బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ నటించిన మాస్ యాక్షన్ డ్రామా ‘ధురంధర్’ బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టిస్తోంది. దర్శకుడు ఆదిత్య ధర్ రూపొందించిన ఈ చిత్రం డిసెంబర్ 5న విడుదలై కేవలం మూడు రోజుల్లోనే ఏకంగా రూ.100 కోట్లు కలెక్ట్ చేసింది. ఇప్పటివరకు ఈ సినిమా రూ.300 కోట్లకు పైగా వసూళ్లను సాధించి, 2025లో బాలీవుడ్ టాప్ గ్రాసర్స్లో ఒకటిగా నిలిచేందుకు పరుగులు పెడుతోంది.
Also Read : Akhanda 2 : ‘అఖండ 2’ చూడనున్న ప్రధాని మోడీ..ఢిల్లీలో స్పెషల్ షో ఖరారు
ఈ హిందీ సెన్సేషన్ ఇప్పుడు తెలుగు ప్రేక్షకులను కూడా పలకరించడానికి సిద్ధమవుతోందని సినీ వర్గాల్లో గట్టి టాక్ వినిపిస్తోంది. టాలీవుడ్లో రణవీర్ సింగ్కు మంచి ఫాలోయింగ్ ఉండటంతో, ‘ధురంధర్ ‘ తెలుగు డబ్బింగ్ పనులు చకచకా జరుగుతున్నాయని సమాచారం. ఈ సినిమాను డిసెంబర్ 19న విడుదల చేస్తే బాగుంటుందని సోషల్ మీడియాలో సినీప్రియులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. మరోవైపు,
తెలుగు వెర్షన్ డిస్ట్రిబ్యూషన్ హక్కుల కోసం టాలీవుడ్లో తీవ్రమైన పోటీ నెలకొంది. ఈ హక్కులను ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తన గీతా ఆర్ట్స్ బ్యానర్పై తీసుకునే అవకాశం ఉందని ప్రచారం జోరుగా సాగుతోంది. గతంలో రణవీర్ సింగ్ నటించిన ‘ఛావా’ చిత్రాన్ని కూడా అల్లు అరవింద్ తెలుగులో విజయవంతంగా విడుదల చేశారు. ఆ అనుభవం దృష్ట్యా, భారీ వసూళ్లు సాధిస్తున్న ‘ధురంధర్ 2’ ను కూడా ఆయనే తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఒకవేళ ఈ సినిమా తెలుగులో విడుదలయితే, అది కూడా భారీ కలెక్షన్లు సాధించి జాక్పాట్గా నిలవడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.