Site icon NTV Telugu

రాజధానిలో రికార్డుస్థాయిలో వర్షం.. 13 ఏళ్లలో ఇదే తొలిసారి..

దేశ రాజధాని ఢిల్లీలో రికార్డు స్థాయిలో భారీ వర్షాలు కురిసాయి.. కుండపోత వర్షం దెబ్బకు వీధులు, రోడ్లు అన్నీ జలమయమయ్యాయి. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది.. ఈ రోజు ఉదయం 139 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది.. 13 ఏళ్లలో ఆగస్ట్‌ నెలలో ఒకే రోజు అత్యధిక వర్షపాతం నమోదు కావడం ఇదే తొలిసారి కావడం విశేషం.. ఈ భారీ వర్షంతో దేశ రాజధానిలో ఆరెంజ్‌ హెచ్చరిక జారీ చేశారు అధికారులు.. మరో రెండు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని ఐఎండీ హెచ్చరిస్తోంది.

Exit mobile version