Deepavali : 24నే దీపావళి జరుపుకోవాలి.. ఎందుకంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దీపావళి… ఆనందాల కేళి.. దీపావళి పేరు చెబితే పిల్లలు ఎగిరి గంతేస్తారు… అయితే, ఈసారి దీపావళి ఎప్పుడు జరుపుకోవాలనే సందిగ్ధత కొనసాగుతోంది. హిందువులు జరుపుకునే పెద్ద పండుగల్లో దీపావళి ఒకటి. దీపావళి అనగానే ప్రతి ఇంట వెలుగులు విరజిమ్ముతాయి. ఈ పండగ కోసం ప్రతి ఒక్కరూ ఏడాది పొడవునా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తారు. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా దీపావళి పండుగ జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది.
తిథి, నక్షత్రం ప్రకారం ఈ నెల 24న సోమవారం నాడు దీపావళి జరుపుకోవాలని చెబుతుంటే.. మరికొందరు 25వ తేదీ జరుపుకోవాలంటున్నారు. అమావాస్య రాత్రి తిథి ఉన్నందున అప్పుడే దీపావళి జరుపుకోవాలని మరికొందరు పండితులు చెబుతున్నారు. అక్టోబర్ 24వ తేదీనే చతుర్దశి తిథి సాయంత్రం 5 గంటలలోపు ఉందని, ఆ తర్వాత అమావాస్య ప్రారంభమవుతుంది. అక్టోబర్ 25న మంగళవారం సాయంత్రం దాదాపు 4:20 గంటలకు అమావాస్య తిథి పూర్తవుతుంది. ఆ తర్వాత పాడ్యమి ప్రారంభమవుతుంది. దీపావళి పండుగకు ముందే చాలామంది ధనత్రయోదశి జరుపుకుంటారు. ఆ రోజున బంగారం కొనాలని అంటారు.
Also Read
- Khawaja Asif: పశ్చిమాసియాలో యుద్ధం మళ్లీ మొదలవ్వడంపై పాక్ రక్షణ మంత్రి కీలక వ్యాఖ్యలు
- Elephant: కర్ణాటకలో పర్యాటకురాలు మృతికి కారణమైన ఏనుగు మృతి.. ఏం జరిగిందంటే..
- కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
- TDP Mahanadu 2026: మహానాడులో 20 కీలక తీర్మానాలు.. తెలంగాణ నుంచి 4 ప్రత్యేక ప్రతిపాదనలు!
Read Also:Forex : ఆర్థిక నిల్వలకు ఇబ్బందిలేదు.. సమృద్ధిగా ఉన్నాయి
ఈసారి దీపావళికి ముందు రోజున 23వ తేదీన ధన త్రయోదశి ప్రారంభమవుతుంది. దీపావళి పర్వదినాన్ని ఈ నెల 24వ తేదీన జరుపుకోవాలని టీటీడీ ఆగమ సలహాదారు, జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం ఆగమ విభాగం ఆచార్యులు శ్రీవిష్ణుభట్టాచార్యులు తెలిపారు. సోమవారం సూర్యాస్తమయానికి గంటముందుగా అమావాస్య ఘడియలు ప్రారంభమవుతుండడంతో అదే రోజున దీపావళి జరుపుకోవాలని ఆయన సూచించారు.
దీపావళి రోజున మీ ఇంట్లో దీపాలు వెలిగిస్తే ఎంతో శుభం జరుగుతుంది. మీ ఇల్లును, మీ ఆఫీసును శుభ్రం చేయాలి. దీంతో ప్రతికూల శక్తి తొలగిపోయి సానుకూలశక్తి వస్తుంది. దీపావళి నాడు ఇంట్లో ముఖ్యంగా వంటగది, స్టోర్ రూంను క్లీన్ చేయడం చాలామంది చేయరు. వాటిని శుభ్రంగా వుంచుకోవడం వల్ల లక్ష్మీదేవి కొలువై వుంటుందని పండితులు చెబుతున్నారు.
దీపావళి ముందు రోజే మీ ఇంట్లో పగిలిన వస్తువులు, ఫోటోలు, చినిగిన పుస్తకాలు, పనికిరాని బొమ్మలు వుంటే బయటపడేయాలి. ఇంటి ఉత్తర దిక్కుకు కుబేరుడు అధిపతి. కాబట్టి ఉత్తర, ఈశాన్య దిశలను అందంగా ఆకర్షణీయంగా తీర్చిదిద్దుకోండి. ఉత్తరంలో వాస్తు దోషం ఉంటే మీరు ఎంత కష్టపడ్డా మీకు వచ్చే ఆదాయం నిలవదు. దీపావళి రోజున మీ ఇంటిని లైట్లు, పువ్వులు, రంగోలి, కొవ్వొత్తులతో డెకరేట్ చేయాలి. ఇంట్లో దీపాలు వెలుగుతుంటే.. ఆ ఇంటికి లక్ష్మీదేవి వస్తుందని, ఆమె అనుగ్రహం కలుగుతుందని పండితులు చెబుతున్నారు. సాధ్యమయినంత కాలుష్యం తక్కువగా వుండే క్రాకర్స్ కాలిస్తే మంచిది.
Read Also: Bhakthi tv Live Stothra parayanam live: గురువారం నాడు ఈ స్తోత్రపారాయణం చేస్తే..
తాజావార్తలు
-
Khawaja Asif: పశ్చిమాసియాలో యుద్ధం మళ్లీ మొదలవ్వడంపై పాక్ రక్షణ మంత్రి కీలక వ్యాఖ్యలు
-
Elephant: కర్ణాటకలో పర్యాటకురాలు మృతికి కారణమైన ఏనుగు మృతి.. ఏం జరిగిందంటే..
-
Prices Hike: పాలు, ఫుడ్డు, సబ్బులు.. ఏదీ కొనేటట్టు లేదు బాబోయ్..పరిస్థితి ఇలాగే కొనసాగితే బతుకు బస్టాండే..!
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
Pawan Kalyan: మళ్ళీ స్టైలిష్ లుక్’లోకి పవన్ కళ్యాణ్
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!