Tamilnadu: ఆవును చంపిందని పులిపై ప్రతీకారం తీర్చుకున్న రైతు.. ఏం చేశాడంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Farmer Arrested For Killing Tigers with Poison :
తన ఆవును చంపేసిందని పులిపై ప్రతీకారం తీర్చకున్నాడు ఓ రైతు. ఈ ఘటన తమిళనాడులోని నీల్గిరి జిల్లాలో వెలుగులోకి వచ్చింది. పది రోజుల క్రితం ఓ రైతు ఆవు మేత కోసం అడవిలోకి వెళ్లింది. అయితే అది ఎంతకీ తిరిగి రాకపోవడంతో దాన్ని వెతుక్కుంటూ ఆ రైతే అడవికి వెళ్లాడు. అక్కడ అతడికి చనిపోయిన తన ఆవు కనిపించింది. అది చూడగానే ఆ రైతు దు:ఖం పొంగుకొచ్చి కోపం కట్టలు తెచ్చుకుంది. తన ఆవును చంపిన పులి మీద పగ తీర్చుకోవాలనుకున్నాడు. వెంటనే ఆవు కళేబరానికి పురుగుల మందు రాశాడు. దాన్ని తిని పులులు మరణిస్తాయి అనుకున్నాడు. ఆ రైతు భావించినట్లుగానే రెండు పులులు ఆవును తిని మరణించాయి.
Also Read: Food Poisoning: కస్తూర్బా విద్యాలయంలో ఫుడ్ పాయిజన్.. ఆసుపత్రిలో 80 మంది విద్యార్ధినిలు
Also Read
- RCB Vs PBKS: ప్లే ఆఫ్స్కు దూసుకెళ్లిన ఆర్సీబీ.. వరుసగా ఆరో ఓటమి చవిచూసిన పంజాబ్..
- Chickens Die: ఘోర ఘటన.. 3 గంటల్లో 5,300 కోళ్లు మృతి.. కారణం ఏంటంటే..
- Venkatesh Iyer: తమిళనాడు సీఎం విజయ్ స్టైల్ను దించేసిన వెంకటేశ్ అయ్యర్..
- PM Modi: స్వీడన్లో మోడీకి ఘన స్వాగతం.. గ్రిపెన్ ఫైటర్ జెట్ల ఎస్కార్ట్ వైరల్
శనివారం ఎమరాల్డ్లోని నీటి కుంటలో మూడు, ఎనిమిదేళ్ల వయసున్న రెండు పులులు మృతి చెందినట్లు అధికారులు గుర్తించారు. అవి ఎలా చనిపోయాయని అధికారులు విచారిస్తుండగా వాటి సమీపంలో ఓ ఆవు కళేబరాన్ని గుర్తించారు. వెంటనే వారు ఆ కళేబరాన్ని టెస్టింగ్ కు పంపించారు. అందులో విషం ఉన్నట్లు గుర్తించారు. అనుమానం వచ్చిన పోలీసులు ఆవు యజమానిని అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు. దీంతో ఆ రైతు అసలు విషయాన్ని బయటపెట్టాడు. తన ఆవును చంపేశాయన్న పగతోనే పులిని చంపేశానని ఒప్పుకున్నాడు. ఈ క్రమంలో సోమవారం ఆవు యజమాని శేఖర్ను అటవీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. చనిపోయిన వాటిలో మూడేళ్లు ఉన్న ఒక పులి, ఎనిమిదేళ్లున్న ఓ పులి ఉన్నాయి. అయితే మూడేళ్లు ఉన్న పులి శరీరంపై గాయాలు ఉన్నాయి. దీంతో ఎనిమిదేళ్ల వయసున్న పులి చిన్న పులిపై చనిపోయే ముందు దాడి చేసి ఉండవచ్చని భావిస్తున్నారు. ఏది ఏమైనా ఒక పులి మరణానికి మాత్రం రైతు పూసిన విషమే కారణమని భావిస్తున్న పోలీసులు ప్రస్తుతం రైతును అరెస్ట్ చేశారు.
తాజావార్తలు
-
Jet Lee OTT Release: సడన్ సర్ప్రైజ్.. ‘జెట్ లీ’ ఓటీటీ పార్ట్నర్ ఫిక్స్.. స్ట్రీమింగ్ డేట్ ఇదే!
-
RCB Vs PBKS: ప్లే ఆఫ్స్కు దూసుకెళ్లిన ఆర్సీబీ.. వరుసగా ఆరో ఓటమి చవిచూసిన పంజాబ్..
-
Chickens Die: ఘోర ఘటన.. 3 గంటల్లో 5,300 కోళ్లు మృతి.. కారణం ఏంటంటే..
-
Pichi Potta Chicken : నోరూరించే ‘పిచి పొట్టా చికెన్’.. ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్లో ఇలా ఈజీగా చేసుకోండి.!
-
Venkatesh Iyer: తమిళనాడు సీఎం విజయ్ స్టైల్ను దించేసిన వెంకటేశ్ అయ్యర్..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..