SSMB 29: రాజమౌళి టార్గెట్ రూ.వెయ్యి కోట్లు కాదు.. ఏకంగా ఎన్ని వేల కోట్లంటే ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
SSMB 29: ఎస్ ఎస్ రాజమౌళి ప్రస్తుతం ఈ పేరు తెలియని వారుండరు. సినిమాల చిత్రీకరణలో ఆయన రేంజే వేరు. ఆయన సినిమా అంటే చాలు.. ప్రతి చిన్న విషయంలో పెర్ఫెక్షనిజం కచ్చితంగా కనిపిస్తుంది. ఫస్ట్ పోస్టర్ నుంచి లాస్ట్ సినిమా ఎండ్ కార్డ్ పడే వరకు రాజమౌళి మార్క్ క్లియర్ గా కనిపిస్తుంది. అంతటి హార్డ్ వర్క్ చేస్తున్నారు కాబట్టి.. ఎన్నో అవార్డులు, రివార్డులు, ఘనతలు అందుకున్నారు. బాహుబలి సిరీస్ చిత్రాలతోపాటు ఆర్ఆర్ఆర్ సినిమాతో తెలుగు సినిమాను ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేశారు. తెలుగు సినిమాకు ఆస్కార్ అవార్డు తీసుకొచ్చారు. ప్రపంచ వ్యాప్తంగా స్పెషల్ ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్నారు. దీంతో తన అప్ కమింగ్ మూవీ SSMB 29 పై అనౌన్స్మెంట్ నుంచే భారీ అంచనాలను క్రియేట్ చేశారు.
Read Also:Warangal: ఆర్టీఓకు కలెక్టర్ షోకాజ్ నోటీస్
Also Read
- Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
- Saudi-Europe: యూరప్కు సౌదీ బిగ్ షాక్.. చమురు నిలిపిపోయే అవకాశం
- Macron: యూరప్లో ఇంధన ధరలు మంటలు.. త్వరలో G7 దేశాల సమావేశం
- Air India: ఖర్చులు తగ్గించేందుకు కీలక నిర్ణయం.. ఎయిరిండియా కొత్త సీఈవో సూపర్ ప్లాన్!
సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న ఆ సినిమా.. ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ తో సాగే అడ్వెంచర్ జర్నీగా తెరకెక్కిస్తున్నట్లు ఇప్పటికే క్లారిటీ ఇచ్చేశారు. రీసెంట్ గా హైదరాబాద్ లో పూజా కార్యక్రమం ఎలాంటి హడావుడి లేకుండా జరిగింది. ఈ నెల చివర్లో రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. రెండు భాగాలుగా SSMB 29 రానుందని.. 2026లో ఫస్ట్ పార్ట్ రిలీజ్ కానుందని టాక్ వినిపిస్తోంది. భారీ బడ్జెట్ తో కేఎల్ నారాయణ నిర్మిస్తున్నట్లు సమాచారం. అయితే ఈ సినిమాతో రాజమౌళి మరోసారి రూ.1000 కోట్ల క్లబ్ టార్గెట్ ను పెట్టుకున్నట్లు తెలుస్తుంది. కానీ జక్కన్న లక్ష్యం అది కాదని అంటున్నారు.
Read Also:Sydney Test: భారత్ ఘోర ఓటమి.. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని సొంతం చేసుకున్న ఆసీస్
ఎందుకంటే రాజమౌళి.. ఇప్పటికే బాహుబలి-2, ఆర్ఆర్ఆర్ సినిమాలతో రూ.1000 కోట్ల క్లబ్ లోకి రెండు సార్లు ఎక్కారు. దక్షిణాది నుంచి అడుగుపెట్టిన తొలి డైరెక్టర్ గా ఘనత సాధించారు. దానికి తోడు రాజమౌళి తాను ఏం చేసినా.. అంతా ఒక్కసారిగా షేక్ అయ్యేలా చేయాలని చూస్తుంటారన్న సంగతి తెలిసిందే. దీంతో ఇప్పుడు రాజమౌళి SSMB 29 మూవీతో రూ.3వేల కోట్ల మార్క్ అందుకోవాలని టార్గెట్ ను పెట్టుకున్నారని వార్తలు వస్తున్నాయి. అలా జరగాలంటే పాన్ వరల్డ్ బెల్ట్ లో భారీ వసూళ్లను రాబట్టాలి. అందుకు తగ్గ ప్రమోషన్స్ నిర్వహించి.. ప్రపంచ దేశాలు తిరిగి అక్కడి ఆయా స్టేట్స్ ఆడియన్స్ ను మూవీకి కనెక్ట్ అయ్యేలా చేయాలి.
తాజావార్తలు
-
OTR: దానం నాగేందర్ పై వేటు..మిగతా 9 మంది ఎమ్మెల్యేల సంగతేంటి ..?
-
Botsa Anusha: భీమిలి YSRCP నియోజకవర్గ సమన్వయకర్తగా బొత్స అనూష
-
Old Currency: కాజీపేటలో పాత నోట్ల కలకలం.. రూ.1.38 కోట్ల కరెన్సీతో 8 మంది అరెస్ట్!
-
Bhatti Vikramarka : ఎల్నినో ఎఫెక్ట్.. తెలంగాణలో ముందస్తు ప్లాన్
-
Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్పై భారత్ ఘన విజయం.. సెమీస్కు దూసుకెళ్లిన హర్మన్సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..