రెబెల్ స్టార్ కృష్ణం రాజు నట వారసుడిగా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టి,తన సొంత టాలెంట్ తో సినిమాలు చేస్తూ యూత్ మరియు మాస్ ప్రేక్షకులలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్నారు హీరో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్
అలా ప్రభాస్ వరుస సినిమాలు చేస్తూ బాహుబలి సినిమా తో పాన్ ఇండియా స్టార్ గా మారాడు ప్రభాస్. బాహుబలి సినిమా తర్వాత ఇండియా లో ప్రభాస్ రేంజ్ పెరిగింది. కానీ ఆ చిత్రం తర్వాత ఆయన నుండి రెండు సినిమాలు విడుదలైతే రెండు కూడా ఫ్లాప్ అయ్యాయి, కానీ కలెక్షన్స్ అయితే తెలుగు హీరో స్థాయి హీరో సినిమా కంటే ఎక్కువే వచ్చాయి.
నేడు ప్రభాస్ హీరో గా నటించిన ‘ఆదిపురుష్’మూవీ గ్రాండ్ గా విడుదలై పాజిటివ్ రెస్పాన్స్ ని అందుకుంది.. ప్రభాస్ మొదటి సినిమా ‘ఈశ్వర్’ గురించి పలు ఆసక్తికరమైన పలు విషయాలను తెలుసుకుందాం.ఈ సినిమాని ప్రముఖ దర్శకుడు ‘జయంత్ సి పరాన్జీ’ తెరకెక్కించిన విషయం తెలిసిందే. ప్రముఖ నిర్మాత అశోక్ రాజు ఈ సినిమాలో విలన్ గా నటిస్తూ నే సినిమాను నిర్మించాడు కూడా. అప్పట్లో ఈ చిత్రానికి పాజిటివ్ రెస్పాన్స్ కూడా వచ్చింది, ప్రభాస్ నటనను అందరూ మెచ్చుకున్నారు.. అప్పట్లో ఈ చిత్రాన్ని రెండు కోట్ల రూపాయిల బడ్జెట్ లోపే తెరకెక్కించారని సమాచారం.విడుదల తర్వాత ఈ సినిమాకి పాజిటివ్ రెస్పాన్స్ రావడం తో ఫుల్ రన్ లో నాలుగు కోట రూపాయిల షేర్ వసూళ్లు చేసినట్లు సమాచారం.. మొదటి సినిమానే సూపర్ హిట్ అవ్వడం తో ప్రభాస్ కి యూత్ లో అప్పటి నుండే క్రేజ్ పెరగింది.ప్రభాస్ మొదటి సినిమాగా స్టూడెంట్ నెంబర్ 1 చిత్రం చెయ్యాల్సి ఉంది, కానీ అప్పటికే ఆ కథ జూనియర్ ఎన్టీఆర్ తో ఫిక్స్ అయిందని చెప్పడం తో ప్రభాస్ ‘ఈశ్వర్’ సినిమాతో లాంచ్ అయ్యాడని ప్రముఖ నిర్మాత అశ్వినీ దత్ ఒక ఇంటర్వ్యూ లో తెలిపారు.. ఈ రెండు సినిమాలు కూడా సూపర్ హిట్ గా నిలిచాయి. రెండు సినిమాల్లోని పాటలు కూడా హిట్ అయ్యాయి.అలా ప్రభాస్ మొదటి సినిమా ఈశ్వర్ నాలుగు కోట్ల రూపాయిలు రేంజ్ లో వసూలు చేస్తే, ఇప్పుడు ప్రభాస్ రేంజ్ ఏ స్థాయికి వెళ్లిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.. ఇప్పటి ప్రభాస్ సినిమా కు వేల కోట్ల రూపాయిలు బిజినెస్ జరుగుతుంది