ICC మెన్స్ T20 వరల్డ్ కప్ 2026లో భాగంగా, ఫిబ్రవరి 8, 2026న ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఇంగ్లాండ్, నేపాల్ మధ్య గ్రూప్ C మ్యాచ్ జరిగింది. చివరి బంతి వరకు ఉత్కంఠ రేపిన మ్యాచ్ లో కేవలం 4 పరుగుల తేడాతో ఇంగ్లాండ్ విజయం సాధించింది. ఇంగ్లండ్ కి చుక్కలు చూపించింది నేపాల్. ఇంగ్లాండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఇంగ్లాండ్ ఇన్నింగ్స్లో ఓపెనర్లు ఫిల్ సాల్ట్, జాస్ బట్లర్ త్వరగా వికెట్లు కోల్పోయారు. అయితే జాకబ్ బెథెల్ (55), హ్యారీ బ్రూక్ (హాఫ్ సెంచరీ), విల్ జాక్స్ (39* off 18 బాల్స్)ల బ్యాటింగ్తో ఇంగ్లాండ్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 184 రన్స్ సాధించింది. నేపాల్ బౌలర్లలో దిపేంద్ర సింగ్ ఐరీ (2/23), నందన్ యాదవ్ (2 వికెట్లు) మంచి ప్రదర్శన చూపారు. నేపాల్ బౌలింగ్ యూనిట్ ఇంగ్లాండ్ను ఆపడంలో సక్సెస్ఫుల్గా కనిపించింది, కానీ లేట్ ఓవర్లలో విల్ జాక్స్ హిట్టింగ్తో స్కోర్ 185కి చేరుకుంది.
Also Read:Price Drop Alert : Samsung లవర్స్కు పండగే.. Galaxy A55 5Gపై రూ.20,000 డిస్కౌంట్..!
హిస్టారిక్ ప్రయత్నం185 రన్స్ టార్గెట్తో బరిలోకి దిగిన నేపాల్ ఓపెనర్లు ఆసిఫ్ షేక్, కుశల్ భుర్తేల్ మంచి స్టార్ట్ ఇచ్చారు. భుర్తేల్ అద్భుతంగా ఆడాడు. మధ్య ఓవర్లలో రోహిత్ పౌడెల్ (39 off 34), దిపేంద్ర సింగ్ ఐరీ (44 off 29)లు అద్భుత ఇన్నింగ్స్ ఆడారు. ఐరీ రివర్స్ స్వీప్స్, ఇన్నోవేటివ్ షాట్స్తో అందరినీ అలరించాడు. లాస్ట్ ఓవర్లో నేపాల్కు 10 రన్స్ అవసరం ఉండగా, సామ్ కరన్ బౌలింగ్లో నేపాల్ 180/6కి ఆగిపోయింది. ఇంగ్లాండ్ 4 రన్స్ తేడాతో గెలిచింది. ఇది నేపాల్ చరిత్రలో T20 వరల్డ్ కప్లో అత్యధిక స్కోర్ (180/6)గా నిలిచింది. ఈ మ్యాచ్ నేపాల్ క్రికెట్ అభిమానులకు గర్వకారణంగా నిలిచింది. అసోసియేట్ జట్టుగా ఉండి పవర్హౌస్ ఇంగ్లాండ్ను దగ్గరగా తీసుకురావడం చూసి ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తాయి.