Pawan Kalyan: కూటమి ఆరు నెలల పాలనలో అభివృద్ధిపై డిప్యూటీ సీఎం ట్వీట్..
- కూటమి ఆరు నెలల పాలనలో అభివృద్ధి మైలురాళ్ళు- డిప్యూటీ సీఎం
- వైసీపీ ఐదేళ్ల పాలనకు మించి అభివృద్ధి చేశాం- పవన్ కల్యాణ్.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత అభివృద్ధి పరుగులు పెడుతోందన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. ఇప్పటికే రాజధాని అమరావతి నిర్మాణం, పోలవరం, పారిశ్రామిక వాడలు సహా అనేక ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపిందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు చొరవతో లక్షల కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్కు పెట్టుబడులుగా వస్తున్నాయని.. ఇటీవల విశాఖపట్నం వేదికగా రూ.2.08 లక్షల కోట్ల పనులకు ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారని ట్వీట్ చేశారు పవన్..
కూటమి ఆరు నెలల పాలనపై పవన్ కల్యాణ్ స్పందించారు. హనీమూన్ పీరియడ్ ముగిసిందని ఇప్పటికే పవన్ ప్రకటించారు. తాజాగా ఈ ఆరు నెలల కాలంలో జరిగిన కార్యక్రమాలకు సంబంధించి పవన్ కీలక అంశాలు ట్వీట్ చేసారు. అమరావతి నిర్మాణానికి సంబంధించిన వివిధ పనులకు సైతం చంద్రబాబు సర్కార్ టెండర్లు ఆహ్వానించిందన్నారు. ఇక పోలవరం ప్రాజెక్టు పనులు సైతం ఊపందుకున్నాయి. కాగా, గత ఐదేళ్లపాటు వైసీపీ హయాంలో ఏపీ అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉండిపోయిందన్న సంగతి అందరికీ తెలిసిందే అన్నారు పవన్.
Also Read
- IAS Transfers: తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు.. జిల్లాలకు కొత్త కలెక్టర్లు వచ్చేశారు..
- Donald Trump: పాకిస్తాన్ మధ్యవర్తిత్వం విఫలం.. ట్రంప్ సంచలన నిర్ణయం..
- Barrier Free Tolling: భారత్లో కొత్త రకం టోల్ విధానం.. వాహనాలు ఆపాల్సిన అవసరం లేకుండా...
- Off The Record : కాకినాడలో 'పేకాట' జోరు.. వెనుక ఉన్నది ఎమ్మెల్యేల అనుచరులేనా?
నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టిన ఆరు నెలల కాలంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అనేక మైలు రాళ్లను చేరుకుందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలిపారు. కేవలం ఆరు నెలల్లోనే అనేక అభివృద్ధి కార్యక్రమాలతో వైసీపీ ఐదేళ్ల పాలనకు మించి అభివృద్ధి చేసి చూపించినట్లు ఆయన చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా వైసీపీ ఐదేళ్ల పాలనతో పోలుస్తూ తాము చేసిన పనుల వివరాలను తెలుపుతూ పవన్ కల్యాణ్ సోషల్ మీడియా ఎక్స్లో ట్వీట్ చేశారు..
ఎన్డీయే కూటమి ప్రభుత్వంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, సీఎం నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో కొన్ని మైలురాళ్లు సాధించినట్లు పవన్ కల్యాణ్ తెలిపారు. ఏపీ పంచాయతీ రాజ్ శాఖ కింద వైసీపీ ఐదేళ్ల పాలనలో 1800 కి.మీ. మేర సీసీ రోడ్లు నిర్మిస్తే ఎన్డీయే అధికారం చేపట్టిన ఆరు నెలల్లోనే 3,750 కి.మీ. సీసీ రోడ్లు వేసినట్లు పవన్ కల్యాణ్ చెప్పారు. వైసీపీ ఐదేళ్ల పాలనలో మినీ గోకులాలు కేవలం 268 ఏర్పాటు చేస్తే, తాజాగా ఆరు నెలల్లోనే 22,500 నిర్మించినట్లు వెల్లడించారు. పీవీటీజీ ఆవాసాల కోసం వైసీపీ రూ.91 కోట్లు ఖర్చు చేస్తే, తాము కేవలం ఆరు నెలల్లోనే రూ.750 కోట్లు ఖర్చు చేసినట్లు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలిపారు
తాజావార్తలు
-
Aari Arjunan :‘GS’తో తెలుగులోకి బిగ్ బాస్ విన్నర్ ఆరి అర్జునన్!
-
IAS Transfers: తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు.. జిల్లాలకు కొత్త కలెక్టర్లు వచ్చేశారు..
-
Suhas: సుహాస్, సూరి ‘మండాడి’ షూటింగ్ పూర్తి!
-
Off The Record : నెల్లిమర్ల ఎమ్మెల్యే పీఏపై తీవ్ర ఆరోపణలు
-
TVS Raider 125 2026: కొత్త TVS రైడర్ 125 బైక్.. అదరహో అనిపించే ఫీచర్లతో.. లక్ష రూపాయల కన్నా తక్కువ ధరకే!
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!