Site icon NTV Telugu

Maoist: మావోయిస్టు పార్టీకి భారీ ఎదురుదెబ్బ.. అగ్రనేతల లొంగుబాటు..

Maoist

Maoist

నక్సలిజాన్ని రూపుమాపేందుకు కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ ను చేపట్టింది. ఈ ఆపరేషన్ ద్వారా ఇప్పటికే మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ హిడ్మాతో పాటు చాలా మందిని మట్టుబెట్టాయి భద్రతా బలగాలు. ఈ నేపథ్యంలో పలువురు మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలిసిపోతున్నారు. ఆపరేషన్ కగార్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. మావోయిస్టు పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. అగ్రనేతలు లొంగిపోయారు.

Also Read:RTC Bus-Lorry Collision: గజ్వేల్ లో రోడ్డు ప్రమాదం.. ఆర్టీసీ బస్సు-లారీ ఢీ.. డ్రైవర్ కి తీవ్ర గాయాలు

మావోయిస్టు పార్టీ టాప్ కమాండర్ దేవ్ అలియాస్ తిప్పిరి తిరుపతి సరెండర్ అయ్యారు. కేంద్ర కమిటీ సభ్యుడు రాజిరెడ్డి సహా 16మందితో కలిసి ఆయన తెలంగాణ SIB ముందు లొంగిపోయారు. మార్చి 31 నాటికి నక్సలిజాన్ని అంతం చేస్తామన్న కేంద్రం.. దేవ్, రాజిరెడ్డి టార్గెట్గా ఇటీవల ఆపరేషన్ కగార్-2 చేపట్టింది. ఈక్రమంలోనే వారిద్దరూ లొంగిపోయారు. 2 రోజుల్లో మీడియా ముందు ప్రవేశపెట్టనున్నట్లు అధికారులు తెలిపారు.

Exit mobile version