Manoj Sinha: “ప్రతి రక్తపు బొట్టుకు ప్రతీకారం తీర్చుకుంటాం”.. ఉగ్రవాదులకు హెచ్చరిక
- ఇటీవలి కాలంలో జమ్మూ కాశ్మీర్లో ఉగ్రదాడులు
- ప్రతి రక్తపు బొట్టుకు ప్రతీకారం తీర్చుకుంటామన్న లెఫ్టినెంట్ గవర్నర్
- పాకిస్థాన్పై తీవ్ర విమర్శలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇటీవలి కాలంలో జమ్మూ కాశ్మీర్లో జరుగుతున్న విభిన్న ఉగ్రవాద దాడులపై లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ఘాటుగా స్పందించారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా బలమైన సందేశాన్ని ఇస్తూ.. లోయలో చిందించిన ప్రతి అమాయకుడి రక్తపు బొట్టుకు ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించారు. ఉగ్రవాద నిర్మాణాన్ని పూర్తిగా ధ్వంసం చేసేందుకు భద్రతా బలగాల సామర్థ్యాలన్నింటినీ ఉపయోగిస్తామని తెలిపారు. హమ్హమాలోని ఎస్టిసిలో బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బిఎస్ఎఫ్) పాసింగ్ అవుట్-కమ్-అటెస్టేషన్ పరేడ్లో ఆయన ప్రసంగిస్తూ.. ఈ ప్రకటన చేశారు. పాకిస్థాన్పై తీవ్రంగా విరుచుకుపడ్డారు. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి జమ్మూ కాశ్మీర్లో పాక్ నిరంతరం ఉగ్రవాద కార్యకలాపాలు కొనసాగిస్తోందన్నారు.
READ MORE: Israel Iran: ఇరాన్పై ఇజ్రాయిల్ దాడి.. 1981 ఇరాక్పై దాడితో పోలిక..
Also Read
- Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
- OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
- OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్లో ఏం మాట్లాడుకున్నారు..?
- Tirupati Corporation: తిరుపతి కార్పొరేషన్లో పెరిగిన వార్డులు.. 50 నుంచి 66కి పెంపు..
తీవ్రవాద దాడులపై మనోజ్ సిన్హా ఆగ్రహం..
“దురదృష్టవశాత్తూ, మన పొరుగున ఒక దేశం ఉంది. ఆ దేశంలో పేదరికం, ఆకలి ఉన్నప్పటికీ.. జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదం, మాదకద్రవ్యాల అక్రమ రవాణాకు నిరంతరం మద్దతు ఇస్తోంది. అని పాకిస్థాన్ను ఉద్దేశించి అన్నారు. ఇటీవల గందర్బల్, బారాముల్లాలో జరిగిన ఉగ్రవాద దాడుల్లో మన వీర సైనికులు, పౌరులు, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులలో నిమగ్నమైన కార్మికులు వీరమరణం పొందినట్లు గుర్తుచేశారు. భారతదేశపు మొదటి రక్షణ శ్రేణి అయిన బీఎస్ఎఫ్ తమ విధులను మరింత అప్రమత్తంగా నిర్వహించాలని సూచించారు.
READ MORE:MLA Brahmananda Reddy: నాపై విచారణ చేయించమని ప్రభుత్వాన్ని కోరుతున్నా.. జూలకంటి సంచలన వ్యాఖ్యలు
ఇదిలా ఉండగా..జమ్మూకశ్మీర్లో రోజురోజుకూ పెరుగుతున్న ఉగ్రదాడులను ఎదుర్కొనేందుకు ఆర్మీ ఇప్పుడు సరికొత్త వ్యూహంతో ముందుకు సాగుతోంది. బారాముల్లా ఉగ్రదాడిపై భారత సైన్యం ఉత్తర కమాండ్ జనరల్ ఆఫీసర్ కమాండింగ్-ఇన్-చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ ఎంవీ సుచీంద్ర కుమార్ శుక్రవారం స్పందించారు. దాడి చేసిన వారికి సరిహద్దుల ఆవల నుంచి మద్దతు లభిస్తోందన్న అనుమానాల దృష్ట్యా సైన్యం తన వ్యూహాలపై పునరాలోచన చేస్తోందని చెప్పారు. నిర్దిష్ట కార్యాచరణ సమాచారాన్ని పంచుకోలేనప్పటికీ.. ఉద్భవిస్తున్న బెదిరింపులను ఎదుర్కోవటానికి సైన్యం తన వ్యూహాలను సర్దుబాటు చేస్తోందని ఆయన అన్నారు.
తాజావార్తలు
-
Ind vs Afg T20 : ఆఫ్ఘన్పై భారత్ జోరు.. సిరీస్ కైవసం.!
-
Story Board : దిగ్గజాలు వద్దంటున్నారు..ట్రంప్ కావాలంటున్నారు..అసలు ఏఐ విషయంలో ఏం జరుగుతోంది..?
-
Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
-
OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
-
OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్లో ఏం మాట్లాడుకున్నారు..?
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?