Tragedy : దుబాయ్లో జగిత్యాల వాసి పాకిస్తానీ చేతిలో దారుణ హత్య
- దుబాయ్లో జరిగిన దారుణ హత్య
- పాకిస్థానీయుడి కత్తి దాడిలో శ్రీనివాస్, ప్రేమ్ సాగర్ మృతి
- కేంద్ర మంత్రుల స్పందన – మృతదేహాల తరలింపుకు ఏర్పాట్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tragedy : దుబాయ్లో తెలంగాణ వాసులపై జరిగిన దారుణ ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం దమ్మన్నపేటకు చెందిన సర్గం శ్రీనివాస్ అనే వ్యక్తి, ఓ పాకిస్తానీ వ్యక్తి చేతిలో కత్తితో దాడికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. శుక్రవారం సెలవు సందర్భంగా ఓ బేకరీలో పని చేస్తున్న సమయంలో శ్రీనివాస్, నిర్మల్కు చెందిన ప్రేమ్ సాగర్, నిజామాబాద్కు చెందిన మరో శ్రీనివాస్ అనే వ్యక్తి చిట్ చాట్ చేస్తున్నారు. అదే సమయంలో ఓ పాకిస్తానీ వ్యక్తి ఒక్కసారిగా విరుచుకుపడి కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో ధర్మపురి శ్రీనివాస్, ప్రేమ్ సాగర్ అక్కడికక్కడే మృతి చెందగా, నిజామాబాద్ శ్రీనివాస్ తీవ్రంగా గాయపడ్డారు.
పాకిస్తానీ దుండగుడు దాడి చేసే సమయంలో ప్రత్యేక నినాదాలు చేస్తున్నట్లు ప్రత్యక్షసాక్షులు తెలిపారు. ఇదంతా పని చేసే స్థలమైన బేకరీలోనే జరిగింది. మృతులు ముగ్గురూ అక్కడ ఉద్యోగులుగా పనిచేస్తున్నారు. ఈ దారుణ ఘటనపై కేంద్ర మంత్రులు ఎస్. జైశంకర్, కిషన్ రెడ్డి వెంటనే స్పందించారు. వీరంతా విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికారులతో మాట్లాడి, మృతదేహాలను తక్షణమే స్వదేశానికి రప్పించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మృతుల కుటుంబాలకు న్యాయం జరుగేలా చూస్తామని, అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ ఘటనతో విదేశాల్లో పనిచేస్తున్న భారతీయుల భద్రతపై ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రభుత్వం ఈ ఘటనపై పూర్తి స్థాయిలో స్పందించి, బాధిత కుటుంబాలకు సహాయం చేయాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.
Also Read
- NTA Exam Schedule: పరీక్షల క్యాలెండర్ విడుదల చేసిన NTA.. యూజీసీ నెట్ తేదీలివే..
- Pakistan: పాక్ ఆర్మీకి అమెరికా డ్రోన్లు.. ట్రంప్ కుమారులతో లింక్.!
- Trump-Houthi: సౌదీకి ట్రంప్ షాక్! హౌతీలతో రహస్య భేటీ.. అమెరికా సైడ్ అయినట్టేనా?
- Sanatana Row: తమిళనాడులో ‘‘సనాతన ధర్మం’’పై వివాదం.. మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు..
తాజావార్తలు
-
NTA Exam Schedule: పరీక్షల క్యాలెండర్ విడుదల చేసిన NTA.. యూజీసీ నెట్ తేదీలివే..
-
Pakistan: పాక్ ఆర్మీకి అమెరికా డ్రోన్లు.. ట్రంప్ కుమారులతో లింక్.!
-
Trump-Houthi: సౌదీకి ట్రంప్ షాక్! హౌతీలతో రహస్య భేటీ.. అమెరికా సైడ్ అయినట్టేనా?
-
Warangal Cyber Crime : రూ.8 వేల కోసం ఖాతాలు అమ్మేశారు.. 185 సైబర్ కేసుల్లో లింకులు
-
Sanatana Row: తమిళనాడులో ‘‘సనాతన ధర్మం’’పై వివాదం.. మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!