Railways vs Delhi : 13ఏళ్ల తర్వాత ఆడుతున్న విరాట్ కోహ్లీ.. అరుణ్ జైట్లీ స్టేడియం వెలుపల తొక్కిసలాట
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Railways vs Delhi : రంజీ ట్రోఫీ 2024-25లో గ్రూప్ దశలో చివరి మ్యాచ్లు ఈరోజు ప్రారంభమయ్యాయి. ఈ దశలో ఢిల్లీ జట్టు రైల్వేస్తో ఆడుతోంది. ఈ మ్యాచ్లో టీం ఇండియా దిగ్గజ బ్యాట్స్మన్ విరాట్ కోహ్లీ ఢిల్లీ జట్టులో ఉన్నాడు. ఈ మ్యాచ్ ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరుగుతోంది. కింగ్ కోహ్లీని చూసేందుకు అభిమానులు స్టేడియానికి చేరుకున్నారు. స్టేడియం వెలుపల భారీ జనసమూహం చేరుకుంది. దీని కారణంగా కొంతమంది అభిమానులు గాయపడ్డారు.
గేట్ నంబర్ 16 బయట ఉన్న జనం ఒకరినొకరు తోసుకోవడం ప్రారంభించారు. దీని వలన చాలా మంది అభిమానులు గేట్ దగ్గర కిందపడిపోయి గాయపడ్డారు. ఈ సమయంలో ఒక పోలీసు బైక్ కూడా దెబ్బతింది. కనీసం ముగ్గురు గాయపడ్డారని నివేదిక పేర్కొంది. గేటు దగ్గర గాయపడిన అభిమానులకు డీడీసీఏ భద్రత, పోలీసులు చికిత్స అందించారు. గాయపడిన ఒక అభిమాని కాలికి కట్టు కూడా అవసరమని నివేదిక పేర్కొంది. పరిస్థితిని అదుపు చేయడానికి ప్రయత్నించినప్పుడు ఒక భద్రతా గార్డు కూడా గాయపడ్డాడు.
Also Read
- Arshdeep Singh: వివాదంలో చిక్కుకున్న అర్ష్దీప్ సింగ్.. తిలక్ వర్మ చర్మ రంగుపై అసభ్యకర వ్యాఖ్యలు..
- Russia Oil: ముంచుకొస్తున్న సంక్షోభం.. భారత్కు నిలిచిపోనున్న రష్యా చమురు..
- Jobs: నిరుద్యోగులకు గొప్ప అవకాశం.. నెలకు శాలరీ రూ.1.99 లక్షలు..
- Petrol-Diesel Price: పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై పుకార్లు.. ఎంత పెరగవచ్చంటే..!
Read Also:Top Headlines @ 1 PM: టాప్ న్యూస్
ఈ గందరగోళంలో చాలా మంది అభిమానుల బూట్లు, చెప్పులు ఆ ప్రాంతంలో చెల్లాచెదురుగా పడిపోయాయి. ఇంత భారీ జనసమూహాన్ని డీడీసీఏ ఊహించలేదని కూడా ఆ నివేదిక పేర్కొంది. ప్రారంభంలో అభిమానుల కోసం మూడు గేట్లు మాత్రమే తెరిచారు. అందులో గేట్ నంబర్ 16 కూడా ఉంది. కానీ పెద్ద సంఖ్యలో అభిమానులను చూసి, అదనపు గేటు కూడా తెరిచారు. మొదట్లో గౌతమ్ గంభీర్ స్టాండ్ మాత్రమే తెరిచారు. కానీ తరువాత మరొక స్టాండ్ ఓపెన్ చేశారు.
చాలా కాలం తర్వాత రంజీల్లోకి కోహ్లీ
చాలా కాలం తర్వాత విరాట్ కోహ్లీ రంజీ ట్రోఫీకి తిరిగి రావడం గమనార్హం. అతను నవంబర్ 2012 లో టోర్నమెంట్లో తన చివరి మ్యాచ్ ఆడాడు. ఇప్పుడు 12 సంవత్సరాలకు పైగా తర్వాత, కోహ్లీ ఢిల్లీ తరపున రంజీ మ్యాచ్ ఆడటానికి తిరిగి వచ్చాడు.
Read Also:Virat Kohli: ఫీల్డ్లోకి దూసుకొచ్చి విరాట్ కోహ్లీ పాదాలను తాకిన అభిమాని.. వీడియో వైరల్
తాజావార్తలు
-
Off The Record : విచ్చలవిడిగా ఇసుక అక్రమాలు.. మైనింగ్ ఏడీ ఫణిభూషణ్ పై తీవ్ర ఆరోపణలు
-
Story Board : నిర్లక్ష్యానికి శిక్షల్లేవా? పిల్లల మానసిక వేదన పట్టించుకోరా?
-
Arshdeep Singh: వివాదంలో చిక్కుకున్న అర్ష్దీప్ సింగ్.. తిలక్ వర్మ చర్మ రంగుపై అసభ్యకర వ్యాఖ్యలు..
-
DGP CV Anand: ఉగ్ర ముప్పుపై తెలంగాణ అప్రమత్తం.. OCTOPUS యాక్షన్ ప్లాన్..!
-
Russia Oil: ముంచుకొస్తున్న సంక్షోభం.. భారత్కు నిలిచిపోనున్న రష్యా చమురు..
ట్రెండింగ్
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!