందు ఫిబ్రవరి 8, 12 తేదీలలో రైతు సంఘాలతో కేంద్రం చర్చలు జరిపిన విషయం తెలిసిందే.
చండీగఢ్లో గురువారం రైతు సంఘాల నేతలతో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి అర్జున్ ముండా, వాణిజ్య శాఖ మంత్రి పీయూశ్ గోయల్, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ చర్చలు జరిపారు. సెక్టార్ 26లోని మహాత్మా గాంధీ స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో జరిగిన సమావేశంలో పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ కూడా పాల్గొన్నారు. గురువారం రాత్రి 8.45 నిమిషాలకు ప్రారంభమైన చర్చలు.. దాదాపు 5 గంటల పాటు కొనసాగాయి. కేంద్ర మంత్రులు, రైతు సంఘాలు ఒక్కో అంశంపై సవివరంగా చర్చించుకున్నాయని, పలు అంశాలపై ఏకాభిప్రాయం కుదిరిందని సీఎం భగవంత్ మాన్ చెప్పారు.
Also Read
- Ketan Agarwal murder case: 3 ఏళ్ల టైమ్ దొరుకుతుందనే కేతన్ హత్య..
- Mahua Moitra: ‘బెంగాలీలకు రాజ్మా అంటే తెలుసా?’ బీజేపీ ప్రభుత్వంపై మహువా మొయిత్రా ఫైర్
- Europe Heatwave: యూరప్ను బెంబేలెత్తిస్తోన్న ‘ఒమేగా బ్లాక్’.. రికార్డు ఉష్ణోగ్రతలకు కారణమిదేనా!
- Trump: ‘కమ్యూనిస్టులకు దేవుడిపై నమ్మకం ఉండదు’.. డెమోక్రటిక్పై ట్రంప్ ఆగ్రహం
Also Read: Farmers Protest 2024: రైతుల నిరసనలు.. నొయిడాలో 144 సెక్షన్!
పలు అంశాలపై సానుకూలంగా చర్చలు జరిపామని, వచ్చే ఆదివారం నాలుగో విడత చర్చలు జరుపుతామని కేంద్ర మంత్రి అర్జున్ ముండా సమావేశం అనంతరం తెలిపారు. పంటకు కనీస మద్దతు ధర, రుణమాఫీకి చట్టపరమైన హామీతో సహా పలు డిమాండ్లపై కేంద్రంతో చర్చ జరిగిందని కిసాన్ మజ్దూర్ మోర్చా (ఎస్కేఎం) ప్రధాన కార్యదర్శి సర్వన్ సింగ్ పంధేర్ తెలిపారు. కేంద్ర మంత్రులు కొంత సమయం కావాలని కోరారని, ప్రభుత్వంతో ఘర్షణ లేకుండా సానుకూల ఫలితం రావాలని తమను కోరుకుంటున్నామని పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Joker : నిర్మాతగా బన్నీ బెస్ట్ ఫ్రెండ్.. అల్లు అరవింద్ క్లాప్’తో ‘జోకర్’ గ్రాండ్ లాంచ్!
-
Ketan Agarwal murder case: 3 ఏళ్ల టైమ్ దొరుకుతుందనే కేతన్ హత్య..
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Mahua Moitra: ‘బెంగాలీలకు రాజ్మా అంటే తెలుసా?’ బీజేపీ ప్రభుత్వంపై మహువా మొయిత్రా ఫైర్
-
Cathy Gebe: మహిళా ఎంపీ దెబ్బకు పురుష ఎంపీలు షాక్.. పార్లమెంట్లో ఒక్క పదంతో వాళ్ల పరువు తీసేసింది!
ట్రెండింగ్
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!
-
55 రోజుల స్టాండ్బై బ్యాటరీతో రూ.1,699కే itel Power 451 AI ఫీచర్ ఫోన్..