West Bengal : 14 గంటల విచారణ… ఆపై అరెస్ట్, రేషన్ పంపిణీ కుంభకోణంలో టీఎంసీ నేతపై ఈడీ యాక్షన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
West Bengal : రేషన్ పంపిణీ కుంభకోణం కేసులో టీఎంసీ నేతలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కీలక చర్యలు తీసుకుంది. 14 గంటల విచారణ అనంతరం ఇద్దరు తృణమూల్ కాంగ్రెస్ నేతలను దర్యాప్తు సంస్థ అరెస్టు చేసింది. టీఎంసీకి చెందిన దేగంగా బ్లాక్ ప్రెసిడెంట్ అనీస్ ఉర్ రెహ్మాన్, అతని అన్నయ్యను ఈడీ అరెస్ట్ చేసింది. అంతకుముందు, దర్యాప్తు సంస్థ కోల్కతా కార్యాలయంలో దాదాపు 14 గంటల పాటు విచారించింది. రేషన్ పంపిణీ కుంభకోణానికి సంబంధించి రెహ్మాన్, అతని సోదరుడిని అరెస్టు చేసినట్లు దర్యాప్తు సంస్థ తెలిపింది. వైద్య పరీక్షల అనంతరం అతడిని కోర్టులో హాజరు పరుస్తామన్నారు. రాష్ట్ర అటవీ శాఖ మాజీ మంత్రి జ్యోతిప్రియ మాలిక్కు రెహ్మాన్ అత్యంత సన్నిహితుడు. ఈ కుంభకోణానికి సంబంధించి కేంద్ర దర్యాప్తు సంస్థ ఇప్పటికే మాజీ మంత్రిని అరెస్టు చేసింది.
Read Also:VD 12: వామ్మో.. దేవరకొండ ఇలా ఉన్నాడేంటి?
Also Read
- Yash Dayal: యశ్ దయాల్ ‘కమ్బ్యాక్’.. ‘పోక్సో’ కేసుల నుంచి విముక్తి!
- Hyderabad: సీఎం, సజ్జనార్ పేర్లు వాడుకుంటూ దందా.. ‘గోల్డ్ మ్యాన్’పై కేసు నమోదు..
- Middle East Tensions: మిడిల్ ఈస్ట్లో మరో భీకర యుద్ధానికి స్క్రిప్ట్.. ఇజ్రాయెల్ లక్ష్యంగా ఇరాన్ ‘షాడో వార్’!
- Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
మాజీ మంత్రికి సన్నిహితుడైన మరో వ్యక్తికి సమన్లు
రైస్మిల్లు యజమాని, మాజీ మంత్రికి చెందిన మరో సన్నిహితుడు బారిక్ బిస్వాస్కు శుక్రవారం విచారణ నిమిత్తం కార్యాలయంలో హాజరుకావాలని ఇడి అధికారులు సమన్లుజారీ చేసినట్లు అధికారి తెలిపారు. మంగళవారం విశ్వాస్ నివాసం, రైస్మిల్లుపై ఈడీ దాడులు నిర్వహించగా రూ.40 లక్షలకు పైగా నగదు, యూఏఈలోని ఆస్తుల్లో పెట్టుబడులకు సంబంధించిన కొన్ని పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
Read Also:CM Chandrababu: ఒక్కరోజులో 97 శాతం పింఛన్ల పంపిణీ.. ఎంతో సంతృప్తిని ఇచ్చింది..
షాజహాన్ షేక్ కూడా అరెస్టు
రేషన్ పంపిణీ కుంభకోణం కేసులో టీఎంసీ నేత షాజహాన్ షేక్ను కూడా ఈడీ అరెస్ట్ చేసింది. ఈ కేసును విచారించేందుకు ఈడీ బృందం షాజహాన్ షేక్ ఇంటికి చేరుకుని దాడులు చేసింది. బృందం అక్కడికి చేరుకోగా, షాజహాన్ కనిపించలేదు, కానీ కేంద్ర అధికారులు ఆ ఇంటి ముందు వ్యతిరేకతను ఎదుర్కొన్నారు. ఈడీ బృందంపై షాజహాన్ మద్దతుదారులు దాడి చేశారు. ఈ దాడిలో ముగ్గురు ఈడీ అధికారులు గాయపడ్డారు. వారిని ఆసుపత్రిలో చేర్చారు.
తాజావార్తలు
-
సమంతకు ముందే.. గర్భంతో నటించిన హీరోయిన్ ఎవరో తెలుసా? ప్రసవాన్నే సినిమాలో చూపించారు!
-
QR Code Mandatory on Medicines: ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం.. ఇకపై అసలైన, నకిలీ మందులను క్షణాల్లో గుర్తించొచ్చు!
-
Raja Shivaji OTT: బాక్సాఫీస్ రికార్డులు బద్దలుకొట్టిన ‘రాజా శివాజీ’.. ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్
-
Yash Dayal: యశ్ దయాల్ ‘కమ్బ్యాక్’.. ‘పోక్సో’ కేసుల నుంచి విముక్తి!
-
Kalki 2 Update: నాగ్ అశ్విన్ మాస్టర్ ప్లాన్.. రెండు సిరీస్లతో ‘కల్కి 2’ భారీ సర్ప్రైజ్!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!