Aravind Kejriwal : కేజ్రీవాల్ కు సుప్రీంకోర్టు షాక్.. జూన్ 2 లొంగిపోవాల్సిందే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Aravind Kejriwal : ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు సుప్రీంకోర్టు నుంచి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మధ్యంతర బెయిల్ను పొడిగించాలని పిటిషన్ దాఖలు చేయగా దానిని కోర్టు తిరస్కరించింది. కేజ్రీవాల్ దరఖాస్తును స్వీకరించేందుకు కోర్టు రిజిస్ట్రీ నిరాకరించింది. రెగ్యులర్ బెయిల్ కోసం ట్రయల్ కోర్టుకు వెళ్లే స్వేచ్ఛ కేజ్రీవాల్కు ఇచ్చింది. కేజ్రీవాల్ దరఖాస్తు విచారణకు అర్హమైనది కాదు. ఇప్పుడు సీఎం కేజ్రీవాల్ జూన్ 2న లొంగిపోవాల్సి ఉంటుంది.
మే 10న జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తా కేజ్రీవాల్కు మధ్యంతర బెయిల్ మంజూరు చేశారు. జూన్ 2న తీహార్ జైలులో లొంగిపోవాలని కోరారు. మే 17న పీఎంఎల్ఏ కేసులో అతని అరెస్టు చట్టబద్ధత పై సవాలు చేస్తూ ఈడీపై ధర్మాసనం తన తీర్పును రిజర్వ్ చేసింది. మంగళవారం, సుప్రీంకోర్టులోని మరో బెంచ్ కూడా కేజ్రీవాల్ పిటిషన్ను విచారించడానికి నిరాకరించింది. సీజీఐ డీవై చంద్రచూడ్ను సంప్రదించాలని కోరింది.
Also Read
- NSE IPO: రెండో రోజే NSE ఐపీఓ 100 శాతం సబ్స్క్రైబ్.. ఎగబడుతున్న ఇన్వెస్టర్లు..
- Mamata Banerjee: అభ్యర్థి ఔట్.. కాంగ్రెస్కు మమత మద్దతు: బెంగాల్ రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్..
- PM Modi: నిరుద్యోగులకు శుభవార్త.. రేపు 51 వేల మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందించనున్న మోడీ
- UPI Payments: పెట్రోల్ బంకుల్లో యూపీఐ పేమెంట్స్ బంద్..? డీలర్ల అసోసియేషన్ కీలక నిర్ణయం..
Read Also:Brij Bhushan Sharan : అదుపుతప్పిన బ్రిజ్భూషణ్ సింగ్ కుమారుడి కారు.. ఇద్దరు మృతి
పిటిషన్లో కేజ్రీవాల్ ఏం చెప్పారు?
అరవింద్ కేజ్రీవాల్ అకస్మాత్తుగా ఆరేడు కిలోల బరువు తగ్గినందున అనేక వైద్య పరీక్షలు చేయించుకోవడానికి మధ్యంతర బెయిల్ వ్యవధిని ఏడు రోజులు పొడిగించాలని సుప్రీంకోర్టును అభ్యర్థించారు. తిరిగి జైలుకు వెళ్లేందుకు కోర్టు నిర్దేశించిన జూన్ 2న కాకుండా జూన్ 9న లొంగిపోవాలని కేజ్రీవాల్ మే 26న దాఖలు చేసిన పిటిషన్లో పేర్కొన్నారు.
అతని బరువు ఆరేడు కిలోల వరకు తగ్గిందని, అతని కీటోన్ స్థాయి చాలా ఎక్కువగా ఉందని, ఇది తీవ్రమైన కిడ్నీ, గుండె జబ్బులు, క్యాన్సర్కు కూడా సూచిక అని పిటిషన్లో పేర్కొంది. ముఖ్యమంత్రికి పీఈటీ-సీటీ స్కాన్తోపాటు కొన్ని వైద్య పరీక్షలు నిర్వహించాల్సి ఉందని పిటిషన్లో పేర్కొన్నారు. మే 10న లోక్సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని జూన్ 1వ తేదీ వరకు అంటే 21 రోజుల వరకు కేజ్రీవాల్కు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. దాని ప్రకారం జూన్ 2న తిరిగి జైలుకు వెళ్లాల్సి ఉంటుంది. ఎక్సైజ్ పాలసీ స్కామ్కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో కేజ్రీవాల్ను అరెస్టు చేశారు. జూన్ 2న కేజ్రీవాల్ లొంగిపోవాలని కోర్టు ఆదేశించింది. దీనికి ఒకరోజు ముందుగా ఏడో, చివరి దశ ఓటింగ్ జరగనుంది.
Read Also:Today Gold Rate: వరుసగా మూడో రోజు పెరిగిన బంగారం ధరలు.. నేటి రేట్స్ ఇవే!
ఈడీ ఆరోపణ ఏమిటి?
ఢిల్లీలో జరిగిన మద్యం కుంభకోణం కేసులో ఈడీ కేజ్రీవాల్ పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీని నిందితుడిగా చేర్చింది. ఈ కుంభకోణంతో ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్కు, పార్టీకి సంబంధం ఉందని ఈడీ కోర్టుకు తెలిపింది. ఈ కుంభకోణంలో ప్రధాన కుట్రదారు అరవింద్ కేజ్రీవాల్ అని, ఇందులో ఇతర ఆప్ నేతలు, ప్రైవేట్ వ్యక్తులు కూడా ఉన్నారని ఈడీ ఆరోపించింది.
తాజావార్తలు
-
Warren Buffett: తండ్రి స్థానంలో కొడుకు.. వారెన్ బఫెట్ సామ్రాజ్యానికి కొత్త రారాజు ఇతడే!
-
Danam Nagender : దానం నాగేందర్ ఉదంతంపై హరీష్ రావు కీలక వ్యాఖ్యలు..
-
NSE IPO: రెండో రోజే NSE ఐపీఓ 100 శాతం సబ్స్క్రైబ్.. ఎగబడుతున్న ఇన్వెస్టర్లు..
-
Mamata Banerjee: అభ్యర్థి ఔట్.. కాంగ్రెస్కు మమత మద్దతు: బెంగాల్ రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్..
-
PM Modi: నిరుద్యోగులకు శుభవార్త.. రేపు 51 వేల మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందించనున్న మోడీ
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్పై భారత్ ఘన విజయం.. సెమీస్కు దూసుకెళ్లిన హర్మన్సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..