Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల స్వీకరణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రెండు తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. నేడు చివరి రోజు కావడంతో నామినేషన్లు భారీగా వచ్చినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. గురువారం మధ్యాహ్నం 3 గంటల వరకు అధికారులు నామినేషన్లు స్వీకరించారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఈ రోజు పులివెందులలో నామినేషన్ దాఖలు చేశారు. ఆయనతోపాటు ఏపీలోని పలు పార్టీలకు చెందిన అభ్యర్థులు చివరి రోజు నామినేషన్ వేశారు. రెండు రాష్ట్రాల్లో ప్రచారం జోరు పెంచారు. అభ్యర్థులు ఇంటింటికీ వెళ్లి ఓట్లు అభ్యర్థిస్తున్నారు.
READ MORE: Mahesh Babu : మహేష్ బాబు కొత్త యాడ్ చూశారా?
Also Read
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 17 పార్లమెంట్ స్థానాలకు గాను దాదాపు 572 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసినట్లు తెలిసింది. ఇవాళ చివరి రోజు కావడంతో భారీగా నామినేషన్లు దాఖలు అయినట్టు అధికారులు తెలిపారు. రాష్ట్రంలోని కంటోన్మెంట్ నియోజకవర్గ ఎమ్మెల్యే లాస్య నందిత ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే. దీంతో ఆ అసెంబ్లీ ఉప ఎన్నికకు కూడా నామినేషన్ ప్రక్రియ నేటితో ముగిసింది. 38 నామినేషన్ల దాఖలు చేసినట్లు అధికారులు వెల్లడించారు. రేపు నామినేషన్ల పరిశీలన, ఈనెల 29వ తేదీన ఉపసంహరణకు గడువు ఉందని అధికారులు వెల్లడించారు.
ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల స్వీకరణ ముగిసింది. గురువారం మధ్యాహ్నం 3 గంటల వరకు అధికారులు అభ్యర్థుల నుంచి నామినేషన్లు తీసుకున్నారు. అనంతరం ప్రక్రియ ముగిసిందని ప్రకటించారు. 25 లోక్ సభ స్థానాలకు గానూ 731 అభ్యర్థులు బరిలో దిగారు. 175 శాసనసభ నియోజకవర్గాలకు 4,210 మంది నామినేషన్లు వేశారు. శుక్రవారం అభ్యర్థుల దరఖాస్తులను పరిశీలించనున్నారు.. అధికారులు. ఈనెల 29 వరకు ఉపసంహరణకు అవకాశం కల్పించారు. మే 13న పోలింగ్ జరగనుండగా..జూన్ 4న ఫలితాలు వెల్లడవుతాయి. రెండు రాష్ట్రాల్లో ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహంచేలా చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు.
- Tags
- AP Elections
- ap govt
- bjp
- jagan
- janasena
తాజావార్తలు
-
TMC Crisis: మమతకు మరో షాక్.. బీజేపీలోకి 20 మంది టీఎంసీ ఎంపీలు..
-
Kala Chana Pulao Recipe: 4 స్టెప్స్లో కాలా చనా పులావ్.. టేస్ట్తో పాటు ప్రోటీన్ డబుల్.!
-
CM Chandrababu: మంత్రులను అలర్ట్ చేసిన సీఎం చంద్రబాబు.. అధికారులకు సీరియస్ క్లాస్..!
-
Annamalai: రేపు బీజేపీకి అన్నామలై రాజీనామా.!
-
Pawan Kalyan: కేబినెట్ సమావేశం మధ్యలోనే వెళ్లిపోయిన డిప్యూటీ సీఎం పవన్!
ట్రెండింగ్
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!
-
రూ.11,999కే Lava Bold N2 5G స్మార్ట్ఫోన్ లాంచ్.. 6000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో పాటు.!
-
Cleaning Tips : రాగి పాత్రలు నల్లబడ్డాయా..? 2 నిమిషాల్లో కొత్తవాటిలా మెరిపించే సీక్రెట్.!