దేశ రాజధానిలో స్వాతంత్య్ర దినోత్సవ సన్నాహాల మధ్య ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ భయంకరమైన ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ (ISIS) మాడ్యూల్ను ఛేదించింది. మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ను అరెస్టు చేసింది. అతడి నుంచి ఆయుధాన్ని కూడా స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. రిజ్వాన్ను ఢిల్లీలోనే అరెస్టు చేశారు. అరెస్టయిన ఉగ్రవాది రిజ్వాన్ అలీ ఢిల్లీలోని దర్యాగంజ్ ప్రాంతంలో నివాసి. పుణె మాడ్యూల్కు ప్రధాన నిర్వాహకుడు. గతేడాది జూలై 2023లో పూణే పోలీసుల కస్టడీ నుంచి తప్పించుకుని పరారీలో ఉన్నాడు. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ)తో సహా దేశంలోని అన్ని ఏజెన్సీలు చాలా కాలంగా నిందితుడి కోసం వెతకడంలో నిమగ్నమయ్యాయి. ఎన్ఐఏ మోస్ట్ వాంటెడ్ లిస్ట్లో చేరిన ఈ ఉగ్రవాదికి రూ.3 లక్షల రివార్డు కూడా ప్రకటించారు.
READ MORE: Jagga Reddy: నేటి పాలకులు కులం,మతం పేరుతో చిచ్చు పెడుతున్నారు
ఆగస్టు 15లోపు రిజ్వాన్ అలీని అరెస్టు చేయడం ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్కి భారీ విజయంగా మారింది. ఢిల్లీ పోలీసులు, ఎన్ఐఏ సహా అన్ని ఏజెన్సీలు ఇప్పుడు అతనిని విచారిస్తున్నాయి. అతని తదుపరి ప్రణాళిక గురించి సమాచారాన్ని సేకరించేందుకు ప్రయత్నిస్తున్నాయి. రాత్రి 11 గంటలకు అరెస్టు చేయగా ఆయుధాలు.. రెండు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. టెడ్ టెర్రరిస్ట్ రిజ్వాన్ అలీ గురించి ఆగస్టు 8, గురువారం ఎన్ఐఏకి రహస్య సమాచారం అందిందని ఢిల్లీ పోలీసులు తెలిపారు. దీంతో ఢిల్లీ పోలీసులు అతన్ని రాత్రి 11 గంటలకు ఢిల్లీలోని బయోడైవర్సిటీ పార్క్ సమీపంలోని గంగా బక్ష్ మార్గ్ లో అరెస్టు చేశారు. అరెస్టు సమయంలో, వాడి వద్ద 3 లైవ్ కాట్రిడ్జ్లతో కూడిన ఒక 30 బోర్ స్టార్ పిస్టల్, రెండు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. పేరుమోసిన ఉగ్రవాది రిజ్వాన్పై ఇప్పటికే ఢిల్లీ-ముంబైలో తీవ్రమైన క్రిమినల్ సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి.