Assam: అస్సాంలో రూ.7.25 కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం.. ఇద్దరు అరెస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Assam: అస్సాం భారీ డ్రగ్స్ రాకెట్ గుట్టు రట్టు చేశారు పోలీసులు. పోలీసుల ప్రత్యేక టాస్క్ ఫోర్స్ (STF) గురువారం రాత్రి ఇద్దరు డ్రగ్స్ స్మగ్లర్లను అరెస్టు చేసింది. వారి వద్ద నుండి 7.25 కోట్ల రూపాయల విలువైన 29,000 యాబా టాబ్లెట్లను స్వాధీనం చేసుకున్నట్లు సీనియర్ అధికారి తెలిపారు. డిఐజి (ఎస్టిఎఫ్) పార్థ సారథి మహంత్ ఎఎన్ఐకి ఇచ్చిన సమాచారం మేరకు గౌహతిలోని గోర్చుక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కథబరి ప్రాంతంలో ఎస్టిఎఫ్ బృందం ఆపరేషన్ నిర్వహించింది. ఆయన మాట్లాడుతూ, “ఆపరేషన్ సమయంలో గౌహతి నగరంలోని గోర్చుక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కథబరి ప్రాంతంలో మేము 29,000 యాబా టాబ్లెట్లను స్వాధీనం చేసుకున్నాం. మేము స్మగ్లర్ల అద్దె ఇంటి నుండి ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసాం.” అని పేర్కొన్నారు. అరెస్టయిన వారిని బార్పేట పోలీస్స్టేషన్ పరిధిలోని కథబరీకి చెందిన ముజక్కిర్ హుస్సేన్, భేలాకు చెందిన సైఫుల్ ఇస్లామ్గా గుర్తించారు.
Read Also:Tunnel Accident: టన్నెల్ నుంచి కార్మికులను ఎలా బయటకు తీస్తారో తెలుసా?
Also Read
- Praggnanandhaa: సీఎం విజయ్కు చెక్మేట్.. సత్కారంతో పాటు రూ.50 లక్షల నగదు బహుమతి.!
- Mamata Banerjee: మమతా బెనర్జీకి మరో షాక్.. సుఖేందు శేఖర్ రాయ్ టీఎంసీని వీడి రాజ్యసభ ఎంపీ పదవికి రాజీనామా
- Relationship Controversy: అందానికి ముగ్ధుడై పిల్లనిచ్చిన అత్తతో ప్రేమలో పడ్డ అల్లుడు.. లేచిపోయి వివాహం
- INDIA Alliance Meeting: విజయ్ పార్టీకి ఊహించని పరిణామం.. టీవీకేను పక్కన పెట్టిన ఇండియా కూటమి?
అంతకు ముందు నవంబర్ 8వ తేదీన కూడా అసోంలోని మూడు జిల్లాల నుంచి సుమారు రూ.6.7 కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలో ఓ మహిళ సహా ఆరుగురిని అరెస్టు చేశారు. కామ్రూప్ జిల్లాలో స్పెషల్ టాస్క్ ఫోర్స్ బృందం మణిపూర్ నుండి వస్తున్న వాహనాన్ని అమింగ్గావ్ వద్ద ఆపి 36 కిలోల నల్లమందును స్వాధీనం చేసుకున్నట్లు అదనపు ఎస్పీ (ఎస్టిఎఫ్) కళ్యాణ్ కుమార్ పాఠక్ తెలిపారు. 36 ప్యాకెట్లలో ఉంచిన ఈ డ్రగ్ను పంజాబ్ వెళ్లే వాహనంలోని రహస్య గదుల్లో దాచి ఉంచినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో నలుగురు స్మగ్లర్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిపై చట్టపరమైన చర్యలు తీసుకున్నారు. పట్టుబడిన నల్లమందు విలువ రూ.6 కోట్లు ఉంటుందని అంచనా. మరో సంఘటనలో, కర్బీ అంగ్లాంగ్ జిల్లాలోని ఖత్ఖాతి ప్రాంతంలో ఒక వాహనం నుండి 32.2 గ్రాముల హెరాయిన్ను పెట్రోలింగ్ బృందం స్వాధీనం చేసుకుంది. ఒక వ్యక్తిని అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు. ఇది కాకుండా, పోలీసులు 42.5 గ్రాముల హెరాయిన్ను కూడా స్వాధీనం చేసుకున్నారు. గౌహతిలోని ఖానాపరా ప్రాంతానికి చెందిన ఒక మహిళను అరెస్టు చేశారు.
Read Also:Japan Movie: ‘జపాన్ ‘ ఓటీటీ రిలీజ్ డేట్ లాక్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
తాజావార్తలు
-
CM Chandrababu: ఇప్పుడు రైతుల భూ రికార్డులను ఎవరూ ట్యాంపర్ చేయలేరు!
-
Praggnanandhaa: సీఎం విజయ్కు చెక్మేట్.. సత్కారంతో పాటు రూ.50 లక్షల నగదు బహుమతి.!
-
Jasprit Bumrah: ఐపీఎల్ పూర్తి సీజన్ ఆడుతాడు, భారత్ మ్యాచ్లు మాత్రం ఆడడా.. బుమ్రాపై మాజీ క్రికెటర్ ఫైర్!
-
ATM Withdrawals: ఏటీఎం నుంచి డబ్బు తీసేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా.. మీ ఖాతా ఖాళీ అయ్యే ప్రమాదం ఉంది!
-
Vivo X Fold 6: ఏఐ ఫీచర్లు, న్యూ యూజర్ ఇంటర్ఫేస్తో.. వివో ఎక్స్ ఫోల్డ్ 6 త్వరలో విడుదల
ట్రెండింగ్
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!