Delhi Weather: ఢిల్లీలో భగ్గుమంటున్న సూరీడు.. వాతావరణ శాఖ ఏం చెప్పిందంటే ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Delhi Weather: దేశ రాజధాని ఢిల్లీలో ప్రస్తుతం సూరీడు సుర్రుమంటున్నాడు. ఎండ వేడిమి, తేమకు జనాలు అల్లాడిపోతున్నారు. భారత వాతావరణ విభాగం (IMD) వర్షాలకు సంబంధించి తాజాగా ఓ అప్ డేట్ అందించింది. ఢిల్లీ-NCR ప్రజలకు వేడి నుండి ఎంతకాలం ఉపశమనం లభిస్తుందో చెప్పింది. IMD ప్రకారం.. బుధవారం ఢిల్లీలో కనిష్ట ఉష్ణోగ్రత 27.9 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. ఇది సగటు కంటే ఒక నాచ్ తక్కువ.
ప్రజలకు ఉపశమనం ఎప్పుడు?
ఈరోజు (ఆగస్టు 2) ఆకాశం సాధారణంగా మేఘావృతమై ఉంటుందని.. రాత్రి చాలా తేలికపాటి వర్షం కురుస్తుందని భారత వాతావరణ శాఖ (IMD) అంచనా వేసింది. వర్షం తర్వాత, ప్రజలు వేడి, తేమ నుండి కొంత ఉపశమనం పొందవచ్చు. ఢిల్లీ, పరిసర ప్రాంతాల్లో ఈరోజు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని IMD తెలిపింది.
Also Read
- Mohali Love Murder: కిరాతకుడిగా మారిన సహోద్యోగి.. ఆఫీస్లోనే యువతి హత్య
- Indiramma House: మోడ్రన్ టెక్నాలజీ వచ్చేసింది.. 12 రోజుల్లోనే ఇందిరమ్మ ఇంటి నిర్మాణం..
- Putin: విదేశాల ఒత్తిడికి భారత్ ఎన్నడూ లొంగలేదు.. ట్రంప్కు పుతిన్ స్ట్రాంగ్ మెసేజ్..
- India-China: భారత్ జీడీపీ చైనాను మించిపోనుందా? అంతర్జాతీయ సంస్థ అంచనాలు ఇవే!
Read Also:Australia: కామాంధుడు.. 91 మంది బాలికలపై అత్యాచారం..1600లైగింక వేధింపుల కేసులు
గరిష్ఠ ఉష్ణోగ్రత 37 డిగ్రీలు
వాతావరణ శాఖ (IMD) ప్రకారం ఈ రోజు ఢిల్లీలో గరిష్ట ఉష్ణోగ్రత 37 డిగ్రీల సెల్సియస్గా నమోదయ్యే అవకాశం ఉంది. అదే సమయంలో సోమవారం గరిష్టంగా 36 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మంగళవారం ఉదయం దేశ రాజధానిలో కనిష్ట ఉష్ణోగ్రత 26.6 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. ఇది సాధారణం కంటే తక్కువ. ఢిల్లీలో సోమవారం కనిష్ట ఉష్ణోగ్రత 27.2 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. ఇది ఈ సీజన్లో సాధారణం. ఢిల్లీలో సాపేక్ష ఆర్ద్రత బుధవారం ఉదయం 8.30 గంటలకు 78 శాతంగా నమోదైంది.
వర్షంతో గాలి క్లియర్
గత వారం దేశ రాజధాని ఢిల్లీలో కురిసిన వర్షాల తరువాత, గాలి క్లియర్ అయింది. అనేక ప్రాంతాల్లో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) గణనీయంగా పడిపోయింది. బుధవారం ఢిల్లీలో సగటు AQI 84గా నమోదైంది. నోయిడాలో సగటు AQI 65, ఘజియాబాద్లో సగటు AQI 95, గురుగ్రామ్లో సగటు AQI, ఫరీదాబాద్లో సగటు AQI 66 నమోదయ్యాయి.
Read Also:Kushi : సినిమా గురించి ఆసక్తికర పోస్ట్ చేసిన విజయ్ దేవరకొండ..
భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం
భారత వాతావరణ విభాగం (IMD) రాబోయే మూడు లేదా నాలుగు రోజుల పాటు తూర్పు, తూర్పు మధ్య భారతదేశంలోని ఏకాంత ప్రదేశాలలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. బుధవారం ఉత్తర ఒడిశా, గురువారం తూర్పు మధ్యప్రదేశ్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
Mohali Love Murder: కిరాతకుడిగా మారిన సహోద్యోగి.. ఆఫీస్లోనే యువతి హత్య
-
Indiramma House: మోడ్రన్ టెక్నాలజీ వచ్చేసింది.. 12 రోజుల్లోనే ఇందిరమ్మ ఇంటి నిర్మాణం..
-
CM Revanth Reddy : కేసీఆర్ చర్చకు అసెంబ్లీకి రా.. పాలమూరును బొందపెట్టింది నువ్వే
-
Putin: విదేశాల ఒత్తిడికి భారత్ ఎన్నడూ లొంగలేదు.. ట్రంప్కు పుతిన్ స్ట్రాంగ్ మెసేజ్..
-
India-China: భారత్ జీడీపీ చైనాను మించిపోనుందా? అంతర్జాతీయ సంస్థ అంచనాలు ఇవే!
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!