Maneka Gandhi: వరుణ్గాంధీకి టికెట్ దక్కకపోవడంపై తల్లి ఏమన్నారంటే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సార్వత్రిక ఎన్నికల్లో కుమారుడు వరుణ్ గాంధీకి టికెట్ దక్కకపోవడంపై తొలిసారి తల్లి మేనకాగాంధీ స్పందించారు. వరుణ్పై తనకు విశ్వాసం ఉందని.. సమర్థవంతుడైన నాయకుడు అని కొనియాడారు. అయితే పార్టీ నిర్ణయాన్ని గౌరవిస్తామని తెలిపారు. ఉత్తరప్రదేశ్లోని పిలిభిత్ లోక్సభ స్థానానికి వరుణ్గాంధీ ప్రతినిధ్యం వహిస్తున్నారు. అయితే ఈసారి బీజేపీ టికెట్ నిరాకరించింది. మరొకరికి ఈ సీటును కేటాయించింది. దీంతో ఆయన నిరాశ చెందారు. స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగుతారని ప్రచారం జరిగింది. కానీ అలా జరగలేదు. తాజాగా తల్లి మేనకాగాంధీ స్పందిస్తూ.. పార్టీ నిర్ణయాన్ని గౌరవిస్తామని చెప్పారు.
ఇది కూడా చదవండి: TSRTC: ఇక టీ షర్టులు, జీన్స్ ప్యాంట్లకు బంద్.. ఆర్టీసీ ఉద్యోగులకు సజ్జనార్ ఆదేశాలు..
Also Read
- World Cup: కేవలం 30 సెకన్ల మీటింగ్.. వరల్డ్ కప్ కొట్టిన భారత్.. సంచలన రహస్యం చెప్పిన కెప్టెన్..
- High Protein Roti Recipe: గోధుమ పిండిలో ఈ 3 పదార్థాలు కలపండి.. హై ప్రోటీన్ రోటీ రెడీ..
- Ameerpet Fire Accident : అగ్ని సెగలతో మెట్రో పిల్లర్కు క్రాక్.. రంగంలోకి జేఎన్టీయూ నిపుణులు
- Forbes Billionaires List: 4 గదుల ఫ్లాట్ నుంచి 92.8 బిలియన్ డాలర్ల సామ్రాజ్యం వరకు..! అంబానీని దాటేసిన టిక్టాక్ సృష్టికర్త..
ఇక వరుణ్గాంధీ ముక్కుసూటి మనిషి అని.. తన అభిప్రాయాన్ని సూటిగా చెబుతూ ఉంటారని చెప్పుకొచ్చారు. బహుశా అదే అతనికి ఇబ్బందికరంగా మారి ఉంటుందని చెప్పుకొచ్చారు. అయినా ఎన్నికల్లో పోటీ చేయకపోయినా ప్రజల కోసం తన కుమారుడి ప్రయాణం కొనసాగుతుందని ఆమె చెప్పారు.
ఇది కూడా చదవండి: Cine Politics: పిఠాపురానికి అల్లు అరవింద్.. వైసీపీ ఫ్రెండ్ కోసం బన్నీ!
పిలిభిత్ లోక్సభ నియోజకవర్గం నుంచి రెండు సార్లు ఎంపీగా వరుణ్గాంధీ గెలిచారు. ఈసారి మాత్రం టికెట్ దక్కలేదు. ఇక మేనకాగాంధీ ఉత్తరప్రదేశ్లోని సుల్తాన్పూర్ నుంచి పోటీ చేస్తున్నారు. ఇప్పటికే ఆమె ఎనిమిది సార్లు ఎంపీగా గెలిచారు. మరోసారి టికెట్ దక్కడంపై ఆమె సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఇటీవల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై వరుణ్గాంధీ విమర్శలు చేశారు. అంతేకాదు.. కొద్ది నెలల క్రితం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని కూడా కలిశారు. దీంతో ఆయన పార్టీ మారే అవకాశం ఉందని వార్తలు వచ్చాయి. కానీ అలాంటిదేమీ జరగలేదు. ప్రస్తుతం ఆయన ఎక్కడ నుంచి నామినేషన్ దాఖలు చేయలేదు.
ఇది కూడా చదవండి: CM Jagan: వంగా గీత, భరత్కు బంపర్ ఆఫర్.. వైసీపీ అధికారంలోకి రాగానే మంత్రి పదవులు
తాజావార్తలు
-
World Cup: కేవలం 30 సెకన్ల మీటింగ్.. వరల్డ్ కప్ కొట్టిన భారత్.. సంచలన రహస్యం చెప్పిన కెప్టెన్..
-
High Protein Roti Recipe: గోధుమ పిండిలో ఈ 3 పదార్థాలు కలపండి.. హై ప్రోటీన్ రోటీ రెడీ..
-
Ameerpet Fire Accident : అగ్ని సెగలతో మెట్రో పిల్లర్కు క్రాక్.. రంగంలోకి జేఎన్టీయూ నిపుణులు
-
Forbes Billionaires List: 4 గదుల ఫ్లాట్ నుంచి 92.8 బిలియన్ డాలర్ల సామ్రాజ్యం వరకు..! అంబానీని దాటేసిన టిక్టాక్ సృష్టికర్త..
-
DK.Shivakumar: డీకే.శివకుమార్ కేబినెట్పై విమర్శలు.. మహిళలకు చోటు లేకపోవడంపై నిలదీత
ట్రెండింగ్
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!
-
రూ.11,999కే Lava Bold N2 5G స్మార్ట్ఫోన్ లాంచ్.. 6000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో పాటు.!