టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని నటిస్తున్న లేటెస్ట్ చిత్రం డబుల్ ఇస్మార్ట్. హై ఆక్టేన్ యాక్షన్ ఎంటర్టైనర్గా వస్తున్న ఈ చిత్రాన్ని పూరీ కనెక్ట్స్ బ్యానర్ తెరకెక్కిస్తోంది. డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీలో బాలీవుడ్ స్టార్ యాక్టర్ సంజయ్ దత్ విలన్గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో తన పాత్ర కోసం మున్నాభాయ్ తీసుకుంటున్న రెమ్యునరేషన్ వార్త ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతుంది..తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాకు సంజయ్ దత్ ఏకంగా రూ.6 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడన్న వార్త ఇప్పుడు నెట్టింట తెగ హల్ చల్ చేస్తోంది. కేజీఎఫ్ చాఫ్టర్ 2 తర్వాత సంజయ్ దత్ మార్కెట్ పెరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సంజయ్ దత్ డబుల్ ఇస్మార్ట్ కోసం భారీ రెమ్యునరేషన్ తీసుకుంటున్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి.
పూరీ కనెక్ట్స్ బ్యానర్ డబుల్ ఇస్మార్ట్ ఈజ్ బ్యాక్.. అంటూ ఇటీవలే రామ్ సెట్స్లో సెల్ఫీ తీసుకుంటున్న స్టిల్ను షేర్ చేసింది . ముంబైలో ఈ చిత్ర షూటింగ్ కొనసాగుతుంది. కొన్ని కీలకమైన సన్నివేశాలను అక్కడ చిత్రీకరిస్తున్నారు. 2024 మార్చి 8న ఈ సినిమా థియేటర్లలో సందడి చేయనుంది.. అంటూ ట్వీట్ చేసింది. రామ్ సిక్స్ ప్యాక్ బాడీలో కనిపిస్తున్న ఈ లుక్ నెట్టింట బాగా వైరల్ అవుతోంది.ఇస్మార్ట్ శంకర్కు సీక్వెల్గా వస్తున్న ఈ మూవీ తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో గ్రాండ్గా విడుదల కానుంది. ఇస్మార్ట్ ఈజ్ బ్యాక్.. ఈ సారి డబుల్ ఇంపాక్ట్.. అంటూ శక్తిమంతమైన త్రిశూలం బ్యాక్ డ్రాప్లో మంటలు కనిపిస్తున్న లుక్తో ఈ సినిమాలో డబుల్ ఎంటర్టైన్ మెంట్ అందించబోతున్నట్టు పూరీ తెలియజేశారు.. ఈ చిత్రానికి మెలోడీ బ్రహ్మ మణిశర్మ మ్యూజిక్ అందిస్తున్నారు..ఇస్మార్ట్ శంకర్ మూవీ కి మణిశర్మ అందించిన మ్యూజిక్ చాట్ బస్టర్ అయింది.. మరి డబల్ ఇస్మార్ట్ కు అంతకు మించి ఆల్బమ్ ఉండనున్నట్లు సమాచారం.