Iran Israel tensions: ఎలాన్ మస్క్ కీలక మెసేజ్.. ఇరు దేశాలకు ఏం సూచించారంటే..!
ప్రస్తుతం పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య నివురుగప్పిన నిప్పులా ఉంది. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇటీవలే ఇరాన్.. ఇజ్రాయెల్పై క్షిపణి, డ్రోన్ దాడులతో తెగబడింది. దీనికి ప్రతీకారంగా శుక్రవారం తెల్లవారుజామున ఇజ్రాయెల్ కూడా ఇరాన్పై దాడులకు తెగబడింది. దీంతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. అయితే ఈ దాడులను తిప్పికొట్టినట్లు ఇరాన్ ప్రకటించింది. దీనిపై ఇజ్రాయెల్ మాత్రం స్పందించలేదు.
ఇది కూడా చదవండి: UP slab falls: రీల్స్ కోసం బాలుడు ఎంత పని చేశాడు.. చివరికిలా ముగిసింది!
Also Read
ఈ ఉద్రిక్తల మధ్య తాజాగా టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ శుక్రవారం తనదైన శైలిలో స్పందించారు. ఇరు దేశాలకు శాంతి సందేశం పంపారు. ఎక్స్లో చేసిన ఓ పోస్ట్లో ఇరు దేశాలు పరస్పరం రాకెట్లు, క్షిపణులు వేసుకోవడం కాదు.. బదులుగా అంతరిక్షంలోకి వాటిని పంపాలని సూచించారు. తన పోస్ట్కు ఒక రాకెట్ ఫొటోను కూడా జత చేశారు.
2023 నవంబర్లో ఎలాన్ మస్క్ ఇజ్రాయెల్లో రెండు రోజుల పాటు పర్యటించారు. హమాస్ దాడి ప్రాంతాలను ప్రధాని బెంజిమిన్ నెతన్యాహు.. ఎలాన్ మస్క్కు చూపించారు. ఆ పర్యటన తర్వాత మస్క్ని గాజా సందర్శన కోసం హమాస్ కూడా ఆహ్వానించింది. ఇజ్రాయెల్ బాంబుల దాడిలో తమ ప్రాంతం ఎలా ధ్వంసమైందో చూడాలని కోరింది. స్పేస్ ఎక్స్ కు చెందిన శాటిలైట్ నెట్ వర్క్ స్టార్ లింక్ ఇజ్రాయెల్తో పాటు, గాజా స్ట్రిప్ లో సేవలు అందించేందుకు 2024 ఫిబ్రవరిలో లైసెన్స్ పొందింది. ఈ క్రమంలో ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న పరస్పర దాడులను తక్షణం ఆపాలని సందేశం ఇచ్చేలా ఎలాన్ మస్క్ పోస్ట్ చేయడం ఆసక్తికరంగా మారింది.
ఇది కూడా చదవండి: Premalu 2: యూత్ ఫుల్ ఎంటర్టైనర్ కి సీక్వెల్ రెడీ అవుతోంది.. రిలీజ్ ఎప్పుడంటే?
శుక్రవారం ఉదయం సమయంలో ఇరాన్లో భారీ పెలుళ్లు సంభవించాయి. దీనిపై అధికారిక ప్రకటన వెలువడనప్పటికీ.. ఈ దాడి విషయాన్ని అమెరికాకు చెందిన సైనికాధికారి ఒకరు వెల్లడించారు. అయితే ఇరాన్ ప్రధాని ఇబ్రహీం రైసీ హెచ్చరించిన మరుసటి రోజే ఇజ్రాయెల్ ఈ దాడులకు పాల్పడటం సంచలనం రేపుతోంది. తమ దేశంపై దాడి చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని.. తాము భారీ దాడులకు పాల్పడితే ఇజ్రాయెల్ మిగలదని ఇరాన్ ప్రధాని ఇబ్రహీం రైసీ హెచ్చరించారు. ఈ వ్యాఖ్యలు చేసిన మరుసటి రోజే ఇజ్రాయెల్.. ఇరాన్పై క్షిపణి దాడుల చేసింది. ఇరాన్లోని ఇస్ఫహాన్ నగరం లక్ష్యంగా ఈ క్షిపణులను ఇజ్రాయెల్ ప్రయోగించింది. ఇస్ఫహాన్ ఇరాన్లో అణు కార్యక్రమాలకు కేంద్రంగా ఉంది. ఈ నేపథ్యంలో ఇస్ఫహాన్ను ఇజ్రాయెల్ లక్ష్యంగా చేసుకుంది. మరోవైపు సిరియాపై కూడా ఇజ్రాయెల్ దాడులకు దిగినట్లు తెలుస్తోంది. భారీ స్థాయిలో బాలిస్టిక్ క్షిపణులు ప్రయోగించినట్లు సమాచారం అందుతోంది. దీనిపై అధికారికంగా ఎలాంటి ప్రకటనలు రాలేదు.
We should send rockets not at each other, but rather to the stars pic.twitter.com/h4apedUrsU
— Elon Musk (@elonmusk) April 19, 2024
తాజావార్తలు
-
PBKS Income: 2008 నుంచి ఒక్క ఐపీఎల్ ట్రోఫీ కొట్టని పంజాబ్కు డబ్బులే డబ్బులు.. ఎలా అంటే..
-
AP Mobile Alert: మొబైల్లో అలర్ట్ షాక్.? రేపు ఎన్నిగంటలకంటే..!
-
Himanta Sarma: హిమంత వ్యాఖ్యలతో బంగ్లాదేశ్లో కలకలం..
-
Palakura Ullikaram Recipe : పాలకూర ఉల్లికారం.. అన్నం, చపాతీల్లోకి అదిరిపోయే రుచి.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
RR Vs DC: యశస్వి జైస్వాల్ చేసిన పరుగులు 6.. అయినా మరో ప్రపంచ రికార్డు బద్దలు..
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!