Minister Ramprasad Reddy: జిల్లాల పునర్విభజనలో వదంతులను నమ్మొద్దు..
- అన్నమయ్య జిల్లాపై వస్తున్న వదంతులను నమ్మొద్దు..
- ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వం పని చేస్తుంది..
- అన్నమయ్య జిల్లా ముక్కలు కాబోతోందంటూ వైరల్ అవుతున్న వార్తలను నమ్మొద్దు..
- రాయచోటి అన్నమయ్య జిల్లా కేంద్రంగానే ఉంటుందన్న మంత్రి రాంప్రసాద్ రెడ్డి..
Minister Ramprasad Reddy: ఆంధ్రప్రదేశ్లో జిల్లాల పునర్విభజనపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.. జిల్లాల పునర్విభజనపై స్వల్ప మార్పులు.. చేర్పులతో ముందుకు వెళ్లాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. జిల్లాలు, డివిజన్లు, మండలాల పునర్విభజన ప్రాథమిక నోటిఫికేషన్పై వ్యక్తమైన సూచనలు, సలహాలను పరిగణనలోకి తీసుకుని తుది నోటిఫికేషన్ జారీ చేయాలని సూచించారు. గత నెల 27న జిల్లాల పునర్విభజనపై రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేసింది. కొత్తగా 3 జిల్లాలు, 5 రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుతో సహా వివిధ మార్పులపై నోటిఫికేషన్ విడుదల కాగా… దీనిపై నెల రోజుల పాటు ప్రభుత్వం అభ్యంతరాలను స్వీకరించింది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 927 అభ్యంతరాలు, సూచనలు రాగా… వాటిపై క్యాంపు కార్యాలయంలో శనివారం మంత్రులు, అధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. అయితే, జిల్లాల పునర్విభజన ప్రక్రియపై, ముఖ్యంగా అన్నమయ్య జిల్లాకు సంబంధించి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వదంతులను ప్రజలు నమ్మవద్దని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. మీడియాకు ఓ వీడియో విడుదల చేసిన ఆయన.. పునర్విభజన అంశంలో జరుగుతున్న ప్రచారం తుది నిర్ణయాలు కాదని స్పష్టంచేశారు.
Read Also: Boxing Day tsunami: 23,000 అణుబాంబులు పేలితే ఎలా ఉంటుందో, అదే 2004 సునామీ..
Also Read
- Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
- Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
- RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
- SAD: బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తిని.. ఒకే కటుంబానికి చెందిన 4 గురు మృతి..
జిల్లా ముక్కలు కాబోతోందంటూ వస్తున్న వార్తలు కేవలం ఊహాగానాలు, అవగాహనలేని ప్రచారం మాత్రమేనని పేర్కొన్నారు మంత్రి రాంప్రసాద్ రెడ్డి.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజల ఆకాంక్షలు, అభిప్రాయాలను పూర్తిస్థాయిలో పరిగణలోకి తీసుకుని మాత్రమే నిర్ణయాలు తీసుకుంటారని మంత్రి తెలిపారు. రాయచోటి అన్నమయ్య జిల్లా కేంద్రంగానే కొనసాగుతుందని మంత్రి మరోసారి స్పష్టం చేశారు.. రాయచోటి ప్రజలు, నాయకులు ప్రభుత్వం పట్ల పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని, జిల్లా కేంద్రం విషయంలో ఎలాంటి మార్పులు ఉండవని ఆయన భరోసా ఇచ్చారు. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంతో ప్రజల్లో ఆందోళన నెలకొన్న నేపథ్యంలో, త్వరలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలిసి జిల్లాలోని తాజా పరిస్థితిని వివరించి, సమస్యకు పరిష్కారం చూపుతామని.. ప్రజల అభిప్రాయానికే ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని, పరిపాలన మరింత మెరుగుపడేలా మాత్రమే పునర్విభజన మార్పులు ఉంటాయని మంత్రి పేర్కొన్నారు. వదంతులు వ్యాప్తి చేసే అసత్య ప్రచారాలను ప్రజలు అప్రమత్తంగా గమనించాలని ఆయన కోరారు. ప్రభుత్వం తుది నోటిఫికేషన్ ప్రకటించే వరకు అనధికారిక ప్రచారాలను విశ్వసించవద్దని సూచించారు మంత్రి రాంప్రసాద్ రెడ్డి..
తాజావార్తలు
-
Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?
-
Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
-
Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్లో వలస నేతల డామినేషన్
-
Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
-
RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!