Kejriwal: ఆ ఫుకార్లు నమ్మొద్దు.. ఆప్ సర్కార్ విజ్ఞప్తి
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అరెస్ట్ అయిన నేపథ్యంలో తాజాగా రకరకాలైన వదంతులు పుట్టుకొస్తున్నాయి. సంక్షేమ పథకాలు నిలిచిపోతున్నాయంటూ సోషల్ మీడియా వేదికగా వార్తలు షికార్లు చేస్తున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో ఆప్ సర్కార్ అప్రమత్తమైంది. కేజ్రీవాల్ అరెస్టుతో సంక్షేమ పథకాలు నిలిచిపోతాయంటూ జరుగుతున్న దుష్ప్రచారాన్ని ప్రజలు నమ్మొద్దని ఆప్ సర్కార్ ప్రజలకు విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు ప్లానింగ్ డిపార్టుమెంట్ ఓ ప్రకటన విడుదల చేసింది.
కేజ్రీవాల్ అరెస్ట్తో ఢిల్లీలో అమలవుతోన్న సంక్షేమ పథకాలు, సబ్సిడీలు నిలిచిపోతాయంటూ సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రచారం జరుగుతోంది. దీంతో ఢిల్లీ ప్రభుత్వం ప్రజల్ని అప్రమత్తం చేసింది. చట్టం తన పని తాను చేస్తుందని.. పథకాల అమలు, పాలన అనేవి ఎప్పుడూ వ్యక్తులకు సంబంధించినవి కావని ఆమ్ ఆద్మీ ప్రభుత్వం స్పష్టం చేసింది. సామాన్య ప్రజల్లో భయాందోళనలు సృష్టించేందుకే ఇలాంటి తప్పుడు సమాచారం వ్యాప్తి చేస్తున్నారని పేర్కొంది. కేజ్రీవాల్ ఆదేశాల మేరకే ఈ ప్రకటన విడుదల చేసినట్లు ఆప్ వర్గాలు స్పష్టం చేశాయి.
Also Read
- Gujarat Election Results: గుజరాత్ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. అన్ని కార్పొరేషన్లు కైవసం
- AP Fuel Crisis: తగ్గిన పెట్రోల్ డీజిల్ కొరత ప్రభావం.. లిమిట్ పెంచిన బంక్లు..
- Shruti Haasan: ఆ దర్శనం తర్వాత నా జీవితమే మారిపోయింది..
- AshuReddy Audio Leaks : అషు రెడ్డి ఆడియో కాల్స్ లీక్.. నా మాట వినకుంటే అంతే సంగతులని వార్నింగ్
గతంలో మాదిరిగానే ప్రజలకు అన్ని సంక్షేమ పథకాలు, రాయితీలు, పింఛన్లు తదితర సేవలన్నీ నిరాంతరాయంగా కొనసాగుతాయని ప్రభుత్వం స్పష్టంచేసింది. ప్రజా సంక్షేమ పథకాలకు బడ్జెట్ కేటాయింపులతో ప్రజాధనాన్ని ఖర్చు చేస్తున్నామని.. ఈ డబ్బు ఒక వ్యక్తి లేదా రాజకీయ పార్టీల సొంత ఆస్తులు కాదని వెల్లడించింది. అందువల్ల ముఖ్యమంత్రి అరెస్టు లేదా రిమాండ్తో ప్రజా సంక్షేమ కార్యక్రమాలపై ఎలాంటి ప్రభావం ఉండబోదని పేర్కొంది. కొన్ని స్వార్థపూరిత శక్తులు చేసే ఇలాంటి తప్పుదారి పట్టించే సమాచారాన్ని నమ్మొద్దని ఈ సందర్భంగా ప్రజలకు సర్కార్ విజ్ఞప్తి చేసింది.
ఇది కూడా చదవండి: DK Shivakumar: దేశ చరిత్రలోనే అతిపెద్ద త్యాగం సోనియాగాంధీ చేశారు.. కాంగ్రెస్తోనే దేశం ఐక్యంగా ఉంటుంది..
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఈనెల 21న ఈడీ అధికారులు కేజ్రీవాల్ను అరెస్ట్ చేశారు. అనంతరం న్యాయస్థానం మార్చి 28 వరకు ఈడీ కస్టడీకి అనుమతి ఇచ్చింది. ఇక జైలు నుంచే కేజ్రీవాల్ పరిపాలన సాగిస్తున్నారు. ఇప్పటికే ఆయన రెండు ఆదేశాలు జారీ చేశారు. ఇక అరెస్ట్, ఈడీ కస్టడీపై హైకోర్టులో కేజ్రీవాల్ పిటిషన్ వేశారు. దీనిపై విచారణ బుధవారం జరగనుంది. మరీ ఊరట లభిస్తుందా? లేదంటే జైల్లో ఉండాల్సి వస్తుందా? అనేది మరికొన్ని గంటల్లో తేలనుంది.
ఇది కూడా చదవండి: Manjummel Boys: మలయాళ ఇండస్ట్రీ హిట్, తెలుగు రిలీజ్ డేట్ వచ్చేసింది.. ఎప్పుడంటే?
తాజావార్తలు
-
Gujarat Election Results: గుజరాత్ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. అన్ని కార్పొరేషన్లు కైవసం
-
AP Fuel Crisis: తగ్గిన పెట్రోల్ డీజిల్ కొరత ప్రభావం.. లిమిట్ పెంచిన బంక్లు..
-
Shruti Haasan: ఆ దర్శనం తర్వాత నా జీవితమే మారిపోయింది..
-
AshuReddy Audio Leaks : అషు రెడ్డి ఆడియో కాల్స్ లీక్.. నా మాట వినకుంటే అంతే సంగతులని వార్నింగ్
-
China Floods: చైనాను ముంచెత్తిన భారీ వరదలు.. కొట్టుకుపోయిన కార్లు
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!