Dinner: రాత్రి త్వరగా భోజనం చేస్తే కలిగే ప్రయోజనాలేంటో తెలుసా?
రాత్రి త్వరగా తినాలని ఎప్పటికప్పుడు పెద్దలు చెబుతూనే ఉంటారు. కాని మన పరిస్థితులు, పని చేసే కార్యాలయాల్లోని టైమింగ్స్ కారణంగా రాత్రి లేట్ గా భోజనం చేస్తుంటాం. వీలైనంత వరకు రాత్రి 7 గంటలలోపే తింటే ఆరోగ్యానికి మేలు కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు. ఫిట్నెస్ను కాపాడుకునే చాలా మంది వ్యక్తులు రాత్రి 7 గంటలలోపు రాత్రి భోజనం చేయడం అలవాటు చేసుకుంటారు. ఆ సమయంలో భోజనం చేయడం వల్ల శరీరం పూర్తిగా మారిపోతుంది. ప్రపంచవ్యాప్తంగా పోషకాహార నిపుణులు అర్ధరాత్రి తినడాన్ని తప్పుబడుతుంటారు. వీలైనంత త్వరగా భోజనం చేయడం అలవాటు చేసుకోవాలని సూచిస్తారు. భోజనం సమయం మీ బరువు నియంత్రణ, జీవక్రియ నియంత్రణ, హృదయ స్పందన రేటు, నిద్ర చక్రంపై కూడా ప్రభావం చూపుతుంది. బరువు తగ్గడం, మంచి జీర్ణక్రియ, గుండె ఆరోగ్యం కోసం ఆరోగ్య నిపుణులు రాత్రిపూట ముందుగానే తినడం మంచిదని సిఫార్సు చేస్తారు.
READ MORE: Zomato: మధ్యాహ్నం సమయంలో ఆడర్లు తగ్గించండి.. జొమాటో విజ్ఞప్తి
Also Read
- Off The Record : కాంగ్రెస్ పెద్దలకు తలనొప్పిగా ఆర్మూర్ వ్యవహారాలు
- Rose Lassi Recipe: ఎప్పుడైనా రోజ్ లస్సీని రుచి చూశారా..? ఇలా సింపుల్గా తయారు చేయండి.. వన్ మోర్ అనాల్సిందే..
- India New Gaming Rules 2026: సర్కార్ సరి కొత్త గేమింగ్ రూల్స్.. ప్రయోజనకరమా లేక హానికరమా..?
- Sanju Samson: సంజూ శాంసన్ వీర విహారం.. దెబ్బకు ఆ రికార్ట్స్ అన్నీ బ్రేక్..
రాత్రి లేట్ గా భోజనం చేస్తే.. తిన్నవన్నీ జీర్ణించుకోవడానికి మీ జీర్ణవ్యవస్థకు తగినంత సమయం ఉండదు. ఇది అజీర్ణం లేదా గుండెల్లో మంటను కలిగిస్తుంది. భోజనం, నిద్ర మధ్య మంచి మొత్తంలో గ్యాప్ ఉండాలి. రాత్రిపూట ఆలస్యంగా తింటే జీర్ణక్రియ సరిగా జరగక నిద్ర సరిగా పట్టదు. మీరు త్వరగా తింటే ఆహారం మీ శరీరానికి బాగా శోషించబడుతుంది. బాగా నిద్రపోగలుగుతారు. మంచి రాత్రి నిద్ర మరుసటి రోజు కూడా మీలో శక్తిని నింపుతుంది. త్వరగా రాత్రి భోజనం చేయడం వల్ల మీ జీర్ణవ్యవస్థ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఇది మీ శరీరం ఆహారాన్ని బాగా జీర్ణం చేయడానికి సహాయపడుతుంది. రాత్రిపూట త్వరగా తినడం వల్ల గ్యాస్, ఎసిడిటీ లేదా గుండెల్లో మంట వంటి అన్ని సమస్యలను నివారించవచ్చు. బరువు తగ్గాలనుకునే వారు తమ భోజన సమయాలను ఎల్లప్పుడూ గమనించాలి. రాత్రి భోజనం త్వరగా తినడం వల్ల కలిగే అతిపెద్ద ప్రయోజనాల్లో ఒకటి బరువు తగ్గడంలో సహాయపడుతుంది. నిద్రపోతున్నప్పుడు శరీర కొవ్వును శక్తి కోసం ఉపయోగిస్తారు. తద్వారా కొవ్వును కోల్పోతారు. రాత్రిపూట ఆలస్యంగా తింటే ఆహారం సరిగ్గా జీర్ణం కాకపోవచ్చు. మొత్తం బరువు పెరగవచ్చు. నిద్రవేళకు, రాత్రి భోజనానికి మధ్య రెండు గంటల గ్యాప్ ఉండాలి. అర్ధరాత్రి భోజనం చేసేవారు హైపర్టెన్షన్ తో బాధపడే అవకాశం ఉంది. ఈ పరిస్థితిలో రాత్రి సమయంలో రక్తపోటు సరిగ్గా తగ్గదు. ఒత్తిడి పెరిగితే, గుండె జబ్బులు, స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచుతుంది.
తాజావార్తలు
-
Off The Record : కాంగ్రెస్ పెద్దలకు తలనొప్పిగా ఆర్మూర్ వ్యవహారాలు
-
Rose Lassi Recipe: ఎప్పుడైనా రోజ్ లస్సీని రుచి చూశారా..? ఇలా సింపుల్గా తయారు చేయండి.. వన్ మోర్ అనాల్సిందే..
-
Telangana Cabinet: రాష్ట్ర కేబినెట్లో కీలక నిర్ణయాలు.. అక్కడ అతి పెద్ద స్టేడియం నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
-
India New Gaming Rules 2026: సర్కార్ సరి కొత్త గేమింగ్ రూల్స్.. ప్రయోజనకరమా లేక హానికరమా..?
-
Sanju Samson: సంజూ శాంసన్ వీర విహారం.. దెబ్బకు ఆ రికార్ట్స్ అన్నీ బ్రేక్..
ట్రెండింగ్
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!
-
Lava Bold N1 5G కొత్త వేరియంట్ లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
Moong Dal Pakoda Recipe: శనగపిండి వాడకుండా ఆరోగ్యకరంగా, రుచిగా ఉండే ‘పెసరపప్పు పకోడీ’లను చేసేయండి ఇలా..!
-
మిడ్-రేంజ్లో ఫ్లాగ్షిప్ ఫీచర్లు.. 200MP కెమెరా, 5-స్టార్ డ్రాప్ & క్రష్ సర్టిఫికేషన్, 7000mAh బ్యాటరీతో HONOR 600 సిరీస్ లాంచ్..!
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!