RK Roja: పుంగనూరు బాలిక కిడ్నాప్, హత్యపై మాజీ మంత్రి రోజా దిగ్భ్రాంతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
RK Roja: పుంగనూరు బాలిక కిడ్నాప్, హత్యపై మాజీ మంత్రి రోజా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆడపిల్లలు ఉన్న తల్లితండ్రులు పిల్లలను స్కూల్కి పంపాలంటే భయమేస్తోందన్నారు. ముఖ్యమంత్రి సొంత జిల్లాలోనే రక్షణ లేకపోతే ప్రభుత్వ అసమర్ధత కాదా అంటూ ప్రశ్నించారు. గత నెల 29 న అదృశ్యమైన పాప నాలుగు రోజులపాటు ఆ సమీప ప్రాంతాల్లోనే ఉన్నా ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా గుర్తించలేకపోయారని ఆరోపించారు. వారం తర్వాత ఇంటికి నాలుగు కిలోమీటర్ల దూరంలోనే బాలిక శవమై కనిపించిందంటే ఈ హోం, డిప్యూటీ, సీఎం లు ఏం చేస్తున్నట్టు అంటూ ప్రశ్నించారు. ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా? పోలీసులు ఉన్నారా అంటూ మాజీ మంత్రి రోజా ప్రశ్నించారు. పోలీసులను రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేయడానికి, తప్పుడు కేసులు పెట్టడానికి ఉపయోగిస్తున్నారన్నారు. మహిళల, పసిబిడ్డల భద్రత కోసం ఎవరూ లేరన్నారు. తప్పుడు కేసులు పెట్టడానికి మదనపల్లి ఫైల్స్ అని ప్రత్యేక హెలికాప్టర్నుపంపిన ప్రభుత్వం ఫైల్స్కి ఇచ్చిన విలువ ఆడబిడ్డలకు ఇవ్వదా అంటూ ప్రశ్నలు గుప్పించారు.
Read Also: CM Chandrababu: ఇవాళ ఢిల్లీ వెళ్లనున్న సీఎం చంద్రబాబు
Also Read
- Vaibhav Sooryavanshi: బుడ్డోడికి మళ్లీ నిరాశే.. ఇంగ్లండ్తో తొలి టీ20లోనూ 'నో ఛాన్స్'.!
- Pawan Kalyan: సోషల్ మీడియా దుర్వినియోగంపై ఉక్కుపాదం మోపుతాం.. ‘ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్’ పేరుతో దూషణలు ఇక కుదరవు.!
- US: అమెరికాలో విషాదం.. ఆకస్మిక వరదల్లో ఏపీ యువకుడు మృతి
- Ishan Kishan: ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్లో పేలిన పాకెట్ డైనమెట్.. నెం.1 బ్యాటర్గా ఇషాన్ కిషన్.!
లోకేష్ నియోజకవర్గంలో 24 గంటల్లో ముగ్గురు మహిళలపై అత్యాచారం జరిగిందంటే పాలించే అర్హత వీళ్ళకు ఉందా అంటూ వ్యాఖ్యానించారు. హోంమంత్రి పక్క నియోజకవర్గం లో రాంబిల్లిలో ఒక యువతి కాపాడమని కోరినా పట్టించుకోకపోవడంతో జైలు నుంచి వచ్చి నిందితుడు చంపేశాడని ఆరోపించారు. జగన్మోహన్ రెడ్డి 9 వ తేదీ పుంగనూరుకు వస్తున్నాడని తెలిసి ప్రభుత్వం, హోం మంత్రి పరుగులు తీస్తున్నారన్నారు. ఇప్పటికైనా కక్ష సాధింపుతో దిశ చట్టాన్ని, మహిళా పోలీసులను నిర్వీర్యం చేయకుండా బలోపేతం చేయాలన్నారు. మిమ్మల్ని కన్న తల్లి కూడా ఆడదే అని గుర్తు తెచ్చుకుని మహిళా రక్షణను పెంచాలని సూచించారు. తక్షణం పుంగనూరు ఘటన నిందితులను తక్షణం అరెస్టు చేయాలని మాజీ మంత్రి రోజా డిమాండ్ చేశారు.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: బుడ్డోడికి మళ్లీ నిరాశే.. ఇంగ్లండ్తో తొలి టీ20లోనూ ‘నో ఛాన్స్’.!
-
ENG vs IND 1st T20: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్! ప్లేయింగ్ XI లో ఎవరెవరంటే?
-
Kayadu Lohar: అందుకే హిట్లున్నా లేకున్నా వరుస ఆఫర్లు!
-
Pawan Kalyan: సోషల్ మీడియా దుర్వినియోగంపై ఉక్కుపాదం మోపుతాం.. ‘ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్’ పేరుతో దూషణలు ఇక కుదరవు.!
-
US: అమెరికాలో విషాదం.. ఆకస్మిక వరదల్లో ఏపీ యువకుడు మృతి
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?
-
అందుబాటులోకి Aadhaar App కొత్త వెర్షన్..ఫేస్ ఆథెంటికేషన్, మొబైల్ నంబర్ అప్డేట్లతో పాటు మరిన్ని సేవలు.!