Vaishali Express : బీహార్ వెళ్తున్న వైశాలి ఎక్స్ప్రెస్లో మంటలు.. 12 గంటల వ్యవధిలో రెండో ప్రమాదం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vaishali Express : ఉత్తరప్రదేశ్లోని ఇటావాలో రెండో భారీ రైలు ప్రమాదం జరిగింది. ఇక్కడ ఢిల్లీ నుంచి సహర్సా వెళ్తున్న వైశాలి ఎక్స్ప్రెస్ నంబర్ 12554లో మంటలు చెలరేగాయి. ప్యాంట్రీ కారు సమీపంలోని ఎస్6 కోచ్ బోగీలో ఈ ఘటన జరగ్గా, 19 మంది ప్రయాణికులు గాయపడ్డారు. ఇటావాలో 12 గంటల్లో జరగడం ఇది రెండో ఘటన. ఈ ఘటనకు గల కారణాలేమిటన్నది ప్రస్తుతానికి తెలియరాలేదు. రైల్వే అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. సమాచారం అగ్ని ప్రమాదం తర్వాత ప్రభావితమైన 11 మంది ప్రయాణికులను సైఫాయ్ మెడికల్ కాలేజీకి పంపారు. ఎనిమిది మంది ప్రయాణికులు ప్రధాన కార్యాలయంలోని డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ ప్రభుత్వ ఉమ్మడి ఆసుపత్రిలో చేరారు. రైలులోని ఎస్6 కోచ్లో మంటలు ఎలా చెలరేగాయి. దానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. రైలు ఇటావా రైల్వే స్టేషన్లోని ఫ్రెండ్స్ కాలనీ ఏరియాలోని మెయిన్పురి ఔటర్ గేట్ వద్దకు చేరుకున్నప్పుడు ఈ సంఘటన జరిగింది. ప్రస్తుతం ఈ మొత్తం వ్యవహారంపై విచారణ జరుగుతోంది.
Read Also:Kartika Masa Rituals: కార్తీకమాసం ఆచారాలు.. శాస్త్రీయ రహస్యాలు
Also Read
- IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
- Supreme Court: తల్లిదండ్రులు ఐఏఎస్లు అయితే మళ్లీ పిల్లలకు రిజర్వేషన్లు ఎందుకు? సుప్రీంకోర్టు సూటి ప్రశ్నలు
- RBI Dividend: ప్రభుత్వానికి ఆర్బీఐ రికార్డు స్థాయి నిధుల బదిలీ.. దాదాపు రూ.2.87 లక్షల కోట్ల వరకు..
- SRH Vs RCB: ఉప్పల్లో మ్యాచ్ ముగిసినా స్టేడియంలోనే ఉండండి.. కారణం ఏంటంటే..
అంతకు ముందు బుధవారం సాయంత్రం ఢిల్లీ నుంచి దర్భంగా వెళ్తున్న రైలులోని మూడు బోగీల్లో మంటలు చెలరేగాయి. వీటిలో ఒక స్లీపర్ కోచ్, రెండు జనరల్ బోగీలు ఉన్నాయి. ఈ ఘటనలో ఎవరికీ పెద్దగా గాయాలు కాకపోవడం విశేషం. మంటలను అదుపులోకి తెచ్చిన తర్వాత, కాలిపోయిన మూడు బోగీలను రైలు నుండి వేరు చేసి, ఆ తర్వాత ప్రయాణికులను ఇతర కోచ్లలో కూర్చోబెట్టి రైలును పంపించారు. దర్భంగా వెళ్లే రైలు కిటకిటలాడింది. మూడు కోచ్లకు మంటలు అంటుకున్నట్లు సమాచారం అందగానే రైలులో ప్రయాణిస్తున్న మహిళలు, పిల్లలు, వృద్ధులు కూడా కిందకు దూకారు. కొందరికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ మూడు కోచ్లలో దాదాపు 500 మంది ప్రయాణికులు ఉన్నారని రైలు గార్డు బబ్లూ సింగ్ తెలిపాడు. అగ్నిప్రమాదానికి కారణమేమిటో తెలియరాలేదు.
Read Also:Mohammed Shami Final: సెమీ ఫైనల్ కాదు.. ‘షమీ’ ఫైనల్!
ఛార్జింగ్ పాయింట్లో ఎవరో ఛార్జర్ని పెట్టారని.. అప్పుడే షార్ట్ సర్క్యూట్ తరహాలో ఏదో జరిగింది. ఒక చిన్న స్పార్క్ తలెత్తింది. దాని తర్వాత గందరగోళం ఉంది. ట్రైన్లో మంటలు చెలరేగాయని ప్రయాణికులు తెలిపారు. అందరూ అటు ఇటు పరుగెత్తడం ప్రారంభించారు. అప్పుడు రైలు వేగంగా వెళ్తుంది. వెంటనే చైన్ లాగి రైలును నిలిపివేశారు. పలువురికి గాయాలు కాగా పోలీసులు వారిని అక్కడి నుంచి తరలించారు. దాదాపు అరగంట తర్వాత రైల్వే శాఖ అధికారులు వచ్చారని తెలిపారు.
తాజావార్తలు
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
VishnuPriya : ఏడ్చి ఏడ్చి విసిగిపోయా, ఇక నోరు మూసుకునేది లేదు: విష్ణుప్రియ ఫైర్!
-
Supreme Court: తల్లిదండ్రులు ఐఏఎస్లు అయితే మళ్లీ పిల్లలకు రిజర్వేషన్లు ఎందుకు? సుప్రీంకోర్టు సూటి ప్రశ్నలు
-
RBI Dividend: ప్రభుత్వానికి ఆర్బీఐ రికార్డు స్థాయి నిధుల బదిలీ.. దాదాపు రూ.2.87 లక్షల కోట్ల వరకు..
-
SRH Vs RCB: ఉప్పల్లో మ్యాచ్ ముగిసినా స్టేడియంలోనే ఉండండి.. కారణం ఏంటంటే..
ట్రెండింగ్
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!