AP Pensions: ఏపీలో పెన్షన్దారులకు కొత్త కష్టాలు..! స్పాట్ మారింది క్యూ తప్పడంలేదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Pensions: ఆంధ్రప్రదేశ్లో పెన్షన్దారులకు కష్టాలు తప్పడం లేదు.. గత నెలలో గ్రామ/వార్డు సచివాలయ దగ్గర పడిగాపులు పడిన వృద్ధులు.. ఇప్పుడు బ్యాంకుల దగ్గర క్యూ కట్టాల్సిన పరిస్థితి వచ్చింది.. మే 1వ తేదీ నుంచి అంటే నిన్నటి నుంచి లబ్ధిదారుల ఖాతాల్లో డీబీటీ ద్వారా పెన్షన్ డబ్బులు జమ చేస్తూ వస్తుంది ప్రభుత్వం.. ఈ రోజు, రేపు కూడా ఈ కార్యక్రమం కొనసాగనుంది.. ఇక, ఆన్లైన్ లేనివారికి నేరుగా ఇంటి వద్దకే వచ్చి పెన్షన్ పంపిణీ చేయనున్నారు అధికారులు.. అయితే, తమ బ్యాంకు ఖాతాల్లో పెన్షన్ సొమ్ము జమ అవుతుండడంతో.. వాటి కోసం ఇప్పుడు బ్యాంకుల దగ్గర బారులు తీరారు వృద్ధులు, పెన్షన్ దారులు.. ఓవైపు తీవ్రమైన ఎండలు దంచికొడుతున్నా.. బ్యాంకులకు వెళ్లాల్సిన పరిస్థితి రావడంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వృద్ధులు.
ఇక, పార్వతీపురం మన్యం గుమ్మలక్ష్మీపురం, కురుపాం ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజన వృద్ధులకు పెన్షన్ తిప్పలు తప్పడం లేదు. ప్రభుత్వం నుండి అందవలసిన వృద్ధాప్య పెన్షన్ తమ బ్యాంకు ఖాతాల్లో జమ అవ్వడంతో గిరిశికర ప్రాంతాల నుండి మండల కేంద్రాలకు అష్ట కష్టాలు పడుతూ బ్యాంకుల ముందు పడిగాపులు కాస్తున్నారు. ప్రతి నెల వాలంటీర్లు ఇంటికి వచ్చి పెన్షన్ అందించే వారిని.. ఇప్పుడు ఇలా బ్యాంకులకు వెళ్లి పెన్షన్ తీసుకోవడం కష్టంగా ఉందని వృద్దులు వాపోతున్నారు. ఏజెన్సీ ప్రాంతంలో 43 డిగ్రీల ఉష్ణోగ్రతల నమోదు అవుతున్న తరుణంలో వేడిని తట్టుకోలేక, బ్యాంకుల ముందు పడిగాపులు కాయలేక లబోదిబోమంటున్నారు. గతంలో ఇంటి దగ్గరకే వచ్చి పెన్షన్లు ఇచ్చేవారు కూడా.. ఇప్పుడు.. ఎన్నికల సమయంలో వారికి కొత్త కష్టాలు తప్పడంలేదు.
Also Read
చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు మండలంలో వృద్ధులకు పెన్షన్ డబ్బు బ్యాంకులో జమ కావడంతో బ్యాంకుల వద్ద పెన్షన్ దారుల హడావిడి కనిపిస్తోంది.. మరోవైపు.. ప్రకాశం జిల్లాలో ఒకటో తేదీనే దాదాపు 70 శాతం మందికి పెన్షన్లు పంపిణీ చేశారు. సచివాలయం వద్దకు వచ్చి పెన్షన్లు తీసుకోలేని వృద్దులకు ఇళ్ళ వద్దకే తీసుకువెళ్ళి పెన్షన్లు పంపిణీ చేస్తున్నారు. జిల్లాలో 69,918 మందికి డీబీటీ ద్వారా పెన్షన్ పంపిణీ చేసే అవకాశం లేకపోవటంతో వారికి స్వయంగా అందజేస్తున్నారు. వారిలో ఇప్పటికే 48,700 మందికి పెన్షన్లు అందజేశారు. మిగతా వారికి రెండవ రోజు పంపిణీ ప్రారంభించారు. ప్రభుత్వం జిల్లాకు 87.49 కోట్లు విడుదల చేసింది. 2,22,607 మందికి బ్యాంకు ఖాతాల్లో జమ చేయగా మిగతా వారికి నేరుగా సచివాలయ సిబ్బంది నగదు అందజేస్తున్నారు. అయితే, డీబీటీ ద్వారా పెన్షన్ సొమ్ము బ్యాంకులో పడడంతో.. వృద్ధులు బ్యాంకుల వద్దరకు చేరుకుంటున్నారు.. ఒకేసారి పెద్ద సంఖ్యలో పెన్షన్ దారులు బ్యాంకులకు రావడంతో.. బ్యాంకుల దగ్గర క్యూలైన్లు కనిపిస్తున్నాయి. అయితే, రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో వృద్ధులు బ్యాంకుల దగ్గర వేచిచూడాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. కొన్ని చోట్ల అయితే, బ్యాంకులు తెరుచుకోకముందే.. పెద్ద సంఖ్యలో అక్కడికి పెన్షన్ డబ్బుల కోసం వృద్దులు తరలివెళ్లారు.
తాజావార్తలు
-
Sandeep Reddy Vanga : ప్రభాస్ ‘స్పిరిట్’ కి A సర్టిఫికెట్ పక్కా.. నేను ఎంత గింజుకున్నా అంతే!
-
Modi-Rahul Gandhi: కులగణనపై మోడీకి ఖర్గే, రాహుల్గాంధీ లేఖ.. ఏముందంటే..!
-
Sandeep Reddy Vanga : ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్!
-
Power Bank Explosion : పవర్ బ్యాంక్ పేలి విద్యార్థికి తీవ్ర గాయాలు
-
OTR: మంత్రి కొండా సురేఖను కేబినెట్ నుంచి తప్పిస్తారా..?
ట్రెండింగ్
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!