NTV Telugu Site icon

CM Relief Fund: వరద బాధితుల కోసం విరాళాల వెల్లువ..

Donation

Donation

వరద బాధితులకు చేయూతనిచ్చేందుకు సహృదయ నేస్తాలు స్పందిస్తున్నాయి. ముఖ్యమంత్రి సహాయ నిధికి దాతలు విరాళాలు అందిస్తున్నారు. సీఎం చంద్రబాబు నాయుడుని సచివాలయంలో సోమవారం కలిసి పలువురు చెక్కులు అందించారు. విరాళాలు అందజేసిన వారిలో….

• రేమండ్ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ సింఘానియా రూ.2 కోట్లు.
• బ్యాంక్ ఆఫ్ బరోడా జోనల్ హెడ్ జనరల్ మేనేజర్ రితేష్ కుమార్, జోనల్ డిప్యూటీ మేనేజర్ సుధాకర్ రూ.1 కోటి.
• గంగవరపు విజయ్ భాస్కర్ ఆధ్వర్యంలో ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ రూ.65 లక్షలు
• రాష్ట్రీయ సేవా సమితి తరపున జనరల్ సెక్రటరీ వెంకటరత్నం, జాయింట్ సెక్రటరీ డాక్టర్ మమత, ప్రాజెక్ట్ డైరెక్టర్ నాగరాజు, సాయిబాబా రూ.50 లక్షలు
• మద్దిపట్ల కృష్ణా, ఎన్ఆర్ఐ రూ.10 లక్షలు.
• థామస్య రూ.1 లక్షా 75 వేలు.
• కొర్రపాటి సురేంద్ర రూ.1 లక్షా 50 వేలు.
• తులసీ కృష్ణమూర్తి రూ.1 లక్షా 18 వేలు
• కె.రమేష్ రూ.1 లక్షా 116
• కె.నారాయణ రూ.1 లక్ష
• ఎస్ఎల్ఎన్ శాస్త్రి రూ.70 వేలు
• కోలా మన్మధరావు రూ.50 వేలు
• విజయవాడ పడమటలోని విశ్వవాణి ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్ధులు రూ.50 వేలు
• నరేంద్ర రూ.50 వేలు
• రాజశేఖర్ రూ.50 వేలు
• కోనేరు వెంకటరామ్ రూ.25 వేలు అందించారు. వీరిని సీఎం చంద్రబాబు అభినందించి, కృతజ్ఞతలు తెలిపారు.