NTV Telugu Site icon

Jammu Kashmir: జమ్మూ ఎయిర్ పోర్టుపై పాకిస్థాన్ దాడి.. పాక్ డ్రోన్లను కూల్చేసిన భారత్..

Kasmir

Kasmir

జమ్మూలో ఈరోజు భారతదేశంపై పాకిస్థాన్ దాడి చేసింది. విమానాశ్రయం సమీపంలో పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. జమ్మూ విమానాశ్రయాన్ని లక్ష్యంగా చేసుకునేందుకు పాకిస్థాన్ ప్రయత్నిస్తోంది. దీని తరువాత ఎయిర్ సైరన్లు మోగాయి. జమ్మూ అంతటా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ప్రజలు తమ ఇళ్లలోనే ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. జమ్మూలోని వివిధ ప్రాంతాల్లో బ్లాక్‌అవుట్ విధించారు. జమ్మూలో 5-6 పేలుళ్ల శబ్దాలు వినిపించాయని చెబుతున్నారు. పాకిస్థాన్ డ్రోన్లు భారతదేశంలోకి ప్రవేశిస్తున్నట్లు కనిపించాయి. పాకిస్థాన్ దుందుడుకు చర్యలకు భారత సైన్యం దీటైన సమాధానం ఇస్తోంది.  మాతా వైష్ణో దేవి వద్ద బ్లాక్అవుట్ విధించబడింది.

సైన్యం వైమానిక రక్షణ వ్యవస్థను సంసిద్ధం చేసింది. పాకిస్థాన్‌కి చెందిన పలు డ్రోన్లను భారత సైన్యం నేలమట్టం చేసింది.  F-16 సరిహద్దులు దాటి భారత్‌లోకి ప్రవేశించింది. పటాన్‌కోట్ ఎయిర్ బేస్‌పై దాడికి యత్నించింది. F-16 యుద్ధ విమానాన్ని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కూల్చేసింది. మూడేళ్ల క్రితం ఇదే విమానాన్ని కూల్చేసిన భారత్.. తాజాగా మరో విమానం నేలమట్టం చేసింది.

జమ్మూ కాశ్మీర్లో కాల్పుల మోత LIVE: Blackout In Jammu, Schools To Remain Shut In Several Districts