Delhi : ఢిల్లీలో త్రిపుల్ మర్డర్.. పెళ్లి రోజే విషాదం.. తల్లిదండ్రులు, కూతురు దారుణ హత్య
- రాజధానిలో త్రిపుల్ మర్డర్
- పెళ్లి రోజే కన్నుమూసిన దంపతులు
- తల్లిదండ్రులు, కూతురు దారుణ హత్య
Delhi : ఢిల్లీలోని నెబ్ సరాయ్ ప్రాంతంలో ట్రిపుల్ మర్డర్ సంచలనం సృష్టించింది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురిని కత్తితో పొడిచి చంపారు. ఇంట్లో తల్లిదండ్రులు, కుమార్తె మృతదేహాలు లభ్యమయ్యాయి. హత్య జరిగిన సమయంలో కొడుకు మార్నింగ్ వాకింగ్కు వెళ్లి తిరిగి వచ్చి చూసేసరికి ముగ్గురూ హత్యకు గురయ్యారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.
Read Also:Tragedy: విషాదం.. మిద్దె కూలి ముగ్గురు మృతి
Triple murder in Delhi | Three people from a house including a man, his wife and daughter, in the Neb Sarai area of South Delhi were stabbed to death. Their son-fourth member of the family had gone out for a walk. Police are present at the spot. More details awaited: Delhi…
— ANI (@ANI) December 4, 2024
కుమారుడిని పోలీసులు విచారిస్తున్నారు. ఉదయాన్నే వాకింగ్కి వెళ్లానని చెప్పారు. ఇంట్లో తండ్రి రాజేష్, తల్లి కోమల్, సోదరి కవిత ఉన్నారు. తిరిగి వచ్చి చూసే సరికి ఇంట్లో ముగ్గురి మృతదేహాలు రక్తంతో కనిపించాయి. ముగ్గురిని కత్తులతో పొడిచి హత్య చేశారు. రాజేష్ స్వస్థలం హర్యానా. అతను చాలా సంవత్సరాల క్రితం ఢిల్లీకి వచ్చి నెబ్ సరాయ్ ప్రాంతంలోని డియోలీ గ్రామంలో నివసిస్తున్నాడు. చుట్టుపక్కల వ్యక్తుల నుంచి పోలీసులు సమాచారం సేకరిస్తున్నారు.
Read Also:Bradman Baggy Green: వేలంలో కోట్లు పలికిన బ్రాడ్మన్ ‘బ్యాగీ గ్రీన్’ క్యాప్
#WATCH | Delhi: Three people from a house including a man, his wife and daughter, in the Neb Sarai area of South Delhi were stabbed to death. More details awaited: Delhi Police
(Visuals from the spot) pic.twitter.com/aYSU48aC1G
— ANI (@ANI) December 4, 2024
కుటుంబంలో మిగిలిన కుమారుడు డిసెంబర్ 4 తన తల్లిదండ్రుల వివాహ వార్షికోత్సవం అని చెప్పాడు. బుధవారం తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో నిద్రలేచి వాకింగ్కు ఇంటి నుంచి బయటకు వెళ్లినట్లు తెలిపారు. 7 గంటల ప్రాంతంలో తిరిగి వచ్చేసరికి ముగ్గురూ హత్యకు గురయ్యారు. ఇంట్లో తల్లిదండ్రులు, సోదరి మృతదేహాలను చూసి ఆమె కేకలు వేసింది. దీంతో చుట్టుపక్కల నుంచి జనం గుమిగూడారు. ముగ్గురు వ్యక్తుల మెడపై కత్తితో దాడి చేసి హత్య చేశారు. ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
తాజావార్తలు
-
Mangli: మంగ్లీకి బిగ్ షాక్… ఇండస్ట్రీ నుంచి బహిష్కరించాలని ఫిర్యాదు!
-
MQ-4C Triton Drone: క్యూబా చుట్టూ అమెరికా ఉచ్చు? వెనిజులా సీన్ రిపీట్ అవుతుందా!
-
Motorola Edge 50: 1.5K pOLED డిస్ప్లే, 5,000mAh బ్యాటరీ, టెలిఫోటో కెమెరాతో మోటో ఫోన్..
-
CM Revanth Reddy: చంద్రబాబుకు నితీష్ కుమార్, షిండేల గతే పడుతుంది.. సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు..
-
PBSK Owner Preity Zinta: ప్రీతి జింటా స్టేడియంలో ఎందుకు కనిపించడం లేదో తెలుసా..? కారణం ఇదే..
ట్రెండింగ్
-
Apple Sharbat Recipe: అద్దిరిపోయే సమ్మర్ డ్రింక్.. ‘ఆపిల్ షర్బత్’.. ఎంతో చల్లగా, రిఫ్రెషింగ్గా..!
-
Miriyala Charu Recipe: జలుబు, జ్వరమా? ఐదు నిమిషాల్లో ఘాటైన ‘మిర్యాల చారు’.. అన్నమంతా దీనితోనే తినేస్తారు.!
-
Broccoli Soup Recipe : హెల్తీ అండ్ టేస్టీ.. ఇంట్లోనే క్రీమీ బ్రోకలీ సూప్.! కేవలం 20 నిమిషాల్లో రెడీ..!
-
Tubeless Tyre Puncture: టైర్ పంక్చర్ అయినా.. మరో 100 కి.మీ వరకు వెళ్లొచ్చు..! ఎలాగో తెలుసా?
-
Kids Wellness : పిల్లల ఆరోగ్యం పదిలంగా ఉండాలంటే.. ఈ హెల్త్ టెస్టులు తప్పనిసరి.!