Extramarital Affair: ఎటుపోతోందీ సమాజం.. 30 ఏళ్ల వ్యక్తితో 50 ఏళ్ల మహిళ జంప్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Extramarital Affair: ఈ మధ్యకాలంలో భారతదేశంలో అనేక వివాహేతర సంబంధాలకు సంబంధించిన విచిత్ర ఘటనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఓ మహిళ తన అక్రమ సంబంధానికి అర్థం వస్తున్నాడని భర్తను ముక్కలుగా చేసి డ్రమ్ములో పాతి పెట్టగా.. మరో మహిళ తన కూతురిని వివాహం చేసుకోబోయే వ్యక్తితో పారిపోవడం వంటి అనేక ఘటనలు చర్చనీయాంశంగా మారాయి. ఈ కోవలోకే తాజాగా మరో విచిత్ర సంఘటన వెలుగులోకి వచ్చింది. 50 సంవత్సరాల పైన ఉన్న మహిళ 30 ఏళ్ల యువ వ్యక్తితో ఇంటి నుంచి పారిపోయింది. అంతేకాదండోయ్.. ఆ యువకుడిని పెళ్లి చేసుకుంది కూడా.. మరి ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను ఒకసారి చూద్దాం.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బస్కార పోలీస్ స్టేషన్ పరిధిలో అంబేద్కర్నగర్ ప్రాంతంలో చంద్రశేఖర్, ఇంద్రావతి ఇరువురు జంటగా నివసిస్తున్నారు. వీరిద్దరికి ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కుటుంబ పరిస్థితుల నేపథ్యంలో బతుకు పోరాటం కోసం చంద్రశేఖర్ వేరే ఊరిలో పనిచేస్తూ జీవనం కొనసాగించేవాడు. అలా పని చేసి కుటుంబ అవసరాల కోసం డబ్బులు ఇంటికి పంపేవాడు. ఇకపోతే, గడిచిన వారం రోజుల క్రితం ఇంద్రావతి ఊరిలో కనిపించకుండా పోయిందన్న విషయం చంద్రశేఖర్ కు తెలిసింది. దాంతో అతడు వారి సొంత గ్రామానికి తిరిగి వచ్చి అసలు విషయం తెలుసుకొని ఆశర్యపోయాడు.
Also Read
- Ayodhya: "వాష్రూమ్లలో డబ్బు దాచాం".. అయోధ్య కేసులో నిందితుడు బయటపెట్టిన సంచలన నిజాలు
- Pithapuram Police: పవన్ కల్యాణ్పై అనుచిత వ్యాఖ్యలు.. పిఠాపురం పోలీసుల అదుపులో యూట్యూబర్..
- Steel Taps cleaning Tips: స్టీల్ ట్యాప్లు కొత్తవిలా మెరవాలంటే.. ఈ చిట్కా తప్పక ట్రై చేయండి
- Damodar Rajanarsimha: వైద్యుల సేవలు అమూల్యం.. డాక్టర్స్ డే సందర్భంగా మంత్రి కీలక సందేశం
ఇక వారి ఇంటి దగ్గర 30 ఏళ్ల వ్యక్తి ఆజాద్ తో అక్రమ సంబంధం కొనసాగిస్తుందని.. వారిద్దరూ కలిసి తనని చంపాలనుకున్నారని, అది కుదరకపోవడంతో ఇల్లు వదిలి పారిపోయి పెళ్లి చేసుకున్నారని చెప్పుకొచ్చాడు. ఈ ఘటనపై ఇంద్రావతి భర్త చంద్రశేఖర్ మాట్లాడుతూ.. తన భార్యకు ఇది మూడో పెళ్లని తాను రెండో భర్తనని తెలిపారు. మొదటి భర్తతో విడిపోయిన తర్వాత, తాను పెళ్లి చేసుకున్నానని అప్పటికే ఆమెకి ఓ కుమార్తె కూడా ఉందని.. తనతో పెళ్లి అయిన తర్వాత ఓ కూతురు, ఇద్దరు కొడుకులు పుట్టారని తెలిపారు.
ఇక మొదటి భర్త కూతురి పెళ్లి కోసం తన సొంత పొలాన్ని తాకట్టు పెట్టి పెళ్లి చేసుకున్నట్లు తెలిపాడు. అయితే, తనపై తన భార్యకు ఆసక్తి తగ్గింపోయిందని.. సరిగా మాట్లాడేది కాదని, ఎప్పుడు గొడవలు పడేదని తెలిపారు. తన భార్య, ప్రియుడు తనని చంపాలి అనుకున్నారని.. అది జరగకపోవడంతో వారు పారిపోయినట్లు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఇక తన దృష్టిలో చనిపోయిందని.. హిందూ సాంప్రదాయం ప్రకారం చనిపోయిన వ్యక్తికి 13వ రోజు నిర్వహించే కార్యక్రమాన్ని నిర్వహిస్తామని తెలిపారు. అయితే, ఆమె మొదటి భర్త కూతురు కోసం తాకట్టు పెట్టిన పొలం డబ్బులు తన ఇచ్చేయాల్సిందే అంటూ పేర్కొన్నాడు. ఈ విషయంలో పోలీసులు ఏమి చేయలేకపోయారని సమాచారం.
తాజావార్తలు
-
Varanasi : ‘వారణాసి’ వార్ సీన్స్.. మైండ్ బ్లోయింగ్ అంతే
-
Ayodhya: “వాష్రూమ్లలో డబ్బు దాచాం”.. అయోధ్య కేసులో నిందితుడు బయటపెట్టిన సంచలన నిజాలు
-
Yadagirigutta: మెగా ఫ్యామిలీకి గుడ్ న్యూస్.. యాదగిరిగుట్ట దేవస్థానం బోర్డులో కొనిదెల సురేఖకు చోటు
-
Pithapuram Police: పవన్ కల్యాణ్పై అనుచిత వ్యాఖ్యలు.. పిఠాపురం పోలీసుల అదుపులో యూట్యూబర్..
-
Harry Brook: మా ప్లాన్స్ మాకున్నాయి.. దాచాం చాలా.. వైభవ్ను ఈజీగా బుట్టలో వేస్తాం!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి ఛాన్స్ రాకపోవడమే మంచిది.. అసలు కారణం..!
-
IND vs ENG 1st T20: ఇంగ్లండ్ తుది జట్టు ప్రకటన.. ఆ ఇద్దరు స్టార్లకు నో ప్లేస్.. టీమిండియా హ్యాపీ!
-
Farmer Job Offer: జాబ్ ఆఫర్ చేసిన మహిళా రైతు.. ఉదయం 6 నుంచి 2 గంటల వరకు పని.. టీ, బ్రేక్ఫాస్ట్ ఫ్రీ..
-
Bread Pakoda Recipe: కరకరలాడే స్ట్రీట్ స్టైల్ ‘బ్రెడ్ పకోడా’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Kitchen Tips: ఫ్రిజ్ శబ్దం పెరిగిందా.? టెక్నీషియన్ను పిలవకుండా ఇంట్లోనే ఇలా చేయండి.!