Current Bill : గుడ్ న్యూస్ .. మళ్లీ ఫోన్ పేలో కరెంట్ బిల్లులు చెల్లించొచ్చు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Current Bill : రెండు రాష్ట్రాల ప్రజలకు గుడ్ న్యూస్.. కరెంట్ బిల్లుల చెల్లింపు విషయంలో టీజీఎస్పీడీసీఎల్, ఏపీసీపీడీసీఎల్ కీలక నిర్ణయం తీసుకుంది. ఫోన్ పే ద్వారా విద్యుత్ బిల్లులు చెల్లించవచ్చని ప్రకటించారు. ఇటీవల, ఫోన్పే, గూగుల్ పే వంటి డిజిటల్ చెల్లింపులకు డిస్కమ్లు గుడ్బై చెప్పాయి. కానీ నెల రోజుల్లోనే సీన్ మొత్తం రివర్స్.. కరెంట్ బిల్లుల చెల్లింపులు భారీగా తగ్గిపోవడంతో అధికారులు అవాక్కయ్యారు. దీంతో ఫోన్ పే చెల్లింపులను పునరుద్ధరించినట్లు ఉన్నతాధికారులు ప్రకటించారు.
Read Also:Kolkata Doctor Rape : కోల్ కతా ట్రైనీ డాక్టర్ హత్య కేసులో సీబీఐ దర్యాప్తు ముమ్మరం
Also Read
- HCU Drugs: హెచ్సీయూలో గంజాయి కలకలం.. 17 మంది విద్యార్థులకు పాజిటివ్!
- Hardik Pandya: "కెప్టెన్సీ ఇస్తేనే వస్తా".. గుజరాత్ ఫ్రాంచైజీకి హార్దిక్ పాండ్యా షాక్..
- Ram Nath Kovind Autobiography: సామాన్య కుటుంబం నుంచి రాష్ట్రపతి వరకు.. కోవింద్ జీవితంఆదర్శం-ప్రధాని మోడీ
- Best FD Interest Rates August 2026: FDపై 8.50 శాతం వరకు వడ్డీ.. ఆగస్టు 2026లో టాప్ రేట్లు అందిస్తున్న బ్యాంకుల పూర్తి జాబితా
రాష్ట్రాల విద్యుత్ పంపిణీ సంస్థలకు చెందిన టీజీఎస్పీడీసీఎల్, ఏపీసీపీడీసీఎల్ యాప్, వెబ్సైట్తోపాటు ఫోన్పే ద్వారా ప్రస్తుత చెల్లింపులు చేయవచ్చని అధికారులు తెలిపారు. గతంలో వినియోగదారులు ప్రతినెలా విద్యుత్ కార్యాలయాలకు వెళ్లి గంటల తరబడి క్యూలో నిలబడి బిల్లులు చెల్లించేవారు. ఆ తర్వాత డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించారు. వినియోగదారులు ఫోన్ పే, గూగుల్ పే ద్వారా కూడా చెల్లించవచ్చు. అంతా సజావుగా సాగుతున్న తరుణంలో.. ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారం ఫోన్ పే, గూగుల్ పే చెల్లింపులు కుదరదని నెల రోజుల క్రితమే డిస్కమ్ లు నిర్ణయం తీసుకున్నాయి.
Read Also:Nani: NTVతో కలిసి డ్రగ్స్ పట్ల అవగాహన కల్పించిన నేచురల్స్టార్..
ఇప్పటి వరకు వినియోగదారులు తమ కరెంట్ బిల్లులను ఫోన్ పే , Google Pay సహాయంతో సులభంగా చెల్లించేవారు. కొత్త టీజీఎస్పీడీసీఎల్, ఏపీసీపీడీసీఎల్ యాప్, వెబ్సైట్ ద్వారా చెల్లింపులు చేయడంపై ప్రజలు కొంత గందరగోళానికి గురవుతున్నారు. ఈ క్రమంలో విద్యుత్ రెవెన్యూ కార్యాలయాలు, కరెంట్ బిల్లుల చెల్లింపు కేంద్రాల దగ్గర మళ్లీ క్యూ లైన్లు దర్శనమిచ్చాయి. ఫోన్ పే, గూగుల్ పే చెల్లింపుల సస్పెన్షన్ కారణంగా సీపీడీసీఎల్లో చెల్లింపుల బకాయిలు భారీగా ఉండడంతో ఫోన్ పే ద్వారా కూడా చెల్లింపులు పునరుద్ధరించినట్లు ఉన్నతాధికారులు ప్రకటించారు. రానున్న నాలుగైదు రోజుల్లో విద్యుత్ బిల్లుల చెల్లింపులు కూడా గూగుల్ పేతో అందుబాటులోకి వస్తాయని చెప్పారు.
తాజావార్తలు
-
HCU Drugs: హెచ్సీయూలో గంజాయి కలకలం.. 17 మంది విద్యార్థులకు పాజిటివ్!
-
Hardik Pandya: “కెప్టెన్సీ ఇస్తేనే వస్తా”.. గుజరాత్ ఫ్రాంచైజీకి హార్దిక్ పాండ్యా షాక్..
-
Independence Day TV Offers: బంపరాఫర్.. రూ.11,990కే స్మార్ట్ టీవీ..ఛాన్స్ మిస్ చేసుకోవద్దు!
-
Ram Nath Kovind Autobiography: సామాన్య కుటుంబం నుంచి రాష్ట్రపతి వరకు.. కోవింద్ జీవితంఆదర్శం-ప్రధాని మోడీ
-
Janhvi Kapoor : పా. రంజిత్ పర్యవేక్షణలో కోలీవుడ్కి జాన్వీ కపూర్ గ్రాండ్ ఎంట్రీ
ట్రెండింగ్
-
4K 180Hz డిస్ప్లేతో 55, 65, 75 అంగుళాల్లో Hisense UR8S MiniLED TVలు లాంచ్..!
-
9,070mAh బ్యాటరీ, IP69 రేటింగ్, AMOLED డిస్ప్లేతో REDMI K100 Pro Max లాంచ్..!
-
200MP ట్రిపుల్ కెమెరా సెటప్, 8,580mAh బ్యాటరీ, 185Hz డిస్ప్లేతో REDMI K100 Pro లాంచ్.. ధర ఎంతంటే?
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!