Iran Israel tensions: ఎలాన్ మస్క్ కీలక మెసేజ్.. ఇరు దేశాలకు ఏం సూచించారంటే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రస్తుతం పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య నివురుగప్పిన నిప్పులా ఉంది. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇటీవలే ఇరాన్.. ఇజ్రాయెల్పై క్షిపణి, డ్రోన్ దాడులతో తెగబడింది. దీనికి ప్రతీకారంగా శుక్రవారం తెల్లవారుజామున ఇజ్రాయెల్ కూడా ఇరాన్పై దాడులకు తెగబడింది. దీంతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. అయితే ఈ దాడులను తిప్పికొట్టినట్లు ఇరాన్ ప్రకటించింది. దీనిపై ఇజ్రాయెల్ మాత్రం స్పందించలేదు.
ఇది కూడా చదవండి: UP slab falls: రీల్స్ కోసం బాలుడు ఎంత పని చేశాడు.. చివరికిలా ముగిసింది!
Also Read
- Cockroach Janta Party: ఎంతకీ వదలని కాక్రోజ్.. ఎక్స్ అకౌంట్ బ్లాక్ చేసిన వెంటనే కొత్త అకౌంట్ ప్రత్యక్షం!
- Dog Nanny Jobs: ఆశ్చర్యంగా అనిపించినా ఇది నిజం.. కుక్కను చూసుకుంటే చాలు.. లక్షల్లో జీతం..!
- Cabinet Meeting: ప్రధాని మోడీ నేతృత్వంలో 4.5 గంటల కేబినెట్ భేటీ.. ఏం చర్చించారంటే..?
- Rooftop Water Tank Cooling Tips: ఎండ వేడితో ఇంటిపైన ఉన్న ట్యాంక్ నీరు మరుగుతోందా..? ఈ చిన్న చిట్కాలతో చల్లగా మారిపోతుంది..!
ఈ ఉద్రిక్తల మధ్య తాజాగా టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ శుక్రవారం తనదైన శైలిలో స్పందించారు. ఇరు దేశాలకు శాంతి సందేశం పంపారు. ఎక్స్లో చేసిన ఓ పోస్ట్లో ఇరు దేశాలు పరస్పరం రాకెట్లు, క్షిపణులు వేసుకోవడం కాదు.. బదులుగా అంతరిక్షంలోకి వాటిని పంపాలని సూచించారు. తన పోస్ట్కు ఒక రాకెట్ ఫొటోను కూడా జత చేశారు.
2023 నవంబర్లో ఎలాన్ మస్క్ ఇజ్రాయెల్లో రెండు రోజుల పాటు పర్యటించారు. హమాస్ దాడి ప్రాంతాలను ప్రధాని బెంజిమిన్ నెతన్యాహు.. ఎలాన్ మస్క్కు చూపించారు. ఆ పర్యటన తర్వాత మస్క్ని గాజా సందర్శన కోసం హమాస్ కూడా ఆహ్వానించింది. ఇజ్రాయెల్ బాంబుల దాడిలో తమ ప్రాంతం ఎలా ధ్వంసమైందో చూడాలని కోరింది. స్పేస్ ఎక్స్ కు చెందిన శాటిలైట్ నెట్ వర్క్ స్టార్ లింక్ ఇజ్రాయెల్తో పాటు, గాజా స్ట్రిప్ లో సేవలు అందించేందుకు 2024 ఫిబ్రవరిలో లైసెన్స్ పొందింది. ఈ క్రమంలో ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న పరస్పర దాడులను తక్షణం ఆపాలని సందేశం ఇచ్చేలా ఎలాన్ మస్క్ పోస్ట్ చేయడం ఆసక్తికరంగా మారింది.
ఇది కూడా చదవండి: Premalu 2: యూత్ ఫుల్ ఎంటర్టైనర్ కి సీక్వెల్ రెడీ అవుతోంది.. రిలీజ్ ఎప్పుడంటే?
శుక్రవారం ఉదయం సమయంలో ఇరాన్లో భారీ పెలుళ్లు సంభవించాయి. దీనిపై అధికారిక ప్రకటన వెలువడనప్పటికీ.. ఈ దాడి విషయాన్ని అమెరికాకు చెందిన సైనికాధికారి ఒకరు వెల్లడించారు. అయితే ఇరాన్ ప్రధాని ఇబ్రహీం రైసీ హెచ్చరించిన మరుసటి రోజే ఇజ్రాయెల్ ఈ దాడులకు పాల్పడటం సంచలనం రేపుతోంది. తమ దేశంపై దాడి చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని.. తాము భారీ దాడులకు పాల్పడితే ఇజ్రాయెల్ మిగలదని ఇరాన్ ప్రధాని ఇబ్రహీం రైసీ హెచ్చరించారు. ఈ వ్యాఖ్యలు చేసిన మరుసటి రోజే ఇజ్రాయెల్.. ఇరాన్పై క్షిపణి దాడుల చేసింది. ఇరాన్లోని ఇస్ఫహాన్ నగరం లక్ష్యంగా ఈ క్షిపణులను ఇజ్రాయెల్ ప్రయోగించింది. ఇస్ఫహాన్ ఇరాన్లో అణు కార్యక్రమాలకు కేంద్రంగా ఉంది. ఈ నేపథ్యంలో ఇస్ఫహాన్ను ఇజ్రాయెల్ లక్ష్యంగా చేసుకుంది. మరోవైపు సిరియాపై కూడా ఇజ్రాయెల్ దాడులకు దిగినట్లు తెలుస్తోంది. భారీ స్థాయిలో బాలిస్టిక్ క్షిపణులు ప్రయోగించినట్లు సమాచారం అందుతోంది. దీనిపై అధికారికంగా ఎలాంటి ప్రకటనలు రాలేదు.
We should send rockets not at each other, but rather to the stars pic.twitter.com/h4apedUrsU
— Elon Musk (@elonmusk) April 19, 2024
తాజావార్తలు
-
Cockroach Janta Party: ఎంతకీ వదలని కాక్రోజ్.. ఎక్స్ అకౌంట్ బ్లాక్ చేసిన వెంటనే కొత్త అకౌంట్ ప్రత్యక్షం!
-
Rakul Preet Singh: “మోసం చేస్తే వదిలేస్తా”.. పెళ్లి తర్వాత రిలేషన్పై రకుల్ షాకింగ్ కామెంట్స్!
-
Dog Nanny Jobs: ఆశ్చర్యంగా అనిపించినా ఇది నిజం.. కుక్కను చూసుకుంటే చాలు.. లక్షల్లో జీతం..!
-
Cabinet Meeting: ప్రధాని మోడీ నేతృత్వంలో 4.5 గంటల కేబినెట్ భేటీ.. ఏం చర్చించారంటే..?
-
Ruturaj Gaikwad: ప్లేఆఫ్ రేస్ నుంచి చెన్నై ఔట్ అయ్యాక రుతురాజ్కు మరో షాక్!.. బీసీసీఐ భారీ జరిమానా
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!