Siddaramaiah: ఎన్నికల వేళ సిద్ధరామయ్య సెన్సేషనల్ ప్రకటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సార్వత్రిక ఎన్నికల వేళ కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సెన్సేషనల్ ప్రకటన చేశారు. రాజకీయాల నుంచి ఆయన రిటైర్మెంట్ ప్రకటించారు. ఇక వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడం లేదని సంచలన ప్రకటన చేశారు. ప్రస్తుతం తనకు 77 ఏళ్లు అని.. ఇంకా నాలుగేళ్ల తర్వాత వచ్చే ఎన్నికల సమయానికి పని చేసేందుకు అవసరమైన ఆరోగ్యం, ఉత్సాహం ఉండదని తెలిపారు. అందుకే ఇక ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నట్లు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పష్టం చేశారు.
ఇది కూడా చదవండి: Kiren Rijiju: “ఇది 1962 నాటి భారతదేశం కాదు”..చైనాకు కేంద్రమంత్రి వార్నింగ్..
Also Read
- CM Chandrababu: ఆర్టీజీఎస్ కేంద్రంలో సీఎం చంద్రబాబు సమీక్ష.. సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల ప్రైవేటీకరణపై కీలక నిర్ణయం..
- Abhijeet Dipke: ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత.. కాక్రోచ్ జనతా పార్టీ చీఫ్ అభిజీత్ దీప్కే అరెస్ట్..
- India First Dengue Vaccine: శుభవార్త.. భారత్లో తొలి డెంగ్యూ వ్యాక్సిన్కు ఆమోదం.. ఎవరికి? ఎన్ని డోసులు? పూర్తి వివరాలు
- KTR: 'రైతులకు యూరియా లేదు.. ఢిల్లీకి మాత్రం సంచులు ఉన్నాయి'..
వరుణ నియోజకవర్గ ప్రజలు తనను మరోసారి ఎన్నికల్లో పోటీ చేయాలని కోరుతున్నారని.. కానీ ఇకపై ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు. వచ్చే ఎన్నికల నాటికి 81 ఏళ్లు వస్తాయని.. అప్పుడు తన ఆరోగ్యం సహకరించదని పేర్కొన్నారు. అంత ఉత్సాహం పని చేయలేనని.. శరీరం కూడా సహకరించదని స్పష్టం చేశారు. ఎన్నికల్లో అయితే పోటీ చేయను కానీ.. రాజకీయాల్లో ఉంటానని చెప్పుకొచ్చారు.
ఇది కూడా చదవండి: LSG vs RCB: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న బెంగళూరు..
1983లో రాష్ట్ర అసెంబ్లీకి సిద్ధరామయ్య అరంగేట్రం చేశారు. చాముండేశ్వరి నుంచి లోక్దళ్ పార్టీ టికెట్పై ఎన్నికయ్యారు. ఈ నియోజకవర్గం నుంచి ఐదుసార్లు గెలిచి.. మూడుసార్లు ఓటమి చవిచూశారు. ఇక గత ఎన్నికల్లో వరుణ నియోజకవర్గం నుంచి గెలిచి తొమ్మిదోసారి రాష్ట్ర అసెంబ్లీలో సిద్ధరామయ్య అడుగుపెట్టారు. 1978లో తాలూకా బోర్డు సభ్యుడిగా సిద్ధరామయ్య గెలుపొందారు. మళ్లీ కర్ణాటకలో 2028లో జరుగుతాయన్నారు. రాజకీయాల్లోకి వచ్చి 50 ఏళ్లు పూర్తి చేసుకుంటానని తెలిపారు.
ఇది కూడా చదవండి: Konda Surekha : రాహుల్ గాంధీ సభను విజయవంతం చేయాలి…
మైసూర్లో జరిగిన మీడియా సమావేశంలో సిద్ధరామయ్య ఈ వ్యాఖ్యలు చేశారు. వచ్చేసారి ఎక్కడ నుంచి పోటీ చేస్తారని విలేకర్లు అడిగిన ప్రశ్నలకు పై విధంగా సమాధానం ఇచ్చారు. ఇదిలా ఉంటే కేంద్ర హోంమంత్రి అమిత్ షా కర్ణాటకలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా అమిత్ షాను సిద్ధరామయ్య నిలదీశారు. రాష్ట్రానికి తక్షణమే కరవు సాయం ప్రకటించాలని డిమాండ్ చేశారు. కర్ణాటకలో ఏడాది క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 224 నియోజకవర్గాలకు గాను 136 స్థానాల్లో స్పష్టమైన మెజారిటీతో కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి వచ్చింది. సిద్ధరామయ్య ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు.
ఇది కూడా చదవండి: Vishwambhara : దుమ్ము రేపే ఫైట్ సీక్వెన్స్ షూట్ లో బిజీగా చిరు
తాజావార్తలు
-
CM Chandrababu: ఆర్టీజీఎస్ కేంద్రంలో సీఎం చంద్రబాబు సమీక్ష.. సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల ప్రైవేటీకరణపై కీలక నిర్ణయం..
-
West Bengal: సెప్టెంబర్ 1 నుంచి బెంగాల్లో కొత్త రూల్.. మాతృ భాషకు పట్టం కట్టిన సీఎం సువేందు అధికారి!
-
Allu Arjun : పుష్ప 3 పక్కన పెట్టి ఆ నలుగురు డైరెక్టర్లతో బన్నీ భారీ స్కెచ్
-
FIFA ఫైనల్లో ట్రంప్కు ఊహించని అవమానం.. అసలేం జరిగిందంటే?
-
Lenin : అఖిల్ బాక్సాఫీస్ ఊచకోత.. 10 రోజుల్లో ‘లెనిన్’ కలెక్షన్స్ ఎంతో తెలుసా?
ట్రెండింగ్
-
SAIL Recruitment: పరీక్ష లేకుండానే 1,110 అప్రెంటిస్ పోస్టులు.. దరఖాస్తు ఎక్కడ చేసుకోవాలంటే.?
-
Ferrari Amalfi Spider: ఫెరారీ కొత్త కన్వర్టిబుల్ సూపర్కార్ లాంచ్.. ధర ఎంతంటే?
-
Rohit Sharma: మజా ఉండదు కదా.. రిటైర్మెంట్ వార్తలపై తొలిసారి స్పందించిన రోహిత్ శర్మ!
-
Mahindra New SUV: ఆగస్టు 15న మహీంద్రా నుంచి కొత్త SUV.. స్కార్పియో N ఫేస్లిఫ్ట్ ఎంట్రీ ఖాయమేనా?
-
Paneer Tikka Recipe: ప్రోటీన్ రిచ్ ఫుడ్.. టేస్టీ “పన్నీర్ టిక్కా”ను ఇంట్లో సులువుగా చేసేయండి ఇలా.!