Drugs Case: రూ. 2,000 కోట్ల డ్రగ్స్ రాకెట్.. మాస్టర్మైండ్ సినీ నిర్మాత!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
International Drug Trafficking Racket: భారత దేశంలో మరోసారి అంతర్జాతీయ డ్రగ్ ట్రాఫికింగ్ నెట్వర్క్ గుట్టురట్టయ్యింది. ఢిల్లీ పోలీసులు, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్లో డ్రగ్ ట్రాఫికింగ్ నెట్వర్క్ను అధికారులు ఛేదించారు. ఈ కేసులో ముగ్గురిని అరెస్టు చేశారు. మాదక ద్రవ్యాలను తయారు చేయడానికి ఉపయోగించే రసాయనాన్ని పెద్ద మొత్తంలో స్వాధీనం చేసుకున్నారు. ఇక ఈ వ్యవహారంలో ప్రధాన సూత్రధారిగా తమిళ సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖ నిర్మాత ఉన్నట్లు గుర్తించారు. అయితే ప్రస్తుతం అతడు పరారీలో ఉన్నాడట.
అంతర్జాతీయ స్థాయిలో సూడోఫెడ్రిన్కు భారీగా డిమాండ్ ఉంది. మెథాంఫేటమిన్ తయారీలో సూడోఫెడ్రిన్ను వినియోగిస్తారు. న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, మలేషియాలో కిలో రూ.1.5 కోట్లకు విక్రయిస్తున్నారు. ఆ మూడు దేశాలకు పెద్ద మొత్తంలో సూడోఫెడ్రిన్ పంపుతున్నట్లు ఎన్సీబీకి సమాచారం తెలిసింది. సూడోఫెడ్రిన్ను హెల్త్ మిక్స్ పొడులు, కొబ్బరి సంబంధిత ఆహార ఉత్పత్తులతో కలిపి సముద్ర మార్గంలో రవాణా చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ మాదకద్రవ్యాల మాఫియా కదలికలపై ఎన్సీబీ నిఘా పెట్టింది. సరకును ఆస్ట్రేలియాకు పంపడానికి ప్రయత్నిస్తున్నట్లు అధికారులు గుర్తించారు.
Also Read
- Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
- Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
- Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
- Pakistan: పాకిస్తాన్ మరోసారి.. భారత విమానాలపై గగనతల ఆంక్షలు పొడగింపు..
Also Read: Vijay Sankalp Yatra: నేడు తెలంగాణకు గుజరాత్ సీఎం.. కిషన్ రెడ్డి షెడ్యూల్ ఇదే..!
ఢిల్లీ పోలీసులు, ఎన్సీబీ అధికారులు ఫిబ్రవరి 15న పశ్చిమ ఢిల్లీలోని దారాపుర్లోని గోదాంలో సోదాలు నిర్వహించి 50 కిలోల సూడోఫెడ్రిన్ను స్వాధీనం చేసుకున్నారు. ఘటనా స్థలంలో ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేశారు. ఈ డ్రగ్ నెట్వర్క్ భారత్ సహా మలేసియా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియాలకు విస్తరించినట్లు విచారణలో తేలింది. ఈ ముఠా ఇప్పటి వరకు 3500 కిలోల సూడోఫెడ్రిన్ ఉన్న 45 పార్శిళ్లను ఎగుమతి చేసిందని, వాటి విలువ రూ.2 వేల కోట్లకు పైగా ఉంటుందని తేలింది. డ్రగ్స్ అక్రమ స్వాధీనం, వ్యాపారం చేయడంతో నిందితులకు 10 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడుతుంది.
తాజావార్తలు
-
OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
-
Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
-
Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
-
Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
-
Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!