Diwali Good Luck Tips: దీపావళి రోజు ఉదయం ఈ పని చేస్తే.. మీ ఇంట్లో డబ్బు వర్షం పక్కా!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Do These Remedies on Diwali Morning for Immense Money: దేశవ్యాప్తంగా ప్రజలు దీపావళి పండుగను నవంబర్ 12న జరుపుకోనున్నారు. హిందూ మతంలో అతిపెద్ద పండుగగా దీపావళి పరిగణించబడుతుంది. 14 సంవత్సరాల అజ్ఞాతవాసం తర్వాత శ్రీరాముడు అయోధ్యకు తిరిగి వచ్చిన సందర్భంగా ప్రజలు ఈ పండగను జరుపుకుంటారు. ఈ రోజున ప్రజలు తమ ఇళ్లలో దీపాలను వెలిగించి సంబరాలు చేసుకుంటారు. దీపావళి రోజున లక్ష్మీదేవిని పూజించే సంప్రదాయం కూడా ఉంది. లక్ష్మీదేవిని పూజించడం వల్ల ఇంట్లో సుఖ-సంతోషాలు, శాంతి-సౌభాగ్యాలు ఉంటాయని నమ్మకం.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. దీపావళి రోజున కొన్ని పనులు చేయడం వల్ల లక్ష్మీదేవి ప్రత్యేక అనుగ్రహం లభిస్తుంది. లక్ష్మీదేవి ఆశీస్సులు ఉంటే.. ఆ ఇంట్లో ఎలాంటి లోటు ఉండదు. మంచి ఆరోగ్యం, డబ్బుకు కొదవ ఉండదు. కాబట్టి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందడానికి దీపావళి రోజు ఉదయం చేయాల్సిన పనులు ఏమిటో తెలుసుకుందాం.
Also Read
- Abhishek Sharma: కాటేరమ్మ కొడుకా మజాకా.. బంతి వేయడమే ఆలస్యం కొట్టుడే కొట్టుడు.. చరిత్ర స్పష్టించిన అభిషేక్..
- Bangladesh: ‘‘ప్రతీసారి భారత్ గురించి ఆలోచించం, హసీనా మాదిరి ఉండదు’’.. బంగ్లాదేశ్ పొగరు మాటలు..
- IND Vs SL: మహిళల ఆసియా కప్ ఫైనల్.. శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడిన షఫాలీ వర్మ, స్మృతి మంధాన..
- IAF Report: ఆపరేషన్ సిందూర్పై IAF సంచలన రిపోర్ట్.. పాక్ F-16లు, రాడార్లు ధ్వంసం..
దీపావళి రోజు ఉదయం ఈ పని చేయండి:
# దీపావళి రోజున ఉదయం నిద్రలేచిన వెంటనే ఇంటిని శుభ్రం చేసి అలంకరించండి. దీని వల్ల లక్ష్మీదేవి ఇంట్లో శాశ్వతంగా ఉంటుంది. దాంతో ఐశ్వర్యానికి లోటు ఉండదు. దీపావళి నాడు తులసి మొక్కను పూజించడం కూడా శుభప్రదంగా భావిస్తారు. తులసి మొక్కలో లక్ష్మీదేవి ఉంటుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. దీపావళి రోజున తులసిని పూజించడం మరియు నీటిని సమర్పించడం ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. దీపావళి నాడు తులసి మొక్క ముందు నెయ్యి దీపం వెలిగించడం శ్రేయస్కరం.
Also Read: Rohit Sharma: నెదర్లాండ్స్తో మ్యాచ్.. రోహిత్ శర్మ ముందు మూడు రికార్డులు!
# దీపావళి రోజున ఉదయం నిద్రలేచిన వెంటనే స్నానం చేసి.. ఓ పాత్రలో నీరు తీసుకోండి. తులసి మొక్కకు సగం నీరు సమర్పించి.. మిగిలిన నీటిని ఇంటి అంతటా చల్లండి. ఇలా చేయడం వల్ల ఇంట్లో సంతోషం, శాంతి నెలకొంటుంది.
# దీపావళి రోజున ఇంటిని శుభ్రం చేసిన తర్వాత ఇంటి ప్రాంగణంలో రంగోలి (ముగ్గు) వేయడం శుభప్రదం. దీనితో లక్ష్మీదేవి త్వరగా ప్రసన్నమవుతుంది. ఇలా చేసిన ఇంట్లో లక్ష్మీదేవి అనుగ్రహం వలన డబ్బుకు లోటు ఉండదు.
(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ntvtelugu.com దీన్ని ధృవీకరించలేదు.)
- Tags
తాజావార్తలు
-
Abhishek Sharma: కాటేరమ్మ కొడుకా మజాకా.. బంతి వేయడమే ఆలస్యం కొట్టుడే కొట్టుడు.. చరిత్ర స్పష్టించిన అభిషేక్..
-
Bangladesh: ‘‘ప్రతీసారి భారత్ గురించి ఆలోచించం, హసీనా మాదిరి ఉండదు’’.. బంగ్లాదేశ్ పొగరు మాటలు..
-
IND Vs SL: మహిళల ఆసియా కప్ ఫైనల్.. శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడిన షఫాలీ వర్మ, స్మృతి మంధాన..
-
IAF Report: ఆపరేషన్ సిందూర్పై IAF సంచలన రిపోర్ట్.. పాక్ F-16లు, రాడార్లు ధ్వంసం..
-
Prithviraj Sukumaran: ‘వారణాసి’ చేస్తూనే 9 సినిమాలు.. మాలీవుడ్ స్టార్ స్పీడ్ చూసి జక్కన్న షాక్!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!