స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ ప్రస్తుతం తన కెరీర్ మళ్ళీ సెట్ చేసుకోడానికి తెగ ప్రయత్నిస్తున్నాడు. రీసెంట్ గా స్టార్ హీరో విజయ్ దేవరకొండ తో చేసిన లైగర్ సినిమా దారుణంగా ప్లాప్ అయింది.హీరో విజయ్ దేవరకొండ ఈ సినిమా పై భారీగా ఆశలు పెట్టుకున్నాడు కానీ ఆ సినిమా తీవ్రంగా నిరాశ పరిచింది.లైగర్ కు ముందు పూరి తెరకెక్కించిన ఇస్మార్ట్ శంకర్ సినిమా పూరి కి అదిరిపోయే విజయం అందించింది.ఇస్మార్ట్ శంకర్ సినిమాకు ముందు చేసిన సినిమాలు పూరి కి చాలా నిరాశ నే మిగిల్చాయి. ఇప్పుడు మరొక సాలిడ్ హిట్ కొడితే గానే పూరి జగన్నాద్ కు స్టార్ హీరోల సినిమాలు వచ్చే అవకాశం లేదు.ఇకపోతే గతంలో పూరి చేసిన సినిమాలలో మ్యూజిక్ అద్భుతంగా ఉండేది. సినిమా ప్లాప్ అయినా కానీ పాటలు బాగా ట్రెండ్ అయ్యేవి.
లైగర్ సినిమాలో మ్యూజిక్ అంతగా మెప్పించలేక పోయింది. ఒక విధంగా చెప్పాలంటే ఆ సినిమా ప్లాప్ అవ్వడానికి మ్యూజిక్ కూడా ప్రధాన కారణం అని చెప్పొచ్చు.. సోషల్ మీడియా లో లైగర్ మ్యూజిక్ కి ట్రోల్స్ కూడా వచ్చాయి. పలువురు సంగీత దర్శకులు లైగర్ కి సంగీతాన్ని అందించారు. అయినా కూడా ఒక్క పాట కూడా ట్రెండింగ్ అవ్వలేదు.దాంతో ఈసారి పూరి రూపొందిస్తున్న డబుల్ ఇస్మార్ట్ సినిమా లో అయినా పాటలు బాగుండే విధంగా చర్యలు తీసుకుంటే బాగుంటుందని ప్రేక్షకులు భావిస్తున్నారు.కానీ పూరి మరోసారి అదే మిస్టేక్ చేస్తున్నట్లు సమాచారం.ఇస్మార్ట్ శంకర్ సినిమా కు మణిశర్మ అద్భుతమైన సంగీతాన్ని అందించాడు. అందులోని పాటలు చాట్ బస్టర్ గా నిలిచాయి.ఇప్పటికీ ఆ సినిమా పాటలు ఎక్కడోచోట వినిపిస్తూనే ఉన్నాయి. అలాంటి మణిశర్మ సంగీతాన్ని వదిలేసి మళ్లీ బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ ను వెతికే పనిలో వున్నాడని సమాచారం.తెలుగు ప్రేక్షకులకు బాలీవుడ్ సంగీత దర్శకుల పాటలు నచ్చవు అని తెలిసి కూడా పూరి ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకుంటున్నాడో అని నెటిజన్స్ ట్రోల్స్ చేస్తున్నారు.