Delhi Metro : ఢిల్లీ మెట్రోలో మందుబాబుల వీరంగం.. వీడియో వైరల్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశ రాజధాని ఢిల్లీ మెట్రో ఈ మధ్య కాలంలో నిత్యం వార్తల్లో నిలుస్తుంది. మొన్నటి వరకు ఓ ఎత్తు అయితే తాజాగా జరిగిన ఘటన మరో ఎత్తు అని చెప్పొచ్చు.. చాలా మంది ప్రయాణికులు మెట్రో ప్రయాణం చాలా పొదుపుగా, సౌకర్యవంతంగా ఉంటుంది అని ఇందులో ప్రయాణిస్తుంటారు. అలాంటి ఢిల్లీ మెట్రోలో గత కొంతకాలంగా ఆకతాయిలు రెచ్చిపోయి ప్రవర్తిస్తున్నారు. చిత్ర విచిత్ర చేష్టలతో తోటి ప్రయాణికులకు చిరాకు పుట్టిస్తున్నారు. కొందరు అసభ్యంగా ప్రవర్తించిన ఘటనలు కూడా ఈ మధ్య వెలుగులోకి రావటంతో ఢిల్లీ మెట్రో అధికారులు స్పందించారు. అలాంటి వెకిలీ చెష్టలు చేస్తున్న వారిపట్ల కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తునే వస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఢిల్లీ మెట్రో మరో సంఘటన తొటి ప్రయాణికుల్ని కలవరపెడుతోంది.
Also Read : TMC PARTY : కొత్త పార్లమెంట్ భవన ప్రారంభోత్సవానికి మేము రాలేము..
Also Read
- PM Modi: పర్యావరణ పరిరక్షణతోనే ఆర్థిక ప్రగతి.. ప్రపంచానికి భారత్ ఆదర్శం
- Kishan Reddy: కాంగ్రెస్, బీఆర్ఎస్కు హైకోర్టు తీర్పు చెంపపెట్టు.. కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు..
- Petrol Pump UPI Payments: పెట్రోల్ పంపుల్లో UPI చెల్లింపులకు బ్రేక్..? డీలర్ల కీలక ప్రకటన
- Gold and Silver Price Today: బంగారం, వెండి ధరలకు మళ్లీ రెక్కలు.. రెండో రోజూ భారీ పెరుగుదల
ఈ సారి ఢిల్లీ మెట్రో రైల్ లో మందుబాబులు హల్చల్ చేశారు. ఢిల్లీ మెట్రోలో ప్రయాణిస్తున్న ఇద్దరు మందుబాబులు వీరంగానికి తోటి ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది పడ్డారు.. దీంతో వారు తమ సెల్ఫోన్ల ద్వారా రికార్డ్ చేశారు. మత్తులో ప్రయాణిస్తున్న మందుబాబుల వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో.. మరోసారు ఢిల్లీ మెట్రో వార్తలు వైరల్గా మారాయి. వీళ్లేప్పుడు మారతర్రా బాబు అంటూ పలువురు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. వైరల్ అయినా వీడియోను చూస్తే.. రైలు కోచ్ లోపల కింద కూర్చున్న వ్యక్తులు మద్యం మత్తులో ఉన్నట్లు మనం చూడొచ్చు. వీడియోపై DMRCని ట్యాగ్ చేస్తూ ప్రశ్నించాడు.
Also Read : Off The Record: ఏపీ ఉద్యోగ సంఘాలకు ఉమ్మడి లక్ష్యం లేదా? ఎందుకు వెనకబడిపోతున్నారు?
ఢిల్లీ మెట్రో ప్రయాణీకుడు ఇద్దరు వ్యక్తులు మద్యం మత్తులో ప్రయాణిస్తున్న వీడియోను షేర్ చేశారు. ఢిల్లీ మెట్రో రైలు కోచ్ లోపల నేలపై కూర్చున్న వ్యక్తులు మద్యం మత్తులో ఉన్నట్లు కనిపిస్తుంది. ఈ రకమైన తాగుబోతులను మెట్రోలో ఎలా అనుమతిస్తారంటూ సదరు ప్రయాణికుడు ప్రశ్నించారు. దీనిపై స్పందించిన డీఎంఆర్సీ ఘటన జరిగిన కోచ్ నంబర్ను తెలుసుకోవాలని కోరింది. పటేల్ నగర్, రాజేంద్ర ప్యాలెస్ స్టేషన్ల మధ్య ఉన్న మెట్రో బ్లూ లైన్లో ఈ వీడియోను రికార్డు చేశానని ప్రయాణికుడు బదులిచ్చారు. మందుబాబులు కరోల్ బాగ్ వద్ద మెట్రో దిగారు. మీరు మీ cctv (sic)ని చెక్ చేసుకోవచ్చు అంటూ డీఎంఆర్సీకి సూచించారు.
Dear @OfficialDMRC
This type of alcoholic persons are allowed in metro ??? pic.twitter.com/7ZnjrPtDQp— anuraag dubey (@Dubey7242Dubey) May 23, 2023
తాజావార్తలు
-
PM Modi: పర్యావరణ పరిరక్షణతోనే ఆర్థిక ప్రగతి.. ప్రపంచానికి భారత్ ఆదర్శం
-
Indian Cinema: పాన్ ఇండియా నుంచి పాన్ వరల్డ్ మార్కెట్ వైపు అడుగులు వేస్తున్న ఇండియన్ సినిమాలు
-
Kishan Reddy: కాంగ్రెస్, బీఆర్ఎస్కు హైకోర్టు తీర్పు చెంపపెట్టు.. కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు..
-
Petrol Pump UPI Payments: పెట్రోల్ పంపుల్లో UPI చెల్లింపులకు బ్రేక్..? డీలర్ల కీలక ప్రకటన
-
Shivam Dube: ధోనీ vs రోహిత్.. ఇద్దరిలో ఎవరు బెస్ట్ టీ20 కెప్టెన్.. దూబేకు పెద్ద సమస్యే వచ్చిందే!
ట్రెండింగ్
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!